*బృహస్పతి వాసర (గురువారం) ఆనంద శుభోదయం.*
🪷🪷
*ఫాల్గుణ మాసం బహుళ నవమి తెల్లవారుజామున 4.26 వరకు.*
*ప్రయాణానికి ధాత్రి యోగం రాత్రి 11.06 నుంచి ఉదయం 6.08 (13.3.2026) వరకు.దశమి గురువారం సిధ్ధ యోగం 4.26 a.m.13.3.2026 నుంచి 6.08 a.m.13.3.2026.*
🪷🪷🪷
___________
*చరిత్రలో నేడు 12th March*👇👇👇
అమెరికాలో *ఉద్యోగం చేసే మాతృమూర్తుల దినోత్సవం* జరుపుకుంటున్నారు.
💐💐💐
___________
*వరల్డ్ గ్లకోమా డే*.
నీటి కాసులు అని పిలవబడే నేత్ర 👀 సంబంధిత వ్యాధి అవగాహన దినోత్సవం.
____________
*12. 3. 1930*
*శాంతియుతంగా, అహింసా మార్గంలో* గాంధీ నేతృత్వంలో దండి ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం ప్రారంభం అయింది.
భారతీయులు ఉప్పు తయారు చేసుకోవడం మీద బ్రిటిష్ వాడు పన్ను వేయడం, దానిని వ్యతిరేకిస్తూ గాంధీ 375 కిలోమీటర్ల పాదయాత్ర ను 78 మంది అనుచరులతో 26 రోజులపాటు నిర్వహించి దేశం మొత్తం ఆకర్షించడం జరిగింది. దేశవ్యాప్తంగా 90000 మంది ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం జైలులో పెట్టింది.👉😳మన సమాజంలో ఉప్పు నిత్యావసర వస్తువు మరియు చాలా ధర తక్కువగా ఉంటుంది.కానీ, దీనిమీద బ్రిటిష్ వాడు పన్ను వేయడం, ఆ పన్నును వ్యతిరేకిస్తూ ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ పెద్దాయన పెద్ద ఉద్యమం చేయడం, ఆ బ్రిటిష్ గజదొంగల ముఠా ఎంతో దయతో ప్రజలు తమ ఇంటి అవసరాలకు తయారు చేసుకొనే ఉప్పుకు మాత్రమే పన్ను రద్దు చేయడం.. (వ్యాపార అవసరాలకు చేసుకునే ఉప్పుకు పన్ను తొలగించలేదు) ఈ మాత్రం దానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం.. ప్రజలు కూడా తమకు బ్రిటిష్ దోపిడి దొంగల నుండి మనకు స్వాతంత్ర్యం వచ్చిందేమో అన్నంతగా ఖుషీ అవడం.... రాజనీతిజ్ఞులకు అర్థం కావడం లేదు. మిగిలిన అనేక పెద్ద విషయాలలో బ్రిటిష్ వాడి దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరలించారేమో అని అనిపిస్తుంది.
___________
*12. 3. 1954*
*కేంద్ర సాహిత్య అకాడమీని* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు.
______________
*12. 3.1969*
కల్పకం లో అణు పరిశోధక సంస్థను ప్రారంభించారు. దీనిని 18.12.1985 తేదీన *ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్* గా పేరు మార్చి స్టిక్కర్ తగిలించిన *ఇందిరా గాంధీ కుమారుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ.*
ఈ విధంగా దేశంలోని అనేక సంస్థలకు, కార్యక్రమాలకు, అవార్డులకు, పథకాలకు వీళ్ళ స్వంత కుటుంబ సభ్యులైన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లను వేలాదిగా పెట్టుకోవడం, స్టిక్కర్లను తగిలించడం, దేశ ప్రజలలో అనేక విమర్శలకు దారి తీసింది. దేశానికి సేవ చేసిన అనేకమంది గొప్ప గొప్ప వాళ్ళ మరియు స్థానికులైన మేధావులకు సముచితమైన గౌరవం, గుర్తింపు ఇవ్వనందుకు దశాబ్దాల పాటు సాగిన వీరి కుటుంబ పాలన విమర్శలకు తీవ్రంగా గురి అయింది.
___________
*12. 3.1988*
దండి ఉప్పు సత్యాగ్రహం యొక్క 58వ వార్షికోత్సవాన్ని *ప్రజలందరికీ గుర్తు చేయడానికి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ* సబర్మతి ఆశ్రమం నుంచి 32 కిలోమీటర్ల యాత్రను చేసారు.
____________
*12.3.1993*
*పక్కా ప్రణాళిక ద్వారా తీవ్రవాదుల ద్వారా 12 వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ముంబాయి నగర పశ్చిమ తీరం. కనీసం 300 మంది మృతి. వేలాది మందికి తీవ్ర గాయాలు.. ముంబాయి స్టాక్ ఎక్స్చేంజి వద్ద మొదటి పేలుడు. ముంబాయిలో తీవ్రమైన ఆస్తి నష్టం , ప్రాణ నష్టంతో ప్రజలు విలవిల.*
👇👇👇
*కాంగ్రెస్ పరిపాలనలో తీవ్రవాదులకు స్వేచ్ఛ పెరిగిపోయింది అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. కాశ్మీరు దాటి దేశమంతటా కూడా తీవ్రవాదుల కార్యకలాపాలు,బాంబు పేలుళ్లు, విధ్వంసాలు పెరగటం గమనార్హం.*
😰😰😰
___________
🙏🙏🙏 #చరిత్ర #😁Hello🙋♂️ #🇮🇳దేశం #🏛️రాజకీయాలు