Bhoopal Mandala
660 views
18 days ago
హనుమకొండ, తేదీ: 25-03-2026 రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ DCC బ్యాంకు ఉద్యోగులపై జరుగుతున్న మత వివక్షతపై హనుమకొండ కలెక్టర్ కు ఫిర్యాదు. వరంగల్ డీసీసీ బ్యాంక్ సీఈవో వాజీర్ సుల్తాన్ తన అధికార దుర్వినియోగంతో బ్యాంకు ఉద్యోగుల మధ్య హిందూ, ముస్లిం అనే మత ప్రాతిపదికన విభజన సృష్టిస్తున్నారని ముఖ్యంగా హిందూ పండగల సమయం లో అందరికీ సాధారణ సెలవు అమలు చేయగా, రంజాన్ సందర్భంగా హిందూ ఉద్యోగులకు విధులు కేటాయించి, ముస్లిం ఉద్యోగులకు మాత్రమే సెలవు కొనసాగించడం వంటి వివక్షత చర్యలు చేపడుతున్నారని రాష్ట్రీయ హిందూ పరిషత్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల భూపాల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అలాగే హిందూ ఉద్యోగులు తమ తీర్థయాత్రల కోసం సెలవులు కోరినపుడు నిరాకరించడం, ముస్లిం ఉద్యోగులకు మాత్రం తక్షణమే సెలవులు మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. ఉద్యోగులను మతాల వారీగా విడదీసి విధులు కేటాయించడం, హిందూ ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించడం, ప్రశ్నిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని, సస్పెండ్ చేస్తానని బెదిరించడం జరుగుతోందని తెలిపారు. ఈ విధమైన చర్యల వల్ల ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతూ భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వ కార్యాలయాల్లో మత వివక్షత లేకుండా అందరూ సమానంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలనీ, సంబంధిత అధికారిపై తక్షణ విచారణ జరిపి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను మండల భూపాల్ కోరినట్లు తెలిపారు. వారితో పాటు RHP దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీకటి రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడిపోజు సంతోష్ , ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పల్లపు అశోక్ , కోర్ కమిటీ సభ్యులు కలకోటి శ్రీధర్ , జంగం ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ హిందూ పరిషత్ - Rashtriya Hindu Parishad Rashtriya Hindu Parishad Endowment department PMO India Telangana CMO Telangana State Police Anumula Revanth Reddy Narendra Modi Collector Warangal- U Rashtriya Hindu Parishad Telugu Warangal Police Commissionerate Konda Surekha Gwmc Warangal Danasari Seethakka Naini Rajender Reddy PM Narendra Modi Election Commission of India #ap_rhp #tg_rhp #rhptelugu #వరంగల్ #ధర్మం #Telangana #follower #andrapradesh #భారత్ #🤘Lets Moj