ప్రముఖ తెలుగు రచయిత,అభ్యుదయ కవి,సాంఘిక సంస్కర్త,హేతువాది,సాహితీకారుడు అయిన శ్రీ గురజాడ అప్పారావుగారి 115వ జయంతి నేడు! ( 30 - 11 - 2025)!
లేదా
సాంఘిక దురాచారాలను తాను వ్రాసిన కన్యాశుల్కం నాటకం ద్వారా తులనాడిన గురజాడ అప్పారావు గారి 115వ వర్ధంతిని పురస్కరించుకొని!
యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ ప్రముఖ తెలుగు రచయిత,సాంఘిక సంస్కర్త,హేతువాది, అభ్యుదయ కవి,సాహిత్యకారుడు అయిన శ్రీ గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21న జన్మించారు. ముఖ్యంగా గురజాడ గారు తన స్ఫూర్తిదాయక రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు విశేషంగా ప్రయత్నించిన ఓ మహాకవి.తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహిత్యకారులలో ఒకరు ఈ హేతువాది అయిన గురజాడ అప్పారావు గారు.19వ శతాబ్దం లోను,20వ శతాబ్ది మొదటి దశకంలోను అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలు పొందుతూనే వున్నాయి.అంతేకాదు అతను ప్రజలందరికి అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశాడు.అదేమాదిరి సాంఘిక దురాచారాలను ఎండగడుతూ ఆయన రచించిన ' కన్యాశుల్కము ' నాటకానికి సాహితీ లోకంలో ఓక ప్రత్యేక స్థానం వుంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం,మదురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి.అభ్యుదయ కవితా పితామహుడు,కవిశేఖర అనే బిరుదులు సైతం కలిగిన గురజాడ అప్పారావు గారు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు.ఇక గురజాడ రచనల్లో కన్యాశుల్కము ( నాటకము ) అగ్రగణ్యమైనది.కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన అత్యుత్తమ రచనల్లో ఒకటి.ఇక 1892లో ప్రచురించిన మెదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909లో రెండవ కూర్పును ప్రచురించాడు.వాడుక భాషలో విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈనాటికీ పాఠకులను అలరిస్తూనే వుంది.ఈ నాటకం కన్నడం,ప్రెంచి,రష్యన్,ఇంగ్లీషు ( 2 సార్లు ),తమిళం,హిందీ (2 సార్లు ) భాషల్లోకి అనువాదమైంది.అదేవిధంగా గురజాడ వారి 150వ జయంతి సందర్బంగా మానస ఫౌండేషన్ హయదరాబాదు స్టేట్ ఆర్చీప్సూలో భద్రం చేసుకున్న గురజాడ రికార్డు నంతా పరిశీలించి ' గురజాడలు ' పేరుతో రెండు వేల పేజీల ' గురజాడ లబ్ద సమగ్ర రచనల సంపుటం ' అచ్చు వేశారు.ఇంకాచెప్పుకుంటూపోతే గురజాడ మరణం తరువాత కన్యాశుల్కంపై ఎన్నో వివాదాలు చేలరేగాయి.అవి అసలు అతను రాయనేలేదని, వేరేవరో రాస్తే,తన పేరు వేసుకున్నారని ఒకటి,అతను ఇంగ్లీషులో రాసే వేరే ఒకాయన దానిని తెలుగులోకి అనువాదించారని మరొకటి.ఇలాగ కొన్ని వివాదాలు సైతం చేలరేగాయి.చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలు అని తేలిపోయాయి.అయితే ఈ వివాదాలన్నీ కూడా గురజాడ మరణం తర్వాత వచ్చినవే.ఇన్ని వివాదాల మధ్య కూడా గురజాడ వారి ' కన్యాశుల్కం ' నాటకం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది.అంటే ఈ నాటకం ఎంతగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసిందో మనం ఇట్టే ఊహించవచ్చు.అదేమాదిరి ఈ కన్యాశుల్కం నాటకం 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకం కూడా.
ఏదిఎమైన గురజాడ అప్పారావు రచించిన పలు గేయాలలో ప్రముఖమైనది ' దేశమును ప్రేమించమన్నా,మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టబెట్టవోయ్,గట్టిమేల్ తలపెట్టవోయ్ '. అదేమాదిరి ఆయనగారు వ్రాసిన మరో విశిష్ట కవిత ' సొంత లాభం కొంత మానుకొని,పొరుగువారికి తోడుపడవోయ్,దేశమంటే మట్టి కాదోయ్,దేశమంటే మనుషులోయ్ అనే కవిత ఏకంగా మన ప్రియతమ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని గారిని సైతం ఎంతగానో ఆకట్టుకుంది.ఏమైనా తెలుగు సాహితీ ప్రపంచంలో ఆయనది ఓక సువర్ణ అధ్యాయం. ఓక విధంగా చెప్పాలంటే ఈ తెలుగు సాహిత్యం బ్రతికి బట్ట కలిగినంత కాలం సాంఘిక దురాచారాలను తులనాడుతూ గురజాడవారు రచించిన రచనలు, కవితలు ఎప్పటికి ఓ చిరంజీవిగా వర్దిల్లుతూనే ఉంటాయి అనే మాట అక్షర సత్యం.అన్నింటికి మించి దురాచారాలు,మూఢ నమ్మకాల కట్టుబాట్లతో మగ్గిపోతున్న మానవజాతిని మేల్కొలిపి వారిలో ఎనలేని చైతన్యాన్ని రేకేత్తించి వారి జీవితాలలో సరికొత్త వెలుగులు ప్రసరింపజేసిన గురజాడ అప్పారావు గారు ఈ సమాజం,ఈ సమాజంలోని యావత్తు ప్రజానికాన్ని మేల్కొలిపిన అసలు సిసలు మానవతావాది,ఓక గొప్ప సంఘ,సాంఘిక సంస్కర్త అనడంలో ఎలాంటి సందేహనికి తావులేదు.అమర్ రహే,అమర్ రహే,జోహార్ గురజాడ అప్పారావు గారు!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#✍️ గురజాడ అప్పారావు గారి వర్ధంతి (పుణ్యతిథి)🌹