#నూతన మద్యం పాలసీ విధానం⁉️
*కంచికి చేరని లిక్కర్ కట్టు కథలు❗*
SEPTEMBER 9, 2025🍾
లిక్కర్ కేసుపై విచారిస్తున్న సిట్ అధికారులు సినిమా రచయితల్ని మించిపోయారు. అంతిమ లబ్ది బిగ్బాస్కు చేరిందని ఆధారాలుంటే, ఆయన్ను అరెస్ట్ చేయకుండా సానుభూతి ఎందుకు చూపుతున్నారో అర్థంకాని పరిస్థితి లిక్కర్ స్కామ్పై నిత్యం కట్టుకథలు అల్లడానికి ప్రభుత్వ అనుకూల మీడియాకు ముడిసరుకు అందించడంలో ఉద్దేశం ఏంటో విచారణ అధికారులకే తెలియాలి.
లిక్కర్ వ్యాపారంలో భారీగా స్కామ్ జరిగిందని, అంతిమ లబ్ధి బిగ్బాస్కి దక్కిందని కొన్ని నెలలుగా టీడీపీ పత్రికలు రాస్తున్నాయి. అదే నిజమైతే, బిగ్బస్ను అరెస్ట్ చేయకుండా అడుకుంటున్నదెవరో కూడా చెప్పాల్సిన అవసరం వుంది. లిక్కర్ను అడుపెట్టుకుని, భారీగా ప్రయోజనం పొందిన వాళ్లను అరెస్ట్ చేయకుండా, ఎవరెవరినో జైలుకు పంపడంలో సిట్ ఉద్దేశం ఏంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది.
తాజాగా మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్బాస్ పెట్టుబడులు పెట్టాడని మరో కథ డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా రూ.400 కోట్లు తరలించారట! ఆఫ్రికా ఖండంలోని జాంబియాలో మెటల్, మైనింగ్, ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైందని రాసుకొచ్చారు. ఇదే కథనం లోపలికి వెళితే.. అన్నీ అనుమానాలే తప్ప, ఆధారాలు కనిపించవు.
లిక్కర్ స్కామ్పై విచారణ అంటూ ఏడాదిగా అదే పనిలో సిట్ నిమగ్నమైంది. అదేంటో గానీ, రోజుకో కట్టుకథ.
ఆధారాలు దొరికాయని ఒకరోజు, తవ్వి తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు దురొక రోజు కథనం, ఇవన్నీ కూడా వైఎస్ జగన్, ఆయన పార్టీ నాయకుల్ని ప్రజలో చులకన చేయడానికే తప్ప, మరే ఉద్దేశం కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.. మరొక వైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్స్ వస్తున్నాయి.
లిక్కర్లో రూ.3,500 కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిట్ ఆరోపణలే తప్ప, ఆధారాల్ని న్యాయస్థానానికి సమర్పించని వైనం. బిగ్బాస్ కేంద్రంగా భారి అవినీతి అంటూ కథనాల ద్వారా, ఎప్పటికీ కంచికి చేరని కట్టుకథలు. ఇవన్నీ రాజకీయంగా తమను బద్నాం చేసే కుట్రలో భాగమే అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.