Ravi Talluri
568 views
12 hours ago
*_21/04/2026 - వైశాఖ శుద్ధ పంచమి - శ్రీ శంకర భగవత్పాద జయంతి_* *_శ్రీ శంకరాచార్య జయంతి_* *_సదాశివ సమారంభాం_* *_శంకరాచార్య మధ్యమాం_* *_అస్మదాచార్య పర్యంతాం_* *_వందే గురు పరంపరాం_* *హిందూ / భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు*. *సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2524 సంవత్సరాల క్రితం, 509 BCE లో వైశాఖ శుద్ధ పంచమి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు*, *శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా దక్షిణ* *భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో పూర్ణా నది ఒడ్డున ఉన్న* *కాలడి అనే* *గ్రామములో కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబుతిరి అనే బ్రాహ్మణ వంశంలోని ఆర్యాంబ, శివగురువు అనే పుణ్య దంపతులకు బిడ్డగా, వేద* *ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యలు అవతరించారు*. *శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే సన్యాసం స్వీకరించి "చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు*. *వేదవేదాంతలను, తత్వశాస్త్రాన్ని (Philosophy) , Metaphysics, Theology మొదలైన ఇతర శాస్త్రాలనుకంఠస్థం చేసారు*. *ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి.* *ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు*. *దాదాపు 90% ప్రజలు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసారు*. *అలాంటి సమయంలో *శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని,* *స్వధర్నాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ* *వారిని ఓడించి, వైదిక ధర్మంలోకి వారిని తీసుకువచ్చారు. ఆ చర్చల సమయంలో వచ్చిందే అద్వైత సిద్ధాంతం*. *యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. ధర్మ సంస్థాపన చేశారు*. *శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే హిందు అనేవాడు గాని, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవికావు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని*. *ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి 477 BCE లో మహనిర్యాణం చెందారు. తన 32 ఏళ్ళ జీవితకాలంలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మసిద్ధాంతాలకు బాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు*. *కలియుగంలో ప్రజల్లో శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవాత విగ్రహాల శక్తిని ఇటువంటి మానవసమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్రయంత్రాల్లోకి ప్రవేశపెట్టారు*. *ఆత్మతత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, నేను జడత్వాన్ని కాను, చైతన్యాన్ని అని నిశ్చితమైన జ్ఞానం కలవాడు, అతడు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, అతనే నాకు గురువు. ఇది తధ్యము అంటూ శంకరాచార్యుల వారు ఎలుగెత్తిచాటారు. అలా వచ్చిందే మనీషా పంచకం. జ్ఞాన్మ మార్గాన్ని పునరుద్ధరించిన శంకరులు, కేవలం జ్ఞానభోధకే పరిమితం కాక, అనేకస్తోత్రాలు అందించారు*. *_చాతుర్మఠాల -పీఠముల స్థాపన_* *వైదిక ధర్మాన్ని ఎప్పటికి ప్రచారం చేసేవిధంగా భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మఠాలను* *_1. దక్షిణ భారతదేశం శృంగేరీలో శారదపీఠం_,* *_శృంగేరీ మఠము_* *ఇది దక్షిణామ్నాయ మఠమని, శారదా పీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది*. *_2. ఉత్తరమున ఉత్తరాఖండ్‌లో జ్యోతిర్‌మఠం_,* *_జ్యోతిర్మఠము_* *దీనిని ఉత్తరామ్నాయమనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం, పీఠ దేవత నారాయణుడు*. *_3. తూర్పున పురీలో గోవర్ధన పీఠం,_* *_గోవర్ధన మఠము_* *దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గల పూరీ పట్టణంలో స్థాపించబడింది*. *_4. పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠం స్థాపించారు_.* *_ద్వారకా మఠము_* *ఈ మఠము శంకరులచే, దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు*. *సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, ఎప్పుడొ 2492 సంవత్సరాల క్రితం ఈయన ఏర్పాటు చేసిన పరంపర ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అదేకాకుండా సన్యాస ఆశ్రమాన్ని సంస్కరించి పది సంప్రదాయాలను ఏర్పరిచారు*. *_శంకర మఠము (కంచికామకోటి పీఠము)_* *సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది*. *నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.* *'’కంచికామకోటి '’* *పీఠాన్ని తానే స్వయంగా కొన్ని రోజులు అధిరోహించారు*. *శంకరులు బోధించిన తత్వం అద్వైతం. అది ఈ దేశపు అఖండత్వాన్ని కాపాడటానికి అక్షయమైన సిద్ధాంతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ వంటి శ్రుతి వాక్యాలు అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికలు. నాలుగు వేదాల నుంచి ఈ నాలుగు వాక్యాలు గ్రహించి బ్రహ్మ స్వరూపాన్ని వివరించడంలో వాటిని సమన్వయించారు. శంకరాచార్యులు జ్ఞానమార్గానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు*. *ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వివేక చూడామణి, శివానందలహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కనకధారాస్తవం వంటి గ్రంథాల్లో వారి పాండిత్యం వెల్లడవుతుంది. సర్వజనామోదంగా ఉండేలా శివ, విష్ణు, గణపతి, సూర్య, శక్తి రూపాలతో కూడిన పంచాయతన పూజా విధానాలను ప్రవేశపెట్టారు*. *భారతదేశంలో అందరిని తన వాదన పటిమతో అందరిని ఓడించిం కాశ్మీర్‌లో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వారి తర్వాత అంతటి మేధావి, సూక్ష్మదర్శి ఇంకొకరు రాలేదు, అందువల్ల సర్వజ్ఞపీఠాన్ని శంకరాచార్యుల తర్వాత ఈ 2000 సంవత్సరాలలో ఎవరు అధిరోహించలేదు. కానీ ఇప్పుడా సర్వజ్ఞపీఠం, కశ్మీర్ సరస్వతీ దేవాలాయం ముష్కరులు, దేశద్రోహుల దాడిలో శిధిలమైపోయింది. ఇక్కడొక విషయాన్ని గమనించాలి. శంకరులు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తారనగా, వారితో వాదించడానికి ఒక 8 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు. ఉద్దండులనే ఓడించాను, నీతో వాదించేదేంటీ అని శంకరాచార్యులు అనలేదు. ఆ పసిపిల్లవాడితో కూడా అమోఘమైన శాస్త్రచర్చ జరిపారు. ఇది శంకరుల యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. అంత గొప్పవారైనా, కాస్తంత అహాకారం కూడా శంకరాచార్యులవారికి లేదు*. *ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.* *_శంకరులను భగవత్పాదులు అని ఎందుకు పిలుస్తారు?_* *మనుష్య శరీరం పొందిన వారికి గొప్ప ప్రయోజనం ఏమిటంటే, భగవంతుని పాదములు పట్టుకోవడం. భగవంతుని పాదములు పట్టుకోవడానికి ఒక నిచ్చెన కావాలి. ఆ నిచ్చెన ఎక్కితే భగవంతుని పాదములు దొరుకుతాయి. ఏ పాదములు నిచ్చెనగా ఉన్నాయో, ఏ పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు పట్టుకోగలమో, ఆ పాదములని భగవత్పాదులు అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు అంటే, శంకరుల పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు పట్టుకోవచ్చు. భగవంతుని పాదాలు అందేటట్టు చేయగల మహాపురుషుడు కాబటి ఆయన్ని భగవత్పాదులు అని పిలుస్తారు*. *ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి, హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి, అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు శ్రీ శంకరాచార్యులవారికి హిందువులంతా సదా ఋణపడి ఉంటారు.* *ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులుఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది*. *సనాతన ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి, శక్తిని సంపాదించి, స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది* #మన సంప్రదాయాలు సమాచారం