కలియుగము రాగానే వేంకటాచలము భూలోకమున మిక్కిలి ప్రసిద్ధి చెందును.
దేవతలు కలియుగమున వేంకటాద్రి కేతెంచి స్వామితీర్ధమున స్నానమాచరించి భగవంతునకు నైవేద్యము నొనరింతురు. మనుష్యులకు కానరాకుండు నటులుండి నివేదించినదాని నారగింతురు. ఆ విమానమును దర్శించి పూజింతురు!
దేవతలుగూడ మనుష్యులుగా భూమి యందవతరించ వలెనని భగవంతుని ప్రార్థింతురు. వారికి శ్రీనివాసుడు అభీష్టముల నొసంగును.
దుర్లభమగు ఆయుర్దాయమును, స్వర్గలోకాదులను కోటిజన్మముల చేతను పొంద శక్యముగాని నిత్య విభూతినిగూడ సదాచార్య సమాశ్రయణము వలన నీయ గలడు.
జనులందరి భక్తికిని పశ్యుడై శ్రీవేంకటాచలమున నుండును.
వేంకటాచలమున వైష్ణవ ధర్మము అతిచిత్రము. ఆశ్చర్యావహము.
ఆర్యులు, తురుష్కులు, మాలవులు, గౌడులు, వంగులు, కళింగులు, ఆంధ్రులు కర్ణాట దేశీయులు కోసల దేశీయులునూ అంగదేశీయులు, చోళులు, పాండ్యులు, ఇతర నానాదేశ వాసులు ద్వీపాంతర వాసులందరును మహాభక్తి కలవారై కోటానుకోట్లు వచ్చి సేవించి వరములను పొంది సంతసింతురు.
ఒకరి భక్తిని చూచి మరియొకరు శ్రీనివాసునియందు భక్తి కలిగి యుందురు.
అప్రాకృతమై బంగరు చరియలు కలదైనను శ్రీవేంకటాచలము ప్రాకృత పర్వతము వలెనే కలియుగమున కానుపించుచుండును.
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status