శ్రీనివాసులు గుండ్లపల్లి
489 views
6 days ago
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #😃మంచి మాటలు #💪పాజిటీవ్ స్టోరీస్ #✍️కోట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41 వర్ధంతి సందర్భంగా కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో వర్తమాన రాజకీయాలు మన కర్తవ్యం అనే అంశం మీద సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సెమినార్ కు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ముఖ్య వక్తగా హాజరైనారు ఈ సెమినార్కు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు ముందుగా సుందరయ్య గారి చిత్రపటానికి వీరయ్య గారు రవి గారు పూలమాలవేసినివాళులర్పించారు ఈ సిమినార్ ఉద్దేశించి వీరయ్య గారు మాట్లాడుతూప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు పొదుపుగా బ్రతకండి అని ఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళాడు ఈ విషయము ప్రజలకు తెలియకుండా ఉందా అని ప్రశ్నించారు సర్ పేరుతో ఓటర్ లిస్టులు తారుమారు అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతున్నది అంతకుముందు బెంగాల్ తమిళనాడు సర్ పేరుతో లక్షల ఓట్లు తొలగించబడ్డాయి అందుకే లక్ష ఓట్లు మెజార్టీ రావాల్సిన స్టాలిన్ తమిళనాడులో ఓడిపోవలసి వచ్చింది బెంగాల్లో బిజెపి ప్రభుత్వం వచ్చింది అని అన్నారు ప్రధాని మాట్లాడుతూ యుద్ధం వలన గ్యాస్ సరుపర ఇబ్బందిగా ఉంది కాబట్టి పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడండి అని కారులో ముగ్గురు నలుగురు వెళ్ళండి బంగారం కొనకండి అని సుద్దులు చెబుతున్నాడు యుద్ధం స్టార్ట్ కాగానే ప్రజలు ముందే మేల్కొని పొదుపు చర్యలు చేపట్టారని అన్నారు వారం రోజుల్లోనే ఎలక్ట్రిక్ స్టౌసుఅయిపోయాయని అన్నారు క్రెడిట్ కార్డుసు డెబిట్ కార్డ్స్ అలవాటు చేసింది ప్రభుత్వమే కదా విదేశీ వస్తువులు అలవాటు చేయటంవల్లనే కదా మన డాలర్లు కరిగిపోతున్నాయని అన్నారు యుద్ధం ఆపండి అనాల్సింది పోయి మోడీకి సోయ లేకుండా పోయిందని అన్నారు దానివల్లే కదా రేట్లు పెరిగాయి అన్నారు చిన్న చిన్న దేశాలు కూడా అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మీద చేస్తున్న దాడిని ఖండించాయని అన్నారు మోడీ మాత్రంఖండించకపోవడం చాలా దుర్మార్గమైన చర్యఅని అన్నారు చైనా కూడా ఇరాన్ మీద యుద్ధాన్ని ఖండించింది చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాలని అమెరికాకు ఇజ్రాయిల్ కు సూచించింది చైనా కంటే కూడా ఇరాన్ మనకు ఎప్పటినుంచో మిత్ర దేశంగా ఉంది మోదీ బ్రిక్స్ దేశాలసపోర్ట్ తీసుకుని యుద్ధం ఆపండి అని అంటే యుద్ధం ఆగిపోయేది అని అన్నారు కానీ మోడీ ఆ పని చేయలేదు దానికి కారణం మోడీకి అమెరికా అంటే భయం అని అన్నారు ఎరువుల వాడకం తగ్గించి పేడ ఎరువులు వాడాలని సలహాలిస్తున్నాడని అన్నారు అమెరికా పాలకును కాపాడుకోవడం కోసం మోదీ పొదుపు చర్యలు చెబుతున్నాడని అన్నారు జార్ఖండ్లో బంగారం గనులు బయటపడుతున్నాయని అవి ఆదానికి అప్పచెప్పాలని ప్లాన్ తో బంగారం కొనద్దని చెబుతున్నాడని అన్నారు ఎల్ఐసి దగ్గర డబ్బులు తీసుకుని అదాని అంబానీలతో అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు వీరికి మోడీ సపోర్ట్ చేస్తున్నాడని అన్నారు సర్ పేరు మీద బిజెపికి ఓటు వేయని వారు ఓట్లు తొలగిస్తున్నారని అది సోషల్ మీడియా వాడే ద్వారా సమాచారం గూగుల్ ద్వారా వారి ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు ఒకవేళ మన ఓటు తీసివేస్తే దానిని మనమే ప్రూవ్ చేసుకోవాలని అన్నారు ఈ పరిస్థితుల్లోకమ్యూనిస్టులుగా మనంనిత్యం ప్రజల్లో ఉండాలని ప్రజలతో మమేకం అవ్వాలని ఆనాడు ప్రజలతో మమేకమైన నాయకుడుసుందరయ్య గారిని అన్నారు పాలకుల మెడలు వంచాలంటే ప్రభుత్వ రంగాల మీద విద్యుత్ రంగాల మీద దృష్టి పెట్టాలని అన్నారు పబ్లిక్ సెక్టార్ మీద దృష్టి పెట్టాలని సుందరయ్య గారు ఆనాడే చెప్పారని అన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో పబ్లిక్ సెక్టార్ మీద మన పట్టు తప్పిందని దానిని బలోపేతం చేసుకోవాలని అన్నారుఉత్తర భారత దేశంలో ఎలాంటి యూనియన్ లేకుండా 50,000 మంది కార్మికులు వారి సమస్యల మీద రోడ్ల మీదకు వచ్చారని పాలకులు వారి మీద లాఠీచార్జి చేసి దాదాపు 300 మందిని జైల్లో వేశారని ఇప్పటికీ వారికి బెయిలు దొరకలేదని అన్నారు నాలుగు లేబర్ కోడ్స్ అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయని రాబోయే కాలంలో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందని దానికి అనుగుణంగా కార్మిక వర్గంలో మన కృషి ఇంకా పెరగాలని తెలిపారు రానున్న రోజుల్లో మనం చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ సెమినార్ ఉద్దేశించి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి గారు మాట్లాడారు .ధన్యవాదాలు కార్యక్రమం కాప్రా సర్కిల్ కమిటీ సభ్యుడు బివి సత్యనారాయణ చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు