𝓓𝓻.𝓖𝓪𝓷𝓰𝓾 𝓜𝓪𝓷𝓶𝓪𝓭𝓱𝓪𝓻𝓪𝓸
585 views
#🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ సర్దార్ జయంతి సందర్భంగా ఐక్యతా యాత్ర ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపు పెద్ద ఎత్తున యువత భాగస్వామ్యులు కావాలి రాష్ట్ర కో-కన్వీనర్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు శ్రీకాకుళం, అక్టోబర్‌ 25 : ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా జిల్లాలో నిర్వహించే 'సర్దార్‌@150 యూనిటీ మార్చ్‌' (ఐక్యత యాత్ర)లో యువతతో సహా అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్ ఖాన్‌ కోరారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌ 6, 2025న 'మై భారత్‌' నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన 'సర్దార్‌@150 యూనిటీ మార్చ్‌'ను ప్రారంభించిందని అన్నారు. మంత్రిత్వ శాఖ ఇచ్చిన లక్ష్యం మేరకు జిల్లా స్థాయిలో మూడు రోజుల పాదయాత్రలు (అక్టోబర్‌ 31 - నవంబర్‌ 25, 2025) చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని జిల్లాలను కవర్‌ చేస్తూ 3 రోజుల పాటు పాదయాత్ర చేపడతారని, అక్టోబర్‌ 31, ఉదయం 07.00 గంటలకు సూర్య మహల్‌ జంక్షన్‌ నుండి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ ఆడిటోరియం వరకు సుమారు 500 మంది పౌరులతో మొదటి జిల్లా స్థాయి పాదయాత్ర ఉంటుందని, అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమం, సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ, దేశంలోని సంస్థానాలను విలీనం చేసి, బలమైన భారత దేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని కొనియాడారు. ఆయన 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, జిల్లాలో కూడా ప్రజలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నందున అన్ని వర్గాల ప్రజలు, యువజన సంఘాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, ఎన్జీవో సంస్థలు పాల్గొని ఆత్మనిర్భర్‌ భారత్‌ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, సమావేశాలు, మూడు రోజుల పాదయాత్రలు తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. మై భారత్‌ ఆధ్వర్యంలో విక్షిత్‌ భారత్‌ పాద యాత్రలు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ పరిధిలోని 'మై భారత్‌' ద్వారా విక్షిత్‌ భారత్‌ పాద యాత్రలు నిర్వహిస్తోందని అన్నారు. మై భారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె. వెంకట్‌ ఉజ్వల్‌ మాట్లాడుతూ జాతీయ గౌరవాన్ని పెంపొందించడానికి, యువతలో ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి స్మారక, భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా రాష్ట్ర నిర్మాణంలో 'జన్‌ భాగీదారీ' అనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలు https://mybharat.gov.in/pages/unity_march పోర్టల్ ద్వారా నిర్వహించబడుతున్నాయని, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.