*సౌమ్య వాసర (బుధవారం) ఆనంద శుభోదయం.*
💐🌸
*చైత్ర మాసం శుక్ల పక్ష చతుర్దశి ఉదయం6.33 వరకు, తదుపరి రోజంతా పౌర్ణమి.చైత్ర పూర్ణిమ వ్రతం, మహాలక్ష్మి దేవికి పాలు నైవేద్యంతో పూజించడం శ్రేష్టం. తిరుమల శ్రీవారి వసంతోత్సవం సమాప్తి. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం.*
*సర్వార్ధ సిద్ధ యోగం మధ్యాహ్నం 3:46 నుంచి రేపటి ఉదయం 5:52 వరకు., ప్రయాణమునకు వర్ధమాన ఆనంద యోగములు ఉదయం 5.52 నుంచి రోజంతా*
🙏🙏🙏
______
*చరిత్రలో నేడు 1st April.*
*1.4. 1869*
భారతదేశంలో ఆదాయపు పన్ను విధించబడినది.
అదేవిధంగా *భారతదేశంలో మొదటిసారిగా విడాకుల చట్టము* తీసుకువచ్చిన బ్రిటిష్ పాలకులు.
___________
*1.4.1889*
కేవలం నలుగురు సభ్యులతో ప్రారంభమై ఇప్పుడు 40 లక్షల మంది సభ్యులతో జాతీయ వాదంతో, సేవాభావంతో కొనసాగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ను స్థాపించిన *Dr. కేశవరావు బలిరాం హెడ్గేవార్* జన్మించారు.
వీరు వైద్యులు, అత్యంత ఆదర్శవంతమైన జాతీయ భావాలు కలిగిన వారు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామానికి చెందిన వీరి యొక్క పెద్దలు నాగపూర్ కు వలస వెళ్ళినారు. వీరి పెద్దలు తెలుగు వారు.
వీరికి జయంతి నివాళులు.
🙏🙏🙏
_____
*1.4.1912*
బ్రిటిష్ దోపిడీ, వలస పాలకుల రాజధానిని *కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చుకున్నారు.* భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ప్రారంభం అయినప్పటి నుండి కలకత్తానే రాజధానిగా కొనసాగింది. 1905లో మతప్రాతిపదికన బెంగాల్ విభజన తర్వాత దేశంలో అల్లకల్లోల పరిస్థితులు వచ్చాయి. బెంగాల్ విభజనను హిందువులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. కానీ, బెంగాల్ విభజనను ముస్లింలు స్వాగతించారు. కానీ, హిందువుల అశాంతి ,తిరుగుబాటు వలన తప్పనిసరిగా బెంగాల్ విభజనను బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయవలసి వచ్చింది. దానితో ముస్లింలకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ముస్లింలను శాంతింప చేయడానికి మరియు మచ్చిక చేసుకోవడానికి అంతకుముందు మొగలులు పరిపాలించినప్పుడు రాజధానిగా కొనసాగిన ఢిల్లీని ఇప్పుడు బ్రిటిష్ వలస దోపిడీ ప్రభుత్వం రాజధానిగా ఎన్నుకోవడం ముస్లింలను శాంతింప చేయడానికే అని రాజకీయ పండితులు విశ్లేషించారు.
____
*1.4.1935*
*భారతీయ రిజర్వ్ బ్యాంక్* స్థాపించబడినది.
_________
*1.4 .1962*
*తూనికలు కొలతలు శాఖలో మెట్రిక్ సిస్టమును* ప్రారంభించిన ప్రభుత్వము.
_____
*1.4.1969*
తారాపూర్ లో మొదటి *భారతీయ అణు రియాక్టర్* ప్రారంభించబడినది.
_____
*1.4.18 78*
ప్రజల సందర్శనార్థం కలకత్తా మ్యూజియం తెరవడం ప్రారంభమైంది.
__________
*April 1st*👇👇👇
నిత్య జీవనంలో *పొగాకును దూరంగా ఉంచుకోండి* అంటూ అమెరికాలో పొగాకు నష్టాల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు.
__:____
అమెరికాలో *మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అవేర్నెస్ మంత్* జరుపుకుంటున్నారు.
________
*ఒడిషా* ( ఒరిస్సా )రాష్ట్ర అవతరణ దినోత్సవం.
(1.4.1936)
🙏🙏🙏 #😁Hello🙋♂️ #📰జాతీయం/అంతర్జాతీయం #చరిత్ర