Ravi Talluri
477 views
7 hours ago
*_మంచం మీద ఉన్న "రామాయణ విషవృక్షం" రాసిన ముప్పాళ్ల రంగనాయకమ్మ అనే రంగనాయకమ్మ గురించి_* *_నాస్తికత్వం ఒక లాభసాటి వ్యాపారం_* *_కమ్యూనిజం ఒక లాభసాటి వృత్తి_* *_రెండింటిలోనూ నిష్ణాత ఈ రంగనాయకమ్మ అనే వృత్తి నాస్తికురాలు_*. *_మొగుడిని వదిలించుకోవటము తప్పు కాదు. కానీ ఎదిగిన పిల్లల ముందే తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన గాంధీతో పెళ్ళి అనె జంఝాటం లేకుండా కాపురం చేసిన ఈమె నైతికవిలువలు ఏపాటి? నా శరీరం నా ఇష్టం అంటూ బ్రతికిన ఈమె తన పిల్లల మన:స్థితి ఎన్నైడైనా గమనించిందా ? సమాజాన్ని ధిక్కరించానని మురిసిపోయిన ఆవిడ, అదే సమాజంలో తన పిల్లల పరిస్థితి గురించి ఆలోచించిందా ?_* *_ఆమె ఎంతో ముందు చూపుతో సమాజానికి అందించిన సహజీవనం అనే బాటలో రేపు అందరూ పయనించి, కాపురాలు చేస్తే, వాళ్ళకు పుట్టే పిల్లలకు చట్టబద్ద తలితండ్రులు లేకపోతే, ఆ పిల్లలు సమాజానికి బరువుకాబోరా ?_* *_రామాయణ విషవృక్షం రాసింది_*. *_ఎంతమంది చదువరులు ఆ విషవృక్షంలోని విషాన్ని మూల రామాయణంలోని విషయాలతో పోల్చి, నిజమెంతో బేరీజు వేసుకుని చదివి ఉంటారు ?_* *_రామాయణంలోని ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని దాని ఆధారంగా 90% తన కపోల సృష్టితో వండివార్చిన అబద్దాలే ఎక్కువ_*. *_ఈమె రాసిన విషవృక్షం ను పూర్తిగా ఉపయోగించుకున్నది మతమార్పిడి మాఫియా తమ మతప్రచారానికి వాడుకున్నది. హిందూ ద్వేషులైన కమ్యూనికృష్టులు ఆనందించి తమ విద్వేషానికి మరింత పదును పెట్టుకున్నారు._* *_ఈమె రాసిన విషవృక్షం ప్రభావం మెండుగా ఉండి ఉంటే, ఇవాళ అసలు రామాయణాన్ని అందరూ వదిలేసి ఉండేవారు_*. *_ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఒక సాహితీ సభలో విషవృక్షం రంగనాయకమ్మతో భేటీ జరిగింది_*. *_నేను ఆమెను సూటిగా ఒక్కటే ప్రశ్న వేసాను._* *_మీరు విషవృక్షాన్ని ఎందుకు రాసారు అని._* *_"ఆమె సమాధానం కూడా సూటిగానే చెప్పింది_*. *_రామాయణంలోని విషాన్ని ప్రజలకు అర్ధం అయ్యేట్లు చేసి, రామాయణ ప్రభావాన్ని తగ్గించాలనీ, రామాయణంలో స్త్రీలను అత్యల్పభోగవస్తువుగా, అల్పురాలుగా చూపించిన విషయాన్ని ఎండగడతానికీ, అన్నదమ్ముల మధ్య్ ప్రేమానురాగాలు కాకుండా దాస్యప్రవృత్తి పెంపొందించే విధంగా ఉన్నదాన్ని ఏకి పెడదామనీ అంటూ బదులు ఇచ్చింది."_* *_మంచిది, అదే పంధాలో మహాభారతం మీద కూడా రాసారు. మరి ఈ రెండింటి కన్నా ఘోరమైన విషయాలు బైబిల్ లో ఖురాన్ లో ఉన్నాయి. మరి వాటి మీద కూడా రాస్తారా అని నిలదీసాను_*. *_ఆమె దగ్గర సమాధానం లేదు_*. *_సమాజంలో హిందువులు ఎక్కువ కాబట్టి ముందు వాళ్ళను సంస్కరించి తర్వాత ముస్లిం క్రైస్తవుల జోలికి వెళతాను అని సమాధానం చెప్పింది_*. *_అంటే ఆమె ఏడుపు హిందూ మతగ్రంధాల మీదనే తప్ప అన్యమతాల జోలికి వెళ్ళే ధీరవీరవనిత కాదు. భయం. హిందువులంటే సహనశీలురు, ఇతరమతాలవాళ్ళు తోలు తీస్తారన్న ప్రాణభీతి_*. *_మేధావి అనిపించుకోవాలన్న కుతి ఉన్న ఏ గాడిద అయినా ఓండ్ర పెట్టేది అన్ని మతాలనూ గౌరవించటం బోధించే హిందూ సంస్కృతి మీదే తప్ప, తమ దేవుడ్ని నమ్మని వాడిని నరికిచంపండి అని బోధించే మతాల జోలికి పోరు కదా ! రంగనాయకమ్మ బ్రతుకైనా అంతే !_* *_ఆ మాటే అంటే, నన్ను వదిలించుకుని పారిపోయింది._* *_ఇంకా ఆమె ఆయురారోగ్యాలతో ఆశీర్వదించిన ఆ రామచంద్రుడికి కృతజ్ఞతలు._* #మన సంప్రదాయాలు సమాచారం