ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అనేక మంది ప్రాణాపాయంలో చిక్కుకున్న సమయంలో, పరుపుల వ్యాపారి రియాజుద్దీన్ మంసూరి మరియు ఆయన కుమారుడు అర్మాన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ దుకాణంలోని 20కి పైగా కొత్త పరుపులు, రజాయిలను బయటకు తీసి భవనం కింద పరిచారు. వాటి విలువ దాదాపు ₹2 లక్షలు. కానీ వారి దృష్టిలో ఆ డబ్బు కంటే మనుషుల ప్రాణాలే విలువైనవి.
వారి ఈ త్యాగం వల్ల పలువురు భవనం నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. నష్టపోయింది వారి వ్యాపారం కావచ్చు... కానీ గెలిచింది మానవత్వం.
మతం కాదు... మనసే గొప్పది. కులం కాదు... కరుణే గొప్పది.
ఇలాంటి మనుషుల వల్లే ఈ ప్రపంచంపై ఇంకా ఆశ మిగిలి ఉంది.
#🙆 Feel Good Status #💪పాజిటీవ్ స్టోరీస్ #😎ఆటిట్యూడ్ కోట్స్