Ravi Talluri
279 views
5 hours ago
6️⃣7️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_(అరవై ఏడవ భాగం)_* *_పరశురామ అవతారం:_* *_కార్తవీర్యార్జునుడు కామధేనువు కోసం జమదగ్ని మహర్షిని హత మార్చుట - రేణుకాదేవిని గాయ పరచుట:_* *కార్తవీర్యార్జునుడు తన సేనలతో వేటకోసం అరణ్యంలోకి వచ్చాడు. వేటాడుతూ అడవి మధ్యలో సహ్యాద్రి పర్వతము పైన ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమం చూశాడు. ఈ ఆశ్రమం ఎవరిది అని మంత్రుల నడుగగా వారు ఒక దూతను పంపి వివరాలు తెలుసుకు రమ్మన్నారు*. *దూత వెళ్లి వచ్చి నమస్కరించి “ప్రభూ! జమదగ్ని మహర్షి వారి ఆశ్రమం అది. ఆయనను సంద ర్శించడం పుణ్యదాయకం. మహిమా న్వితులైన మహర్షి వారి ఆశీస్సులు తమకు, తమ రాజ్యానికి శుభం చేకూర్చగలవు” అని చెప్పడంతో కార్తవీర్యార్జునుడు సేనను అక్కడ ఉంచి కొంతమంది ముఖ్యులతో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లారు.* *తేజోరూపుడైన జమదగ్ని మహర్షికి ప్రణామం చేశారు. జమదగ్ని మహర్షి, వచ్చిన కార్తవీర్యుడు, పరివారానికి స్వాగతం పలికి అతిథిసత్కరించి, గౌరవించాడు.* *రాజు, అతని పరివారం అక్కడ ఉన్న సరోవరం లో స్నానాలు చేసి జమదగ్ని మహర్షి శిష్యులు చేసే వేదఘోషలు, శాస్త్రచర్చలు శ్రద్దగా ఆలకించారు*. *జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జును ని చూసి "రాజా! ఎవరు నీవు? ఇటు అరణ్యం వైపు వేటకు వచ్చారా!" అని అడిగాడు.* *కార్తవీర్యుడు నమస్కరించి "నేను కృతవీర్యుని పుత్రుడైన కార్తవీర్యుడను. నన్ను కార్తవీర్యార్జునుడు అని పిలుస్తారు. వేట కోసం అడవికి సేనలతో వచ్చాను*. *మీ ఆశ్రమాన్ని చూడటానికి వచ్చిన నాకు మీసందర్శన భాగ్యం కలిగింది. మీ అతిథి సేవలకు సంతుష్టుడనయ్యాను. అనుమతిస్తే మా నగరానికి తిరిగి వెళ్తాను" అని వినయంగా పలికాడు*. *జమదగ్ని మహర్షి చిరునవ్వుతో* *“రాజా! నీ పేరు ప్రఖ్యాతులు ముల్లో కాల్లో వ్యాపించి ఉన్నాయి. నీవంటి వారు మా ఆశ్రమానికి అతిథిగా రావడం చాలాసంతోషంగా ఉంది.నీవంటి అతిలోక పరాక్రమవంతునికి అతిథ్యం ఇచ్చే అవకాశం మాకు కలుగచేయండి.* *భోజన సమయమైంది. మీరు భోజనం స్వీకరించి వెళ్లండి" అన్నాడు*. *కార్తవీర్యుడు "మహర్షీ! భోజన సమయానికి వచ్చినప్పుడు భోజనం స్వీకరించడం మంచిదే. కానీ నా వెంట పరివారం, సేనలు ఉన్నాయి. వారందరికి భోజనం ఏర్పాటు చేయడం కష్టము. నా పరివారం, సైన్యం తినకుండా నేను ఒక్కడను భోజనం చేయడం మర్యాద కాదు. కనుక అనుమతిస్తే వెళ్లివస్తాను" అని పలికాడు.* *జమదగ్ని మహర్షి మందహాసం చేస్తూ "రాజా! తపస్సు వలన సాధించలేనిది ఏదీ లేదు. కనుక సందేహం వీడండి. మీ పరివారాన్ని సైన్యాన్ని నదిలో స్నానం చేసి రమ్మన్నండి. భోజన ఏర్పాట్లు మీరే చూద్దురు గాని" అనడంతో ఆశ్చర్యం చెంది కార్తవీర్యుడు పరివారం, సైన్యం తీసుకుని నదీతీరానికి వెళ్లాడు.* *జమదగ్ని భార్య రేణుకను పిలిచి జరిగింది చెప్పాడు*. *భార్య భర్తలు ఇద్దరు స్వర్గలోకంలో ఉన్న కామధేను వుని స్మరించి పూజించాడు. కామధేనువు జమదగ్ని దంపతుల ముందు ప్రత్యక్షమైంది. నమస్కరించి “మాతా! కామధేనూ! కార్తవీర్యుడు తమ పరివారం, సైన్యంతో వచ్చారు. వారిని భోజనానికి ఆహ్వానించాము. మా ఆతిథ్యంలో లోటు లేకుండా వారికి తగిన సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు చేయుము" అని ప్రార్ధించారు*. *మహర్షి దంపతుల ప్రార్థన మన్నించిన కామధేనువు అక్కడ కార్తవీర్యుడు, అతని పరివారం, సేనలకు విడిది ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేసింది.* *షడ్రషోపేతమైన భోజనం భోజనశాలతో ఏర్పాటు చేసి వడ్డించడానికి సేవకులను సృష్టించింది. ఏర్పాట్లను చూసి సంతృప్తి చెందిన జమదగ్ని మహర్షి కార్తవీర్యుని పరివార, సైన్య సమేతంగా భోజనానికి రావలసిందిగా ఆహ్వానించాడు*. *కార్తవీర్యుడు, అతని పరివారం, సైన్యం వచ్చి ఏర్పాటు చేయబడిన అతిథి భవనాన్ని చూసి విస్మయం చెందారు*. *మహారాజుకి తగినట్టు సౌకర్యాలు అల్పసమయం లో ఎలా ఏర్పాటు చేయగలిగారు అని ఆశ్చర్యపోయారు. భోజన పదార్థాల రుచులు, సువాసనలు నోరూరేలా ఉన్నాయి. అందరు తనివితీరా భోజనం చేసారు. ప్రతి ఒక్కరి మనస్సులో ఒకటే సందేహం ‘ఇంతటి రాజభోగ్యమైన రుచికరమైన భోజనం అరణ్యంలో మహర్షి ఎలా ఏర్పాటు చేయగలిగారు. నిజంగా తపశక్తి ప్రభానమే!’ భోజనమైన తరువాత అతిథులందరికి నూతన వస్త్రాలు అలంకరణ వస్తువులు బహు మతులుగా ఇచ్చారు*. *జమదగ్ని మహర్షి చేత విలువైన ఆభరణాలు, వస్త్రాలతో సత్కరింపబడిన కార్తవీర్యుడు జమదగ్నికి నమస్కరించి “మహర్షీ! మేము మొదట వచ్చినప్పుడు ఈ భవనాలు, భోజనశాల ఇక్కడ లేవు. మీ తపశ్శక్తి ప్రభావమా లేక మాయ తో కల్పించినవా?” అని తన మనస్సులో గల సందేహం వ్యక్తపరిచాడు*. *జమదగ్ని మహర్షి “రాజా! ఇది మాయ కాదు. నా తపశక్తి వినియోగించ లేదు. నిజం చెబు తున్నాను. మామీద అనుగ్రహంతో అమరలోకం నుంచి వచ్చిన కామధేను మాత అనుగ్రహము” అని అక్కడే ఉన్న కామధేనువును, గోవత్సమును చూపించాడు.* *కార్తవీర్యార్జునుడిలో స్వార్ధం కలిగింది. "ఇటువంటి మహిమ గల కామధేనువు తన దగ్గర ఉండాలి కాని అరణ్యంలో ఒంటరిగా ఉండే ముని వద్ద ఉండకూడదు" అనుకున్నాడు*. *దురాశకు విచక్షణ ఉండదు.* *జమదగ్నితో “మహర్షీ! ఇటువంటి కామధేనువు ముల్లోక రాజునైన నా దగ్గర ఉండటం ఉచితము. కనుక కామధేనువుని నాకు సంతోషముతో సమర్పించండి. లేదంటే బలవంతంగా నైనా తీసుకువెళతాను. వరప్రసాదమైన నా బల పరాక్రమాలు గురించి తమకు పూర్తిగా తెలుసు" అని హెచ్చరిస్తూ మాట్లాడాడు*. *జమదగ్ని మహర్షి మందహాసం తో "మహారాజా! కామధేను మాతకు అనుగ్రహం కలిగితేనే వస్తుంది. ఆమెను ఎవరూ బలవంతాన ఇష్టం లేకుండా తీసుకు వెళ్లలేరు. రమ్మని ప్రార్ధించండి. వస్తే తీసుకు వెళ్లండి. బలవంతం చేస్తే మాత్రం సర్వ నాశనం అవుతారు. ఆలోచించండి" అని చెప్పాడు*. *కార్తవీర్యుడు మహర్షి మాటలు పట్టించుకోకుండా తన భటులను కామధేనువుని బంధించి తీసుకు రమ్మని ఆదేశించాడు*. *జమదగ్ని మహర్షి కామధేనువుకి నమస్కరించి “మాతా! నిన్ను నీవే రక్షించుకో" అనిప్రార్ధించాడు.* *తనను బంధించడానికి వచ్చిన భటులను చూసి కామధేనువు గట్టిగా అరిచింది. ఆ అరుపుకే భటులు గుండెలు పగిలి మరణించారు.* *కార్తవీర్యుడికి రోషము వచ్చి సమస్త సైన్యాన్నిపంపాడు*. *కామధేనువు శరీరం నుంచి వేలాది గో వీరులు పుట్టుకువచ్చి సేనలతో తలపడ్డారు*. *చూస్తుండగానే* *కార్తవీర్యుని సైన్యం నశించిపోయింది* *చావకుండా మిగిలిన కొద్దిమంది పారిపోయారు. కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులతో ఐదు వందల బాణాలు ఒకేసారి వదిలాడు. ఎన్నిసార్లు బాణవర్షం కురిపించినా కామధేను గోసేనలు ఒక్కరు కూడా మరణించలేదు. తన బలం, సామర్ధ్యం ఎందుకూ పనికిరాలేదు అని చింతలో పడిపోయాడు. ఓడిన వాడితో యుద్దం ఎందుకు అని కామధేనువు తన గోసైన్యం తో స్వర్గలోకానికి వెళ్లి పోయింది*. *కార్తవీర్యార్జునుడికి ఓటమినుంచి ఉక్రోషం కలిగింది. ఇందుకు కారణం మహర్షి అని జమదగ్ని పై కోపం చెందాడు. "మహర్షీ! నీ వద్దకు రావడం వలనే నాకు అవమానం జరిగింది. ఓటమి సంభవించింది. హృదయంలో ఇంత కాపట్యమున్న నీవు బ్రాహ్మణు డవు కావు" అంటూ గుండెల్లో దిగేలా వాడి బాణము ప్రయో గించాడు*. *జమదగ్నిమహర్షి తనకు మరణం సమీపించిందని తెలుసుకుని దానిని ఆపడానికి తపశక్తి వినియోగించ లేదు*. *జమదగ్ని మహర్షి మరణించడం తో రేణుకాదేవి రోదిస్తూ కోపంతో "బ్రహ్మహత్యకు అకారణంగా పూనుకున్నావు. నా భర్త నీకు అతిథి సత్కారం చేసి భోజనం పెట్టాడు. సిగ్గులేదా" అని ఆక్రోశించింది*. *కార్తవీర్యుడు అసహనం పొంది "మాట్లాడకుండా ఉండు! లేదంటే నిన్నూ సంహరిస్తాను" అంటూ ఇరవై ఒక్క బాణాలు ఆమె దేహము పై ప్రయోగించి కదలనీయకుండా చేశాడు*. *రేణుకాదేవి ఆగ్రహం చెందింది* *"దుర్మార్గుడా! బలవంతుడన్న గర్వంతో నిరాయుధులు, నిరప రాధులైన మమ్మల్ని సంహరిస్తున్నావు. నీ సహస్ర బాహువులను ఖండించి నిన్ను సంహరించే రోజు దగ్గరలో ఉంది" అని శపించింది*. *పతివ్రతా శాపంతో కార్తవీర్యార్జునుడి కళ్ళు తెరచుకున్నాయి. తను చేసినదానికి తననే నిందించుకుంటూ తన నగరానికి తిరిగి వెళ్లాడు* #మన సంప్రదాయాలు సమాచారం