బాబోయ్.. వాటర్ ట్యాంకులో పాముల కుప్ప
ఉత్తరాఖండ్ హరిద్వార్ ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. పైనున్న వాటర్ ట్యాంక్లోకి నీళ్లు వెళ్లకపోవడంతో యజమానులు అండర్గ్రౌండ్లోని ట్యాంక్ (సంపు) మూత తీశారు. లోపల చూస్తే ఏకంగా 27 పాములు ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతూ కనిపించాయి. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం వెంటనే అటవీ శాఖను ఆశ్రయించింది. సిబ్బంది వచ్చి ట్యాంకులోని పాములన్నింటినీ బయటకు తీసి వాటిని అడవిలో వదిలేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
#😇My Status #✌️నేటి నా స్టేటస్