భారీగా తగ్గిన అరటి ధరలు
AP: పశ్చిమాసియాలో యుద్ధం అరటి రైతుకు ఆవేదన మిగిల్చింది. ఎగుమతులు ఆగిపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏటా లక్ష టన్నులకు పైగా అరటి ఎగుమతి అవుతుండగా యుద్ధం వల్ల సరఫరా ఆగిపోయింది. దీంతో యుద్ధానికి ముందు ₹20,000-23,000 పలికిన టన్ను ఇప్పుడు ₹6,000-8,000 మధ్య ఉంది. నాణ్యతను బట్టి వ్యాపారులు ₹4,000-5,000 ఇస్తున్నారని, పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
#news #apnews #sharechat