ఎల్నినో గుబులు
ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు
ఆలస్యమవుతున్న ఖరీఫ్ సాగు
వెంటాడుతున్న లోటు వర్షపాతం
ఆందోళనలో రైతులు
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ సూచన
వర్షాకాలం ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాల జాడ కనిపించటం లేదు. మేఘాలు కమ్ముతున్నా.. పిడుగులు పడుతున్నా.. వర్షం మాత్రం ఆశించినస్థాయిలో కురవడం లేదు. తొలకరి జల్లు, దోని ప్రభావం, నైరుతిపవనాలు కూడా అంతంతమాత్రానికే పరిమితమయ్యాయి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితిలో ఖరీఫ్ సాగు ఎలా చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు.
#రైతు #వ్యవసాయం #🍱ఆంధ్రా స్పెషల్ రెసిపీస్ #andhra #andhra pradesh