P.Venkateswara Rao
509 views
2 days ago
#తల్లి ప్రేమ❤️❤️🙏🙏 *ఆమె ఒంటిపై లైఫ్ జాకెట్… పిల్లాడిని గట్టిగా హత్తుకుని… మరెలా మరణించింది..❓* May 2, 2026 నిన్న జబల్‌పూర్ (మధ్యప్రదేశ్) సమీపంలోని బర్గీ డ్యామ్ వద్ద జరిగిన క్రూయిజ్ ప్రమాదంలో… ఓ తల్లి తన ప్రాణం పోయేదాకా, కొడుకు ప్రాణం కాపాడుకోవడానికి తనకు హత్తుకుని ప్రయాసపడిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది… అమ్మతనం, పేగుబంధం గొప్పతనం ప్రశంసాపాత్రమైంది… కానీ మీకు కూడా ఓ డౌట్ వచ్చిందా ఆ ఫోటో చూసి..? ఆమె ఒంటి మీద లైఫ్ జాకెట్ ఉంది, ఆ పిల్లాడిని ఆమె వదల్లేదు, చేతుల మధ్య బందీగా ఉంచుకుంది… ఐనా ఎలా మరణించింది..? అంటే లైఫ్ జాకెట్లు కూడా వేస్టేనా..? ప్రాణాపాయంలో పనిచేయవా..? అసలేం జరిగింది..? చాలామందిలో తలెత్తాల్సిన డౌటనుమానం ఇది… ఓసారి చూద్దాం… లైఫ్ జాకెట్లు ఉన్నప్పటికీ ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణాలు ఇవే…. 1. క్యాబిన్‌లో చిక్కుకుపోవడం …. చాలా మంది బాధితులు క్రూయిజ్ లోయర్ డెక్ (క్రింద అంతస్తు) లోని ఏసీ క్యాబిన్‌లో ఉన్నారు…. బోటు ఒక్కసారిగా తిరగబడటంతో, నీరు వేగంగా క్యాబిన్‌లోకి చొరబడింది… లోపల ఉన్నవారికి లైఫ్ జాకెట్లు ఉన్నప్పటికీ, అవి తేలడానికి సహాయపడతాయి… కానీ మొత్తం క్యాబిన్ మొత్తం నీరే నిండితే, ఇక తేలి ఊపిరి పీల్చుకోవడానికి చాన్సేది..? మునిగిపోతున్న చాంబర్ నుంచి బయటకు డైవ్ చేయడానికి కూడా అవి సహకరించవు… ఆ క్యాబిన్ గదులు మూసి ఉండటంతో వారు బయటకు వచ్చే మార్గం లేక అందులోనే చిక్కుకుపోయారు… 2. ఆకస్మిక గందరగోళం (Panic)… ప్రమాదం జరిగిన సమయంలో ఈదురుగాలుల వల్ల ప్రయాణికులు ఒక్కసారిగా భయపడి బోటులో ఒకవైపునకు పరిగెత్తారు… దీనివల్ల బోటు బ్యాలెన్స్ తప్పి కేవలం రెండు నిమిషాల్లోనే మునిగిపోయింది… అంత తక్కువ సమయంలో లైఫ్ జాకెట్లను సరిగ్గా ధరించడం లేదా సురక్షితంగా బయటకు రావడం అందరికీ సాధ్యపడలేదు… 3. లైఫ్ జాకెట్ల నిర్వహణ … కొందరు ప్రయాణికులు చెబుతున్న దాని ప్రకారం, ప్రయాణం మొదలైనప్పుడు అందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదు… అవి ఒక చోట నిల్వ ఉంచారు… ప్రమాదం మొదలైన తర్వాత వాటిని తీసుకోవడానికి ప్రయత్నించేలోపే బోటు మునిగిపోయింది… మరికొందరు లైఫ్ జాకెట్లు వేసుకున్నా, వాటిని సరిగ్గా (Buckles) బిగించుకోకపోవడం వల్ల నీటి ఉధృతికి అవి విడిపోయి ఉండవచ్చు… 4. వాతావరణ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం… గంటకు 40- 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ, బోటును అనుమతించడం అతిపెద్ద వైఫల్యం… భారీ అలల వల్ల బోటు నియంత్రణ కోల్పోయింది… ప్రస్తుత పరిస్థితి (మే 2, 2026 నాటికి)… ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు సమాచారం (వీరిలో ఎక్కువ మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు)… క్షేమంగా బయటపడ్డవారు సుమారు 28 మంది… ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది, అన్ని పర్యాటక బోటు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది… చేతులు కాలాక ఎన్ని ఆకులు పట్టుకుని ఏం లాభం..!!