బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
930 views
భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని వారికివే నా గౌరవ,అభిమాన పూర్వక ఘన నివాళులు!( 6 - 12 - 2025)! లేదా భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు రచించిన అత్యంత అమూల్యమైన భారత రాజ్యాంగం కేవలం మన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఓక గొప్ప మార్గదర్శకం! ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారిది ఓ మహోన్నత వ్యక్తిత్వం,అంకితభావంతో,అవినీతి రహిత నాయకత్వ లక్షణాలతో ఎంతగా ఆయన గారు భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఇనుమడింపచేశాడో కోట్లాది మంది భారతీయులం అయిన మనందరికి బహు బాగా విధితమే.అయితే గొప్ప మహానుభావుడు, కార్యసాధకుడు,కారణజన్ముడు,మహా పురుషుడు అయిన ఈ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి బాటలో ప్రస్తుత మన కేంద్ర,రాష్ట్ర పాలకులు కూడా నడిచి ఆయన ఖ్యాతికి,కీర్తికి ఎలాంటి మచ్చ వాటిల్లకుండా నడుచుకొని,ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ ప్రజాస్వామ్యంలోని ప్రజలకు ఓక స్ఫూర్తిదాయకమైన పాలన అందించాల్సిన గురుతర బాద్యత నేటి తరం నాయకులపై,పాలకులపై ఎంతైనా వుంది.ఎందుకంటే కేంద్ర,రాష్ట్ర పాలకులు గాని ఒకరిపై ఒకరు దుమ్మేత్తిపోసుకోవడం,ఆరోపణలు చేసుకోవడం కాదు ప్రజలు కోరుకునేది, ప్రజలకు కావాల్సింది అన్ని వర్గాలకు,కులాలకు న్యాయం చేసే ఓక జనరంజక, ఆదర్శ పాలన మాత్రమే,అంతకుమించి మరేమికాదు.ఎందుకంటే డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ గారి ప్రదాన ఆశయం,లక్ష్యం ఒక్కటే అంటరానితనాన్ని తులనాడటం,సంపూర్ణంగా నిర్ములించడం.కుల,మతాలకు అతీతంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తమ మానాన తాము స్వేచ్ఛగా జీవించేందుకు,తమ హక్కులను గురించి ప్రశ్నించేందుకు,పోరాడేందుకు సంపూర్ణ అధికారం ఉండి తీరాలని ఆయన గొంతెత్తి చాటారు.ఓక విధంగా చెప్పాలంటే ఆయన ఓక ఉద్యమ స్ఫూర్తిప్రదాత,దార్శనికుడు,కోట్లాది మంది భారత ప్రజానీకం యొక్క శ్రేయస్సును,అభివృద్ధిని,వారి ఎదుగుదలను మనసా,వాచ,కర్మణ కోరుకున్న ఓ నిస్వార్థమైన సంఘ సంస్కర్త,గొప్ప మనసున్న మేధావి, మానవతామూర్తి ఈ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే బి.ఆర్.అంబేద్కర్ గారి లాంటి కార్యదీక్షపరులు,ప్రజల కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకంజ వేయని ధైర్య,సాహసాలు అణువణువున ఉన్న,దేశభక్తిని నర నరాన జీర్ణించుకున్న నాయకులు నేటి ఆధునిక కాలంలో టార్చి లైట్ వేసి వెదికిన కానరారు అనే విషయం ఓ పచ్చి యదార్థం. ఏదిఏమైన రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు గతించి దాదాపు 60 వసంతాలు గడిచిపోయినప్పటికి ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ఏదో ఓక సందర్భంలో తన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంది అనే మాట మరేవ్వరూ,ఏ ఒక్కరూ కూడా కాదనలేని ఓ అక్షర సత్యం కూడా.ముఖ్యంగా ఆయన రచించిన అత్యంత విలువైన,అపురూపమైన ఈ రాజ్యాంగం ఒక్క మన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచ దేశాలకు ఓ ఆదర్శం,అనుసరణీయం అనే మాట సత్యదూరం కాదు.ఏమైనా భారతదేశ ప్రజల శ్రేయస్సు కోసం,వారి అభివృద్దే ఏకైక ఎజెండాగా,లక్ష్యంగా జీవించి,తరించి తమ జీవితానికి ఓక గొప్ప సార్థకతను చేకూర్చుకున్న త్యాగధనుడు,నీతి, నిజాయితీకి మారుపేరైనా ఓక గొప్ప ధన్యజీవి,ఓ మంచి ఆదర్శ సుపరిపాలకుడు అనే మాటకు నిజమైన పర్యాయపదం మన బి. ఆర్. అంబేద్కర్ గారు.ఆయన 69వ వర్ధంతి అయిన ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మహాపురుషునికి,కర్మ యోగికి యావత్ కోట్లాది మంది భారతదేశ ప్రజానీకం అయిన మనమందరం ఆయనకు గౌరవ,అభిమాన పూర్వక నివాళులు అర్పించాల్సిన కనీస కర్తవ్యం మనందరి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.అమర్ రహే,అమర్ రహే భారతరత్న డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ గారు!జయ జయహో భారత్!మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳 - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #అంబేద్కర్