*గ్రంథాలయాలను అందరూ ఉపయోగించుకోండి*
*గ్రంథాలయాలు - విజ్ఞాన భాండాగారాలు*
*కృష్ణాజిల్లా, పమిడిముక్కల మండలం, కపిలేశ్వరపురం శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం తరగతులు గ్రామ పెద్ద, ముఖ్య అతిథి కొల్లిపర రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలను గ్రంథాలయాధికారి సాలార్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి కొల్లిపర రాధాకృష్ణ మాట్లాడుతూ అందరూ గ్రంథాలయాలను ఉపయోగించుకుని గొప్ప స్థాయికి ఎదగాలని, సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న మరొక ముఖ్య అతిథి ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, పుస్తకాలు మనుషుల జీవితాలకు వెలుగునిచ్చే దీపాలు అని, విద్యార్థులందరూ ప్రతిరోజు గ్రంథాలయాలను ఉపయోగించుకుని, తమ విజ్ఞానాన్ని పెంచుకుని, అనుకున్న లక్ష్యాన్ని సాధించి, ప్రస్తుతము ఉన్నస్థితి నుంచి, భవిష్యత్తులో గొప్ప ఉన్నతస్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అతిధి పమిడిముక్కల మండల స్పోర్ట్స్ ఆర్గనైజర్ వీరంకిలాకు బబ్లు స్టూడియో అధినేత, బబ్లు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు కూడా ముఖ్యమని, విద్యార్థులందరూ చదువు మరియు ఆటలు రెండింటిలోనూ ప్రావీణ్యత సాధించి, భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు లంకా సుబ్రహ్మణ్యేశ్వర రావు, దాతలు, విశ్రాంత గ్రంథాలయ ఉద్యోగి అద్దేపల్లి ఏసోబు, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.*
#😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #📝శ్రీ శ్రీ కవితలు📝 #📑దేశభక్తి కవితలు✍ #🙏స్ఫూర్తి కవితలు