బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2.1K views
#😰ప్రముఖ నటుడు ధర్మేంద్రకు చివారి వీడ్కోలు బాలీవుడ్ దిగ్గజ నటుడు,హీ మ్యాన్ గా పెరుగాంచిన ధర్మేంద్రజీ ఇక లేరు! ( 24 - 11 - 2025)! లేదా అటు రొమాంటిక్ హీరోగా,ఇటు యాక్షన్ హీరోగా తన కంటూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓక స్టార్ డమ్ ను సంపాదించుకున్న ధర్మేంద్రజీ దివికేగిన వైనం! బాలీవుడ్ హీ మ్యాన్ గా,అశేష భారతదేశ సినిమా ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సీనియర్ నటుడు,లోక్ సభ మాజీ ఎంపీ,అన్నింటికి మించి దయ గుణం మెండుగా గల ఓక మంచి మానవతావాది ధర్మేంద్రజీ ఇకలేరు.గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈ ఎవర్ గ్రేన్ హీరో,యాక్షన్ కింగ్ గా అందరికి సుపరిచితుడు అయిన ధర్మేంద్ర గారు కోలుకున్నట్లే కోలుకొని దురదృష్టవశాత్తు కానరాని లోకాలకు తరలివెళ్లడం అటు బాలీవుడ్ సినిమా పరిశ్రమకు,ఇటు ఆయన కుటుంబసభ్యులకు తీరనిలోటు.ఇక ఈ విషాద సమయాన ధర్మేంద్రజీ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓక తారజువ్వలా,ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైపైకి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ధర్మేంద్రజీ సినీ ప్రస్థానం విషయానికి వస్తే అర్జున్ హింగోరాని దర్శకత్వం వహించిన ' దిల్ బీ తేరా హమ్ బీ తేరే ' (1960) సినిమాతో ధర్మేంద్రగారు బాలీవుడ్ చిత్రసీమలో నటుడుగా అడుగుపెట్టారు.ఇక ఆ తర్వాత ' బాయ్ ఫ్రెండ్,బందినీ,అనుపమ,ఆయా సావన్ జూమ్ కే ' వంటి సినిమాలతో నటుడిగా తనకంటూ సినిమా పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే షోలే,ధర్మవీర్,చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్,డ్రీం గర్ల్ వంటి చిత్రాలతో బాలీవుడ్ సూపర్ హిట్స్ అందుకొని బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓక స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు ఈ సీనియర్ నటుడు ధర్మేంద్రజీ. ఓక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో అటు రొమాంటిక్ హీరో గా,ఇటు యాక్షన్ హీరోగా ఓక వెలుగు వెలిగారు ఈ అల్ టైం గ్రేట్ ధర్మేంద్ర గారు అనే మాట అక్షర సత్యం. అంతేకాదు ' ఆయే మిలన్ కీ బేలా ' వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ తరహా పాత్రలు సైతం పోషించారు ధర్మేంద్ర గారు.అదేమాదిరి 1966లో వచ్చిన ' పూల్ ఔర్ పత్తర్ ' సినిమా ఆయనకు ఎనలేని కీర్తి,ప్రతిష్టలు తీసుకువస్తే,1971లో విడుదలైన ' మేరా గావ్ మేరా దేశ్ ' లో యాక్షన్ హీరోగా సైతం స్థిరపడ్డారు ధర్మేంద్ర గారు.ఇక రొమాంటిక్ హీరోగా ప్యార్ హి ప్యార్,ఆయా సావన్ ఘుమ్ కే,మేరే హమ్ దమ్ మేరే దోస్త్ ' వంటి చిత్రాలు ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.అన్నింటికి మించి ' రాజా జానీ ' (1972),జుగ్ను ( 1973) వంటి చిత్రాలు ఆయన్ను యాక్షన్ హీరోగా మరింతగా నిలబెట్టాయి.ఇక అల్ టైం సూపర్ హిట్ మూవీ ' షోలే ' ( 1975) చిత్రానికి ఆయన అప్పట్లోనే 1.5 లక్షల పారితోషికం తీసుకున్న ఘన చరిత్ర ఈ ధర్మేంద్ర గారిది.ఆ సినిమా నటీ నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్నది ధర్మేంద్రగారే కావడం ఓక గొప్ప విశేషం.ఇక ఆయన తన జీవిత భాగస్వామి,అలనాటి అందాల తార హేమమాలినితో కలిసి నటించిన తుమ్ హాసిన్ మై జవాన్,షరాఫత్,సీతా ఔర్ గీతా,రాజా జానీ,జుగ్ను, ప్రతిజ్ఞ వంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ నిలిచి,వెండితెరపై హిట్ పెయిర్ గా నిలిచారు వీరిరువురు.ఇక ఆయన 1983లో విజేత ఫిలింస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి బేతాబ్,ఘా,యల్,బర్సాత్ తదితర చిత్రాలను నిర్మించారు.తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్ తో తీసిన ఘాయల్ ' సూపర్ హిట్ గా నిలిచింది.ఇక ఆయన కుమారులు బాబీ డియోల్,సన్నీ డియోల్ లతో కలిసి ' అప్నే,,యమ్లా,పగ్లా వంటి సినిమాల్లో నటించారు కూడా.అయితే ధర్మేంద్రగారు నటించిన చివరి చిత్రం ' ఇక్కీస్ ' ( 2025).అయితే శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కావాల్సి వుంది.ఇక రాజకీయాల్లో సైతం ప్రవేశించి 2004లో రాజస్థాన్ లోని బికనీర్ లోక్ సభ ఎంపీగా పోటీ చేసి గెలిచారు ధర్మేంద్రజీ.అయితే 2009లో తన పదవీ కాలం ముగిసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఏదిఏమైనా ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సినీ కెరీర్ లో ధర్మేంద్ర గారు 300 పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ లో అత్యధిక హిట్ చిత్రాల్లో నటించిన రికార్డును తన సొంతం చేసుకోవడం ఎంతైనా హర్షణీయమైన విషయం.అంతేకాదు 1973లో ఎనిమిది,1987లో వరుసగా ఏడు హిట్స్ తో పాటు అదే ఏడాది తొమ్మిది విజయవంతమైన చిత్రాల్లో సైతం నటించారు ధర్మేంద్ర గారు.బాలీవుడ్ చరిత్రలో ఇప్పటికి అది ఓక రికార్డుగా మిగలడం ఓక గొప్ప విశేషంగా చెప్పవచ్చు.ఇక ఆయన కళామతల్లికి చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు,రివార్డులు ఆయన వశం అయ్యాయి.2012లో కేంద్రప్రభుత్వం నుంచి ధర్మేంద్ర గారికి పద్మ భూషణ్ పురస్కారం,1997లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు,1991లో వచ్చిన ' ఘాయల్ ' సినిమాకు గాను ఆయనకు నిర్మాతగా జాతీయ అవార్డు,2016లో వరల్డ్ యూనివర్సిటీ ఫోరమ్ నుంచి గౌరవ డాక్టరేట్,అన్నింటికి మించి 1970లో ప్రపంచంలోని అందగాళ్ళలో ఒకడిగా ధర్మేంద్ర నిలువడమే కాదు,పలు ప్రముఖ సంస్థలు ఆయనను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించాయి కూడా.ఇంకా చెప్పుకుంటూపోతే కండలు తిరిగిన శరీర సౌష్టవంతో సినిమాల్లో కనిపించిన ధర్మేంద్ర గారు అమ్మాయిల కలల రాకుమారుడిగా సైతం నిలిచారు. ఏమైనా ఓ మహానటుడు,దిగ్గజ హీరో,ఐకాన్ నటుడు హీ మ్యాన్ గా పెరుగాంచిన ధర్మేంద్రగారి సినీప్రస్థానం ముగిసిపోయిన ఈ విషాదకరమైన సమయాన అశేష బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల ఆరాధ్యనీయమైన నటుడు అయిన ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ,ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు సైతం మన ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం! అమర్ రహే,అమర్ రహే ధర్మేంద్రజీ!జోహార్ బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమ మేటి నటుడు ధర్మేంద్రగారు! ఓం శాంతి!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!