#🗞️డిసెంబర్ 1st ముఖ్యాంశాలు💬
*దిత్వా తుఫాను జిల్లాలో అక్కడక్కడ వర్షాలు*
*రైతులు అప్రమత్తంగా ఉండాలి*
*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్*
శ్రీకాకుళం,డిశంబరు,1: దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు ధాన్యం నూర్పులు జరిగి ధాన్యం కళ్లాల్లోనే ఉంటే రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు 50 శాతం సబ్సిడీ పై అందిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంటే అందుబాటులో ఉన్న ధాన్యం సేకరణ కేంద్రానికి వెళ్లి విక్రయాలు చేయాలన్నారు.
#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🌅శుభోదయం #🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬