Kotha Srinivas Reddy
471 views
2 days ago
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రజారవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. మహిళలు, పురుషులు సహా అన్ని వర్గాల ప్రయాణికులకు ఈ సౌకర్యం వర్తించనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాయగా సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. #😁Hello🙋‍♂️ #🤝Have a Good Day🤩 #🤝All the best #📖బిజినెస్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼