బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
351 views
1 days ago
అన్నదాన ప్రభువుగా శతకోటి నీరాజనాలు అందుకుంటున్న జగద్గురు,అవదూత కాశీనాయన! లేదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని,అన్ని దానాలలో కెల్లా మహాదానం అన్నదానం అని భావించి ఆచరించడమే కాదు అన్నదానానికి పెద్దపీట వేసిన కాశిరెడ్డి నాయన! ఆకలి వేసిన వారికి పట్టేడు అన్నం పెడితే అదే కోటి జన్మల పుణ్యఫలం అని మనసా,వాచ,కర్మణ నమ్మిన కాశిరెడ్డి నాయన జననం విషయానికి వస్తే 1895,జనవరి 15న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామంలో ఓక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, యోగి,అవదూత ఈ కాశిరెడ్డి నాయన.మునెల్లి సుబ్భారెడ్డి,కాశమ్మ దంపతులకు రెండవ సంతానమైన ఆయన 100 సంవత్సరాలు జీవించి 1995 డిసెంబర్ 6న సజీవ సమాధి చెందారు.రాయలసీమలో సుమారు 150- 200 అన్నదాన సత్రాలను స్థాపించారు తన అమూల్యమైన జీవితానికి ఎనలేని సార్థకత చేకూర్చుకున్నారు కూడా.అదేమాదిరి కాశిరెడ్డి నాయన తన చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ఆత్మజ్ఞానంతో మునెల్లి కాశిరెడ్డిగా పిలువబడ్డాడు.ఇక ఆయన ఆధ్యాత్మిక యాత్రల విషయానికి వస్తే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా అనేక క్షేత్రాలను సందర్శించారు.ఇక ఆయన సేవల విషయానికి వస్తే భావిరాలకోన మరియు గుటిక సిద్దేశ్వరం వంటి అనేక ఆలయాలను కనుగొని పునరుద్దరించారు.అన్నింటికి మించి ఆయనను యోగి పుంగవులుగా,' జ్యోతి ' గా ప్రజలు ఆరాధిస్తారు.అంతేకాదు యుక్త వయసులోనే ఆధ్యాత్మిక భావనలో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు.సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్య నేర్పుతూ కొంతకాలం గడిపారు.ఆ తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహాస్వామిని దర్శించుకొని అక్కడే కొంత కాలం తపస్సు చేశారు.తర్వాత కాలంలో తీర్థయాత్రలు చేశారు.తిరిగి వచ్చిన దరిమిలా స్థానికుల సహకారంతో పాతపడిన దేవాలయాల పునరుద్దరణ కార్యక్రమం చేపట్టారు.దాంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఏదిఏమైన కాశిరెడ్డి నాయన చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన ప్రాప్తించి దాతలు విరాళాలు ఇవ్వడం విశేషంగా ప్రారంభమై అది కాస్త నిరతాన్నదానంగా,నిత్య అన్నదానంగా మారింది.ఇక ఆ సొమ్మును కాశిరెడ్డి నాయన ఆలయాల జీర్ణోద్దరణకు కూడా ఉపయోగించేవారు.జ్యోతిలోని లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్దారించారు కూడా.ఇక అక్కడే 1995 డిసెంబర్ 6న విగ్రహ ప్రతిష్ట చేసిన కాశినాయన భక్తుల సమక్షంలో కన్నుమూసి సమాధి దీక్ష పొందారు.ఏమైన తాను సమాధి స్థితికి చేరుతానని తన శిస్యులతో కాశీ నాయన ముందుగానే చెప్పి,తన మరణాoతరం తనను తపస్సు చేసిన ప్రాంతంలోనే సమాధి చేయాలని సూచించారు కూడా. ఆయన కోరినట్లే భక్తులు చేశారు కాబట్టే నాటి నుంచి ఈ ప్రాంతం ఓ జ్యోతి క్షేత్రంగా ఈనాటికీ ఓక వెలుగు వెలుగుతూనే,విరాజిల్లుతూనే ఉంది.అన్నింటికి మించి కాశి నాయన అసలు పేరు కాశిరెడ్డి.ఎంతో మంది ఆకలితో వచ్చిన 24 గంటలూ కడుపు నిండా భోజనం పెట్టడం జ్యోతిక్షేత్రంలో ప్రత్యేకత.ప్రస్తుతం కాశి నాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్బంగా ఇక్కడ ఆరాధనోత్సవాలు ఎంతో వైభవంగా,అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అశేష భక్త జనకోటి సమక్షంలో జరుగుతాయి.అన్నదాన ప్రభువు అయిన జగద్గురు,అవదూత కాశిరెడ్డి నాయనకు శతకోటి నీరాజనాలు. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #కాశిరెడ్డి నాయన