RAJENDRAPRASAD, M.Com.
363 views
11 hours ago
#🌕నేడు వైశాఖ పౌర్ణమి..ఈ పూజలు చేస్తే జన్మ జన్మల దరిద్రం పోతుంది! 🙏🏻కూర్మ జయంతి🙏🏻 శ్రీకూర్మం నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో అరుదైన ఈ క్షేత్రం నెలకొని ఉంది. కూర్మం అంటే తాబేలు. ‘శ్రీ’ అనేది గౌరవవాచకం. మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో కూర్మావతారం రెండోది. ఇక్కడ కూర్మనాథుడిగా, కూర్మ నాయకుడిగా, పుష్కలంగా జల సంపదను ప్రసాదించే దేవుడిగా విష్ణువు పూజలందుకుంటున్నాడు. స్వామి వారికి ప్రతి నిత్యం సమృద్ధిగా పరిమళ చందనాన్ని సమర్పిస్తారు. శని, ఆదివారాల్లో విశేషంగా స్వామిని అలంకరిస్తారు. వైశాఖ మాసంలో మాత్రం తులసిదళాలతో అర్పించడం ఆనవాయితీ. ఇక్కడ కూర్మనాథునికి అభిషేకం చేస్తే గృహవాస్తు దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. వైశాఖ పూర్ణిమనాడు కూర్మ జయంతిని వైభవంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తారు. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని స్థల పురాణం చెబుతోంది. స్వామి వారు వేంచేసి ఉన్న గర్భాలయం మీద నిర్మించిన విమానాన్ని శ్రీకూర్మ విమానం అని పిలుస్తారు. నరసింహ, కపీశ, హయగ్రీవ, దధివక్త్రుల విగ్రహాలతో అష్టదళ పద్మాకారంగా నిర్మించిన ఈ విమానాన్ని గాంధర్వ విమానమని కపిల సంహిత పేర్కొంది.🙏🏻 సేకరణ