*మానవాళికి ఎక్కు వ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి.*
*స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.*
*_అశ్వత్థమేకం పిచుమందమేకం_*
*_న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|_*
*_కపిత్థ బిల్వాఁ_* *_మలకత్రయాంచ పంచామ్రవాపీ నరకన్ నపశ్యేత్||._*
*_అశ్వత్థ = రావి (100% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 1_*
*_పిచుమందా = వేప (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)- 1_*
*_న్యగ్రోధ = మర్రి చెట్టు (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 1_*
*_తింత్రిణి = చింత (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 10_*
*_కపిత్థ = వెలగ (80% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది) - 3_*
*_బిల్వ = మారేడు (85% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది) - 3_*
*_అమలకా = ఉసిరి_* *(74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది) - 3*
*ఆమ్రాహ్ = మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది) - 5_*
*అర్థం*
*ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)*
*ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం ఇంకా ఏమీ తప్పులేదు, మన తప్పును మనం సరిదిద్దుకోవచ్చు.*
*గుల్మోహర్, నీలగిరి లాంటి చెట్లు మన పర్యావరణానికి ప్రాణాంతకం.*
*పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు మనమే గొప్ప హాని చేసుకున్నాం*.
*రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది*.
*ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్ను పెంచుతాయి.*
*అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి*.
*ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం.* *యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి*.
*ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది*.
*గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు*.
*_మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ|_* *_పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||_*
*భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు*.
*రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక రావి, మర్రి, వేప తదితర చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది*.
*తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.*
*మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము.*
*భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.*
*రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి * మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.*
*ఉన్న చెట్లను కాపాడుకోకపోతే.... రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది.*
*ప్రతి మనిషి ఒక్క రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ॥ 700/- అయితే 3 సిలిండర్లకు రూ॥ 2100/- అవుతుంది. అంటే*,
*ప్రతి సంవత్సరం ఆక్సిజన్ను కొంటే ఒక్కో మనిషి రూ 7,66,000/- ఖర్చు అవుతుంది ఒక్క మనిషి యొక్క సగటు వయస్సు 65సంలు అనుకుంటే, ఆక్సిజన్ కొనడానికి దాదాపుగా రూ॥ 5 కోట్లు కావాలి.*
*కాని అంత విలువ చేసే ఆక్సిజను మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను నాటండి.*
#మన సంప్రదాయాలు సమాచారం