🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🔥పంచాంగం🔥
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 14 - 01 - 2026,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
*_నేటి విశేషం_*
*భోగిపండుగ*
*షట్తిల ఏకాదశి*
*మకర సంక్రమణం రా9.11 లకు*
*_భోగి పండుగ విశిష్టత....!!_*
పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం.
దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది.
ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు "భోగి మంటలు "అంటారని మన అందరికి తెలిసింది.
*భోగి అనే పదం ఎలా వచ్చింది ?🌹*
ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు 'శాస్త్రీయ కారణాలు' తెలుసుకుందాం.
'భుగ్' , భగ' అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది.
భోగం అంటే సుఖం, పూర్వం
ఈ దినమే శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.
దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు.
అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల (bonfire) రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి..
రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు.
భోగి అనగానే చిన్న పిల్లల మీద రేగుపళ్లు పోస్తారు.
ఆ రోజున రేగుపళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి.
రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు.
భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది.
తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది, భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది..
*పురాణాల ప్రకారం..!!*
రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు.
శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట.
ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు.
ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు.
ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు.
సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది.
సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.
కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే..
12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.
శ్రీ మహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే..
అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట.
*🔥భోగి మంటల వెనక రహస్యం ఏంటి ?🔥*
బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది.
కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే, శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.
సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని.
కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా.
ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు, వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు.
దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి.
ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది.
దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.
చలికాలంలో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి, ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి, వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది.
భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు, అవి కాలడానికి ఆవు నెయ్యిని కూడా వేసేవారు...
స్వస్తి...🙏🌹
*_🔥శుభమస్తు🔥_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్
#📅పంచాంగం & ముహూర్తం 2023