𝓓𝓻.𝓖𝓪𝓷𝓰𝓾 𝓜𝓪𝓷𝓶𝓪𝓭𝓱𝓪𝓻𝓪𝓸
806 views
#🗞️డిసెంబర్ 1st ముఖ్యాంశాలు💬 *హెచ్ఐవి పట్ల భయపడవద్దు* *హెచ్ఐవి బాధితులను అక్కున చేర్చుకోవాలి* *జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్* శ్రీకాకుళం,డిశంబరు,1: హెచ్ఐవి పట్ల భయపడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ బంగ్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 మంది పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు హెచ్ఐవి పట్ల భయపడవద్దని, హెచ్ఐవి బాధితులను అక్కున చేర్చుకోవాలని, వారి పట్ల వివక్ష చూపరాదని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఎఆర్టీ మందులు వైరల్ లోడ్‌ను తగ్గించి వ్యాధి సంక్రమణ అవకాశాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. రిస్క్ గ్రూపులకు చెందినవారు నిరంతరం హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. అనిత మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ ప్రివలెన్స్, అందుబాటులో ఉన్న ఐసిటిసి, ఎఆర్టీ కేంద్రాలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఎఆర్టీ మందుల సేవలు గురించి వివరించారు. గత సంవత్సరాలతో పోలిస్తే హెచ్ఐవి కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఏ. హరిబాబు, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీవో కె. సాయి ప్రత్యూష, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిపి కిరణ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. శైలజ, ఎడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మేరీకేథరీన్, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణ్ బాబు, DLATO డాక్టర్ శ్రీకాంత్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కెవిఆర్ శైలజ, ఎఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చి. అప్పలనాయుడు, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ శివరామకృష్ణ, జిల్లా పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్, సిఎస్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మణరావు, అతిథి పిడి శంకర్ రావుతో పాటు హారికా కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, భాగస్వామి ఎన్జీవోలు, లింక్ వర్కర్ స్కీం, టార్గెట్ ఇంటర్వెన్షన్ టీమ్‌లు, సిఎస్సీ, విహెచ్ఎస్ సంస్థలు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి సర్టిఫికెట్లు, మెమెంటోలు, అవార్డులు ప్రదానం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ బంగ్లా ప్రాంగణం నుంచి ఎయిడ్స్ అవగాహన ర్యాలీకి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ర్యాలీ డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. విద్యార్థులు, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు భారీగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మానవహారం ఏర్పాటు చేసి, హెచ్ఐవి పై అపోహలు, వివక్షత నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రంగోలి, క్విజ్ పోటీ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🌅శుభోదయం