*తల్లి కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి:* *విచిత్ర సంఘటన…* *ఇటీవల సౌదీ రియాద్ హైకోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది. జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు. అన్న వయస్సు 80 సం.రాలు, తమ్ముని వయస్సు 70 సం.రాలు. బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది. ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు. వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువ లేవు.* *కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన అన్న వద్ద తల్లి ( 110 సం.రాలు. ) గత 40 సం.రాలుగా ఉంటుంది. ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు. తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లిని తన వద్దకు పంపమని, సంవత్సరాల తరబడి ప్రాదేయబడ్డా కూడ తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడిగా మీరే ఒక నిర్ణయానికి రండి అని అడిగాడు, కానీ ఇద్దరు అన్నదమ్ములు కూడ తల్లి తన వద్దనే ఉండాలని పట్టుబట్టారు. తుదకు తల్లిని స్ట్రెచ్చర్ లో కోర్టులో హాజరు పర్చారు. జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని, అప్పుడు ఆ తల్లి తనకు ఇద్దరు కుమారులు సమానమేననీ, ఇంతకన్నా ఏమి చెప్పలేనని, మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచలేను అంది.* *జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కుప్పకూలి పోయాడు. ఇది ప్రేమ అంటే...ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించలేక కొట్టి చంపడమో, లేక వృద్ధ శ్రమంలో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము కానీ ఇటువంటి కేసు వినలేదు*. *తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు*. *అందుకే తమ పిల్లలకు చిన్నప్పటి నుండి ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించేటట్లు బోధించాలి*. *ఈ సౌదీ కేసు ఫలితం తమ్ముని వద్ద తల్లి ఉండాలని జడ్జి ఆదేశించడమే*. *తమ్ముడు వివాహితుడు, పిల్లలు ఉన్నవాడు కాబట్టి అతడి ఇంటి పరిస్థితి మెరుగ్గా ఉందని నిర్ణయించాడు*.
*తీర్పు వివరాలు*
*ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత జడ్జి ఈ తీర్పు ఇచ్చాడు*, *అన్న కుప్పకూలిపోయినా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు*. *కేసు ఇక సమతుల్యమైంది, ఇద్దరూ రాజీ అయ్యారు*
*ప్రభావం*
*ఈ తీర్పు తల్లీ-పిల్లల బంధానికి అద్భుత ఉదాహరణగా మారింది, దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది.*
*ఈ సంఘటన పాతది, ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ ఎంతో కాలం క్రితం జరిగింది. 2025 డిసెంబర్లో సోషల్ మీడియాలో వైరల్ అయి, ఇటీవల తెలుగు సర్కిల్స్లో పునఃప్రచారం చేశారు.*
*_వివరాలు_*
*అల్-అసియా, కాసిమ్ కోర్టులో హిజామ్ అల్-ఘామ్ది (పెద్ద అన్న) మరియు తమ్ముడు తల్లి (100+ ఏళ్లు) పోషణ కోసం కోర్టుకు వచ్చారు*. *పాత కేసు అయినప్పటికీ, ఇటువంటి ప్రేమ వివాదాలు అరుదు*.
*ప్రచారం*
*ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో 2026 ఏప్రిల్ 22 నాటికి తెలుగు పోస్టులు వైరల్*. *"ఇటీవల" అని పేర్కొన్నా, అసలు పాత సంఘటన* #మన సంప్రదాయాలు సమాచారం