వేణు గోపాలరావు తమ్మన
519 views
5 days ago
*విద్యా వారోత్సవాల సందర్భంగా “నేస్తం – బడికి రా” ర్యాలీ నిర్వహణ* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐనపూరు లో విద్యా వారోత్సవాలు 2026–27 కార్యక్రమాల భాగంగా “నేస్తం – బడికి రా” అనే అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.* *ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి, విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.* *గ్రామంలోని ప్రధాన వీధులలో సాగిన ఈ ర్యాలీ ద్వారా "ప్రభుత్వ విద్య - ఉచిత విద్య" , "ప్రభుత్వ పాఠశాల- ప్రగతికి బాటశాల" , "ఆడపిల్ల చదువు - అవనికే వెలుగు" , "ఎక్కడికో ఎందుకు దండగ - ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగ" , "ప్రభుత్వ బడి - మనందరి బడి" , "పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చదివిద్దాం - బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం" అనే నినాదాలతో విద్య మరియు ప్రభుత్వ పాఠశాల యొక్క ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ర్యాలీ అనంతరం గ్రామ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రతి చిన్నారి, పిల్లలందరూ విద్యను పొందడం అత్యంత ముఖ్యమని, పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యకమని, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.* #🙆 Feel Good Status #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙏స్ఫూర్తి కవితలు #🙏Thank you😊