𝄟⃝💕 ⃪ͥ͢ ᭄ᷟ🇸‌𝗶𝗱𝗱𝘂🕊️
627 views
13 hours ago
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 18** మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **16వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో హనుమంతుని కీర్తి దిక్పాలకులు మరియు పండితులకు కూడా వర్ణనాతీతమని తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు తన మిత్రుడైన సుగ్రీవునికి చేసిన మహోపకారం, తద్వారా సుగ్రీవుడికి లభించిన రాజయోగం గురించి తెలుసుకోబోతున్నాం. ----- **16వ చౌపాయి** **తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా |** **రామ మిలాయ రాజ పద దీన్హా ||** **ప్రతిపదార్థం:** * **తుమ:** నీవు (హనుమంతుడు) * **ఉపకార:** మేలు/సహాయము * **సుగ్రీవహిం కీన్హా:** సుగ్రీవునికి చేశావు * **రామ మిలాయ:** శ్రీరామచంద్రుడితో పరిచయం (సంధి) చేసి * **రాజ పద దీన్హా:** రాజ్యాధికారాన్ని (కిష్కింధ రాజ్యాన్ని) ఇప్పించావు. ----- **విస్తృత ఆధ్యాత్మిక వివరణ:** **1. దైవంతో అనుసంధానం (రామ మిలాయ):** స్వామీ. నువ్వు సుగ్రీవునకు ఉపకారం చేసి, అతనికి రామునితో సఖ్యము గావించి రాజపదవిని ఇప్పించావు. సుగ్రీవుడు హనుమదుపాసకుడు, హనుమదుపాసనకు ఫలితం- ఇహలోకంలో కష్టాలు తొలగడమనేది ఐహిక ప్రయోజనం. అక్కడితో ఆపకుండా హనుమంతుడు రామానుగ్రహాన్ని కూడా అందిస్తాడు. ఇది రామాయణంలో స్పష్టంగా కనబడుతున్నది. సుగ్రీవుడు కష్ట కాలంలో కూడా హనుమంతుని వదిలి పెట్టలేదు,తన అన్న వాలి భయంతో ప్రపంచం మొత్తం తిరిగి చివరకు ఋష్యమూక పర్వతంపై ప్రాణభయంతో తలదాచుకున్నాడు. అక్కడ కూడా హనుమను వదలలేదు. సుగ్రీవుడు నాకు రామునితో స్నేహం చేయాలి ఉంది అని ఉంది అని చెప్పలేదు, ఋష్యమూఖ పర్వతం వైపు వస్తున్న రామ లక్ష్మణుల చూసి భయపడిన సుగ్రీవునితో.. నువ్వు భయపడకు అసలు వారెవరో తెలియ కుండా నువ్విలా తొందరపడడం ఏమిటి... ప్రశాంతంగా ఉండు, వారెవరో నేను తెలుసుకుంటాను” అని చెప్పి ఆయన వెళ్ళి రామచంద్రమూర్తితో మాట్లాడి, రామచంద్ర మూర్తి ఇతనిని ప్రశంసించిన తరువాత హనుమ తనంత తానే. మీ ఇద్దరితో సుగ్రీవుడు సఖ్యం చేయాలనుకున్నాడని చెప్పాడు సుగ్రీవుని అభిప్రాయం కనుక్కుని చెప్పడం కాదు, తానే చెప్పాడు. అంటే రామచంద్ర మూర్తిని చూసిన వెంటనే సుగ్రీవునకు ఈయన స్నేహం లభిస్తే అతడు ధన్యుడౌతాడని తెలుసుకుని, ఆయన అడగకుండానే ఈయన ఆ పని చేశాడు. భగవంతుని ఉపాసించేటప్పుడు మనకేమి కావాలో మనం అడగనక్కరలేదు. అసలు మనకేమి కావాలో మనకే తెలియదు. మనం చేయవలసిందల్లా ఆయనను ఆశ్రయించడమే నాకు రామునితో మైత్రి కల్పించమని సుగ్రీవుడనలేదు కానీ అది అతనికి కావాలని స్వామి గ్రహించారు. అందుకే మనకు కావలసిందేమిటో భగవంతునికి చెప్పనక్కరలేదు. ఆయనే గమనించుకుని మనకు ఏది మేలో చేస్తాడనడానికి ఇదే ఉదాహరణ. హనుమంతుడు రామలక్ష్మణులిద్దరినీ తన భుజాల మీద ఎక్కించుకుని వస్తుండగా సుగ్రీవుడు వారిని చూశాడు అంటే సుగ్రీవునకు హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకుని దర్శనం ఇచ్చారు అలాంటి ధ్యానం చాలా గొప్పది అంటే అవసరమైతే రామున్ని తాను తన మీద ఎక్కించుకుని మరీ మనకు తెచ్చి పెడతాడు అని అర్దం.అలాంటి అనుగ్రహాన్ని చూపించాడు. హనుమంతుడు ఒక **'గురువు'** పాత్రను పోషించాడు. గురువు చేసే అతిపెద్ద ఉపకారం ఏమిటంటే.. దారి తప్పిన లేదా భయపడిన జీవుడిని (సుగ్రీవుడిని) పరమాత్మతో (రాముడితో) కలపడం. **2. సంకటాల నుండి విముక్తి (రాజ పద దీన్హా):** రాముడితో స్నేహం కుదిరిన తర్వాత, హనుమంతుని సహాయంతోనే వాలి వధ జరగడం, సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యాన్ని, భార్యను తిరిగి పొందడం సాధ్యమైంది. హనుమంతుడు కేవలం సుగ్రీవుడి ప్రాణాలను కాపాడటమే కాకుండా, అతనికి గౌరవప్రదమైన రాజ పదవిని కూడా కట్టబెట్టాడు. ----- **తులసీదాసు గారి సందేశం:** తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. మనం జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దైవాన్ని వదల కుండ పట్టుకుంటే ఆ స్వామే మనకు ఏది కావాలో అది తెచ్చి ఇస్తాడు. రామానుగ్రహం కావాలంటే హనుమదుపాసన కావాలి. అదీ దీనిలో అందిస్తున్న సంకేతం రాముని ప్రసన్నతకు హనుమంతుడు మనకు సహకరిస్తున్నాడు తరువాతి వాక్యం కూడా అదే జై హనుమాన్ జై శ్రీ రామ్ #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్