Swarna M
496 views
6 hours ago
సర్వ పాపాలను హరించే చక్రతీర్థం..............!! అలకా పట్టణ ప్రభువైన కుబేరుడు ఒకసారి కైలాసానికి ఉత్తరం వైపున వైష్ణవ యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి వచ్చాడు. ఆయనతోపాటు సూర్యుడు, చంద్రుడు, దిక్పాలకులు, గంధర్వులు విచ్చేశారు. ఆ యజ్ఞంలో కుబేరుని కొడుకు నలకూబరుడు ధనాగారానికి పాలకుడిగా, వీరభద్రుడు రక్షకుడుగా, గణపతి సేవా కార్యక్రమమునకు గాను వియోగింపబడ్డారు. ధర్మతత్పరుడైన కార్తికేయుడు సదస్యులకు మర్యాదచేయసాగాడు. కుబేరుని మంత్రులు ఘంటానాథుడు, పార్శ్వవౌళి- శాస్తక్రారులకు పెద్దలుగా దానాధ్యక్షులుగా వ్యవహరింపసాగారు. మహావైభవంగా యజ్ఞం ముగిసింది. యజ్ఞానంతరం కుబేరుడు దేవతలకు, వేద పండితులకు దానధర్మాలు చేశాడు. శుభావహంగా యజ్ఞ కార్యక్రమం పరిసమాప్తి అవుతున్న దశలో మహర్షి దుర్వాసుడు అక్కడకు వచ్చాడు. ఆయన శరీరం కృశించి ఉంది. ముఖం కోపంతో తీక్షణంగా ఉంది. కుబేరుడు భయభక్తులతో ఆయనను పూజించి, ‘‘మహాత్మా! మీ రాకతో నా జీవనం, ఈ యజ్ఞం పావనమయ్యాయి’’ అన్నాడు వినయంగా. అందుకు దుర్వాసుడు సంతోషించి ‘‘ఓ రాజాధిరాజా! నీవు ధర్మాత్ముడవు. నీ దాతృత్వం బ్రాహ్మణ భక్తి నిరుపమానం! శ్రీ మహావిష్ణువును మెప్పించే విధంగా యజ్ఞం నిర్వహించావు. నీవు మంచి దాతవని విన్నాను. మీ ఇంటనున్న నవ నిధులు నాకు కావాలి. అవి ఇస్తే నీకు శుభం కలుగుతుంది. లేకుంటే నిన్ను శపిస్తాను!’’ అన్నాడు నిర్మొహమాటంగా. దానశీలుడైన కుబేరుడు మారుమాట్లాడకుండా అందుకు అంగీకరించాడు. కానీ ఆ సమయంలో దానాధ్యక్షులుగా ఉన్న ఘంటానాథుడు, పార్శ్వవౌళిలిద్దరూ లోభగుణ మోహితులై కుబేరునితో, ‘‘ఈ మహర్షి ఒంటరివాడు. నవ నిధులనూ తీసికొని వెళ్ళి ఏంచేసుకుంటాడు? పోనీ ఒక లక్షకాసులు ఇచ్చి మిగిలిన ధనం మీరు ఉంచుకోవడం మంచిది’’ అన్నారు. వీరి మాటలు విని దుర్వాసుడు ఆగ్రహావేశాలతో కళ్ళెర్ర చేశాడు. All India Arya Vysya Sangam का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/16372/post/1184655329?utm_source=android_post_share_web&referral_code=IUP71&utm_screen=post_share&utm_referrer_state=PENDING #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #యాత్ర