TALRadio Telugu
574 views
4 days ago
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జి. శ్రీనివాస్ రెడ్డి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసేలా ఒక సరికొత్త QR కోడ్ ను తయారు చేశారు. జర్నీ చేసే టైంలో ప్రయాణికులు ఆ QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, వారి లైవ్ లొకేషన్‌తో పాటు డ్రైవర్ వివరాలు, వెహికిల్ రిజిస్ట్రేషన్ సమాచారం నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి. ఈ టెక్నాలజీ ద్వారా అత్యవసర సమయాల్లో పోలీసులు బాధితుల వద్దకు తక్కువ టైంలోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈ విధానాన్ని అధికారికంగా స్వీకరించి, జిల్లాలోని ఆటోలు, రెంటల్ వాహనాల్లో ఈ QR కోడ్‌లను ఏర్పాటు చేయడం విశేషం. శ్రీనివాస్ తన సొంత స్టార్టప్ ద్వారా రూపొందించిన ఈ ఆవిష్కరణ, ముఖ్యంగా మహిళలు, ఒంటరి ప్రయాణికులకు భరోసాను ఇస్తోంది. #TALRadioTelugu #GoodNews #InspiringStories #SocialImpact #YoungInnovator #StudentInnovation #QRTechnology #PublicSafety #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ #📰జాతీయం/అంతర్జాతీయం