Manasa
594 views
8 days ago
#🙆 Feel Good Status #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం శ్రీ గురుభ్యోనమః🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, తేది ... 18 - 4 - 2026, వారం ... స్థిర వాసరే (శని వారము), శ్రీపరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం, తిధి : శు పాడ్యమి మ 3.35 వరకు తదుపరి విదియ నక్షత్రం : అశ్వని ఉ 10.57 వరకు తదుపరి భరణి యోగం: ప్రీతి రా 1.57 వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : బవ మ 3.35 వరకు బాలువ రా 2.31 వరకు వర్జ్యం : ఉ 7.08 - 8.39 వరకు రా 8.00 - 9.30 వరకు దుర్ముహూర్తం : ఉ 5.46 - 7.25 వరకు అమృతకాలం : తె 5.03 నుండి రాహుకాలం : ఉ 9.00 - 10.30 వరకు యమగండం : మ 1.30 - 3.00 వరకు సూర్యరాశి : మేషం చంద్రరాశి : మేషం సూర్యోదయం : 5.48 సూర్యాస్తమయం:6.11 *నేటి విశేషం* రేలంగి మంటాలాంబ వారి తీర్థం, కూర్మకల్పం *నేటి మాట* ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః గురుచరిత్ర - 77 శ్రీగురువులు కరంజా నగరమును చేరి, జననీజనకులను ఆనందింపజేసి, చెల్లెలిని, తమ్ముళ్ళను ప్రేమతో ఆదరించిరి. ఆ నగరములో పౌరులు గురుమూర్తిని చూసి సంతుష్టులై సద్గురువును పూజించిరి. జగద్గురువులు ప్రతీ ఇంటా భిక్ష చేయుచుండిరి. అక్కడ విప్రులు అందరూ భిక్షకు నిమంత్రింపగా శ్రీగురువులు బహురూపధారులై అందరి ఇళ్లలో ఒకేసారి భిక్ష గైకొనిరి. అందరూ అది తెలుసుకొని విస్మితులై శ్రీమహావిష్ణువే యతిధారియై వచ్చినారని భావించిరి. శ్రీవారిని దూషించినవారు నరకానికి పోవుదురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కార్యార్థమై యతిరూపమున వచ్చినారని నగర పౌరులు తలంచిరి. శ్రీగురువులు, తల్లిదండ్రులకు పూర్వస్మరణ కలిగించుటకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూపిరి. తల్లి అంబిక శ్రీపాద శ్రీవల్లభ రూప దర్శనము చేసి, వారి పాదములందు శిరమును ఉంచి, నా ప్రదోష పూజ ఫలించింది. అని భావించింది. చంద్రమౌళి సత్యసంకల్పుడు అని భావించి, భర్తతో తన పూర్వజన్మ చరితమును చెప్పుచూ, గతజన్మలో శ్రీపాదులైన ఈ విశ్వవంద్యులైన సుతునిగా పొందుటకు మహాదేవుని ఆరాధించి ఉంటిని. ఈ జన్మ యందు నా కోరిక సఫలమైనది. అని తన భర్త అయిన మాధవునికి చెప్పినది. అప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు కలిసి, యతిరాజా! జగన్నాథా! మమ్ము భవార్ణము నుండి ఉద్ధరింపుము. అని ప్రార్థించినారు. అప్పుడు శ్రీగురువులు, వంశము లోని ఒక సన్యాసి ఆ వంశమునందు 42 తరములను ఉద్ధరించును. ఆ వంశమునకు శాశ్వత బ్రహ్మలోకం ఇచ్చును. ఆ కులము నందు జన్మించిన వారందరకూ కూడా శాశ్వతమైన బ్రహ్మపదమును ఇచ్చును. వారి సంతతికి యముని వలన కూడా భయ దుఃఖములు ఉండవు. అంతకుముందు నరకమునకు పోయిన వారందరూ కూడా బ్రహ్మలోకమునకు పోగలరు. ఇంతకన్నా మీకేమి చెప్పను? మీకు యముని వలన కూడా జంకు లేదు. బ్రహ్మ పదమే లభించును. మీ ఈ పుత్రులు శతవర్ష జీవులై అష్టైశ్వర్యములను పొందగలరు. వీరి పుత్రులను, పౌత్రులను చూసి సుఖములు అనుభవించిన తరువాత మీకు చివరికాలమున కాశీక్షేత్ర వాసము లభించును. కాశీ మోక్షస్థానమని వేదాదులయందు కలదు. ఇంకముందు మీరు ఎట్టి చింతన పెట్టుకోవలదు. అని జగద్గురువులు ఆనతి ఈయునంతలో, అక్కడకి శ్రీగురువులు పూర్వాశ్రమమున చెల్లెలైన రత్న వచ్చి, స్వామి దగ్గర వినతురాలై, స్వామీ! నన్ను తరింప చేయండి. అవిద్యా జల నిమగ్నయై భవసాగరమున మునిగి ఉంటిని. తాపత్రయం అను బడబాగ్ని నన్ను దహించుచున్నది. కామాదులు అనే నక్రములు భయపెట్టు చున్నవి. నన్ను సంసార జలధి నుండి ఉద్ధరింపుము. నేను తపము చేయ పోవుదును. అని పలికినది. అప్పుడు శ్రీగురువులు, స్త్రీలకు పతి సేవయే తపస్సు. వేరే తపము ఏల? వీరిని భవార్ణము నుండి తరింపచేసి, పరమపదము నొసగువాడు శివుడే. అతడే పతివ్రతలకు సర్వాభీష్టములను కలుగజేయును. సంశయము వలదు. భవసాగరమును ఉద్ధరించుటకు పతియే స్త్రీలకు దైవమని స్మృతులు ఘోషించుచున్నవి. కావున మనస్సును స్థిరముగా చేసుకొని శివసమానుడైన పతిని సేవింపుము. వేదవాక్యములను అనుసరించి పతియే గతి. నిన్ను ఉద్ధరించువాడు అతడే. నీ అంతఃకరణమున దుఃఖ పడకు. అని జగద్గురువులు ఆమెను ఆదేశించారు. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏