ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందరో మహమహులు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ వారందరిలో లేని ప్రత్యేక,చూడ చక్కనైన నవ్వు మన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రివర్యులు, సామాన్య,పేద,బడుగు,బలహీన వర్గాల పెన్నిధి,యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల ఆరాధ్య నాయకుడు,రైతులశ్రేయోభిలాషి,పులివెందుల ముద్దుబిడ్డ అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సొంతం!
లేదా
మోముపై ఎల్లవేళలా చెక్కు చెదరని చిరునవ్వు,నవ్వుల సూరీడు అయిన మన దివంగత డాక్టర్ వైస్సార్ ప్రత్యేకత!
ఆయన నవ్వితే రత్నాలే రాలతాయా అన్నట్లుగా ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఆయన పనిచేసే కాలంలో ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికి ఎల్లవేళలా ప్రజలకు,మీడియాకు నవ్వు మొఖంతో దర్శనం ఇచ్చేవారు మన దివంగత రాజశేఖరుడు.ఒక్కొక్కసారి ఆయన నవ్వుమొఖం చూసి ప్రతిపక్ష పార్టీ వారు సైతం చిర్రెత్తి పోయేవారు అంటే ఆయన ఎంతటి నవ్వుల సూరిడో మనం ఇట్టే ఊహించవచ్చు.అందుకే ఎల్లవేళలా నవ్వు మొఖంతో ఉండాలంటే పెట్టి పుట్టాలి అని మన పెద్దలు ఊరకే అనలేదు.అలా ఆయన జీవించినన్ని రోజులు ఎంతో ఉల్లాసంగా, నూతనోత్సహంతో చెరగని చిరునవ్వుతో తన ప్రత్యేకతను చాలా గొప్ప గా చాటుకున్నాడు మన దివంగత డాక్టర్ వైస్సార్.
ఏదిఏమైనా ' నవ్వడం ఓక భోగం,నవ్వించడం ఓక యోగం,నవ్వలేకపోవడం ఓక రోగం' అన్నట్లుగా ఆయన తన విలువైన రాజకీయ జీవితం అద్యంతం ఎన్ని చీకు చింతలు వున్న నవ్వుతూ బ్రతకాలిరా అనేదానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి నవ్వుల రారాజుగా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం హృదయాల్లో తన పేరును సువర్ణ అక్షరాలలో లిఖించుకున్నారు ఈ మహా నాయకుడు,అంతేకాదు అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలు నచ్చి మెచ్చేలా పాలన అందించిన ఓక మహోన్నత రాజకీయరంగ దిగ్గజం మన దివంగత రాజన్న! అమర్ రహే!అమర్ రహే! జోహార్ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల!
#ysr