సామల పిండితో సగ్గుబియ్యం పునుగులు
కావలసిన పదార్థాలు..
పెరుగు... పావు లీటర్
సగ్గుబియ్యం. ఒక కప్పు
సామల పిండి.. ఒక డబ్బా
ఉప్పు. రుచికి తగినంత
ఉల్లిపాయలు.. రెండు
పచ్చిమిరపకాయలు.. ఐదు లేక ఆరు
జీలకర్ర .ఒక స్పూను
కరివేపాకు, కొత్తిమీర
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్
తయారు చేసుకునే విధానం..
ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో రెండు కప్పులు పెరుగు వేసుకొని సగ్గుబియ్యం కలిపి నాన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి.. సగ్గుబియ్యం చిన్నవి అయితే చాలా రుచిగా ఉంటాయి... నాలుగైదు గంటల తర్వాత ఈ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ,రుచికి తగినంత ఉప్పు ,సామల బియ్యంతో మిక్సీ పట్టించుకున్న పిండి అన్నీ కలిపి పునుగుల పిండి మాదిరిగా పిండి వాటర్ చేసుకుంటూ కలుపుకోవాలి.. పిండిని మరీ జారుగా కలుపుకో కూడదు... కొంచెం గట్టిగా ఉన్న పరవాలేదు. జారుగా కలిపినట్లయితే పెరుగు తో తయారు చేసే పునుగులు కాబట్టి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. కొంచెం గట్టిగా కలుపుకోండి. తయారైన పునుగుల పిండిని ఒక బాండి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా అంతా ఆయిల్ పోసుకొని నూనె కాగిన తరువాత చిన్నచిన్న వి ఎలా పునుగులు వేసుకుంటాము అలాగే వేసుకోండి. మరి హై ఫ్లేమ్ లో పెడితే పెరుగు తో తయారు చేసే పునుగులు కాబట్టి త్వరగా మాడిపోతాయి. లోపల పునుగులు ఉడకవు. అందుకని మీడియం flame పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడు పునుగులు లోపల కూడా ఉడుకుతాయి. సగ్గుబియ్యం కొంచం పంటికి తగులుతూ crispy గా పునుగులు ఎంతో రుచిగా ఉంటాయి..
#🥘చలికాలపు వంటకాలు⛄