*జగద్గురువులు శ్రీ శంకరుల జీవన ముఖ్య విశేషాలు*
*శ్రీ జగద్గురువులు శంకరులకు నమస్సులు*
****************************************
*ఆర్యాంబ శివగురు గర్భ జననం*
శివగురు, ఆర్యాంబ దంపతులకు పరమశివుడు స్వప్నంలో దర్శనమిచ్చి, తాను పుత్రుడిగా జన్మిస్తానని వరమిచ్చిన ఘట్టం ఇది.
అథ ప్రాప్యే శుభే కాలే గ్రహేషు శుభగౌషు చ |
ఆర్యాంబా సుషువే పుత్రం శివమంశాత్ సముద్భవమ్ ||
శుభప్రదమైన కాలంలో, గ్రహాలన్నీ అనుకూల స్థితిలో ఉన్నప్పుడు, ఆర్యాంబ శివుని అంశతో జన్మించిన పుత్రుడిని ప్రసవించింది.
తిథౌ పంచమ్యాం సితపక్షే వైశాఖే మాసి శోభనే |
పునర్వసుగతే చంద్రే ప్రవృద్ధే శశిని ప్రభోః ||
వైశాఖ శుద్ధ పంచమి, పునర్వసు నక్షత్రం వారి జన్మ సమయం
****************************************
శంకరుల సన్యాస స్వీకారం (మొసలి ఘట్టం)
పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి శంకరుల కాలు పట్టుకోవడం, ఆ సమయంలో తల్లి అనుమతితో వారు 'ఆతుర సన్యాసం' స్వీకరించడం ఒక అద్భుత ఘట్టం.
అంబ తాత నయ మాం గ్రహో బలీ |
సత్త్వరం త్యజతు మాం యథా భవేత్ |
దేహి మేఽద్య సన్న్యాసమనుజ్ఞాం |
త్యక్ష్యతి త్వరితమేష మాం ఖలః ||
"అమ్మా! మొసలి నన్ను పట్టుకుంది. నేను సన్యాసం స్వీకరించడానికి నీవు అనుమతి ఇస్తేనే ఇది నన్ను వదులుతుంది. త్వరగా ఆజ్ఞ ఇవ్వు" అని శంకరులు ప్రార్థించారు.
సంసారమేవ నిస్సారం దృష్ట్వా కౌమార ఏవ హి |
ప్రవ్రజ్య పరమేశస్య సన్న్యాసం సమవాప్తవాన్ ||
(సంసారం నిస్సారమని గ్రహించి, కౌమార దశలోనే సన్యాసం స్వీకరించారు.)
****************************************
*గోవింద భగవత్పాదుల అనుగ్రహం*
నర్మదా నదీ తీరంలో శంకరులు తమ గురువైన గోవింద భగవత్పాదులను కలిసి, వారి శిష్యరికం పొందిన ఘట్టం అత్యంత పవిత్రమైనది. గురువు అడిగిన "నీవు ఎవరివి?" అన్న ప్రశ్నకు శంకరులు "దశశ్లోకి" (నిర్వాణ షట్కం వంటివి) ద్వారా సమాధానం ఇచ్చారు.
తం నర్మదాతట గతం గురుమభ్యుపేత్య |
గోవిందనామకమతీవ ముదా ప్రణమ్య |
సర్వజ్ఞకల్పమపి సర్వవిదాం వరిష్ఠం |
విజ్ఞాపయామాస వినీతవదాత్మవృత్తమ్ ||
నర్మదా తీరంలో ఉన్న గోవింద భగవత్పాదుల దగ్గరకు వెళ్లి, అత్యంత సంతోషంతో ప్రణామం చేసి, సర్వజ్ఞుడైన ఆ గురువుకు వినయంతో తనను శిష్యుడిగా స్వీకరించమని విన్నవించుకున్నారు.
శంకరుల సమాధానానికి సంతోషించి గురువు ఇలా అన్నారు
విదితం త్వత్స్వరూపం మే శంకరస్త్వం న సంశయః|
భాష్యం కురు త్వం లోకానాం హితాయ చరతాం భువి ||
నీ స్వరూపం నాకు తెలిసింది. నీవు సాక్షాత్తు శంకరుడివే, ఇందులో సందేహం లేదు. లోక కల్యాణం కోసం బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయి అని గురువు ఆదేశించారు.
****************************************
*శంకరుల అవతార విశేషం సాక్షాత్తు శివ స్వరూపం*
ఓం
అజ్ఞానాంతర్ఘహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః |
త్రాతుం లోకాన్ భవదవశిఖి తాపపాపచ్యమానాన్ |
ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిశ్చరంతీ |
శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా ||
అజ్ఞానమనే అడవిలో పడి, సంసార తాపత్రయాలతో దహింపబడుతున్న లోకాన్ని రక్షించడానికి, మౌనాన్ని వీడి వటవృక్షం నీడ నుండి కదిలి వచ్చిన దక్షిణామూర్తియే శంకరాచార్యుల రూపంలో ఈ భూమిపై (అవతరించారు) సంచరిస్తున్నారు.
****************************************
*విద్యార్జన*
శ్రుతయోఽపి యదర్థబోధకాః సకలాః సంతి న చాన్యబోధకాః |
సహసా స చతుర్భిరాయుషో వర్షైరభ్యసదుత్తమం పదమ్ ||
కేవలం నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే ఉపనయనం తర్వాత అతి తక్కువ కాలంలో సకల వేదాలను, వాటి అర్థాలను శంకరులు గ్రహించారు.
అష్టవర్షే చతుర్వేదీ, ద్వాదశే సర్వశాస్త్రవిత్ |
షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరభ్యగాత్ ||
ఎనిమిదేళ్లకే నాలుగు వేదాలను అభ్యసించిన వారు, పన్నెండేళ్లకే సర్వ శాస్త్రాలను క్షుణ్ణంగా తెలుసుకున్న వారు, పదహారేళ్లకే ప్రస్థానత్రయానికి (భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు) భాష్యాలు రాసిన వారు మరియు ముప్పై రెండేళ్లకే తన అవతార కార్యము ముగించి పరమధామం చేరిన మహనీయులు శంకరాచార్యులు.
****************************************
*భాష్య రచన*
గంభీరైః పదనికాయైః ప్రసన్న మృదుభిః పదం |
వ్యాచకారుత్తరాం మీమాంసాం భాష్యైర్భాష్యకృతాం వరః ||
భాష్యకారులలో శ్రేష్ఠుడైన శంకరులు, అత్యంత గంభీరమైన పదజాలంతో, స్పష్టమైన అర్థంతో ఉత్తర మీమాంస (బ్రహ్మసూత్రాలు) వంటి క్లిష్టమైన గ్రంథాలకు భాష్యాలు రచించారు.
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్ |
సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ||
బ్రహ్మసూత్రాలను రచించిన వ్యాస భగవానుడిని (బాదరాయణుడు), వాటికి భాష్యం వ్రాసిన శంకరాచార్యులను (శివ స్వరూపులు) నేను పదే పదే పూజిస్తున్నాను.
****************************************
*వైదిక సిద్ధాంత ఉద్దీపన*
*అద్వైత సిద్ధాంత స్థాపన (షణ్మత స్థాపనాచార్య)*
శంకరాచార్యుల వారు లోకంలో ఉన్న విభిన్న ఆరాధనా పద్ధతులను సంస్కరించి 'షణ్మతాలను' (ఆరు మతాలు) స్థాపించారు కొనియాడుతుంది.
ఆశేషపాషండ ముఖప్రమర్దనం |
విదారితాశేష కుతర్కవాదినమ్ |
వేదాంత సిద్ధాంత విభాసకం సదా |
తం శంకరం భక్త హితం నమామి ||
వేద విరుద్ధమైన మార్గాలను ఖండించి, కుతర్క వాదుల వాదనలను పటాపంచలు చేసి, వేదాంత సిద్ధాంతాన్ని (అద్వైతాన్ని) ప్రకాశింపజేసిన, భక్తుల మేలు కోరే శంకరులకు నమస్కరిస్తున్నాను.
****************************************
*శాశ్వత ధర్మ స్థాపన కోసం చతురామ్నాయ పీఠ స్థాపన*
పశ్చిమే ద్వారకాపీఠం, పూర్వే గోవర్ధనస్తథా |
ఉత్తరే జ్యోతిర్మఠం చ, దక్షిణే శృంగేరీ తథా ||
భావం: పశ్చిమ దిక్కున ద్వారకా పీఠం, తూర్పున గోవర్ధన పీఠం, ఉత్తరాన జ్యోతిర్మఠం మరియు దక్షిణాన శృంగేరీ పీఠాలను స్థాపించారు.
*తూర్పు పీఠం (పురి)*
అంగవంగ కళింగాద్యాః, పూర్వదేశ వ్యవస్థితాః |
మఠో గోవర్ధనస్తత్ర, హలాయుధాభిరక్షితః ||
అంగ, వంగ, కళింగ దేశాల (తూర్పు భారతం) రక్షణార్థం జగన్నాథ పురిలో గోవర్ధన పీఠం స్థాపించబడింది.
*పశ్చిమ పీఠం (ద్వారక)*
సింధు సౌవీర సౌరాష్ట్రాః, పశ్చిమామ్నాయ గోచరాః|
మఠః శారదా నామ్నా, ద్వారకాయాం వ్యవస్థితః ||
సింధు, సౌరాష్ట్ర ప్రాంతాల ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసం ద్వారకలో శారదా పీఠం నెలకొల్పబడింది.
*ఉత్తర పీఠం (బదరి)*
కురుపాంచాల కాశ్మీర, కాంభోజాద్యాస్తథోత్తరాః |
జ్యోతిర్మఠస్తత్ర విఖ్యాతః, బదర్యాశ్రమ సంస్థితః ||
కాశ్మీరం, కురుపాంచాల వంటి ఉత్తర దేశాల కోసం బదరికాశ్రమంలో జ్యోతిర్మఠం స్థాపించబడింది.
పద్మపాదశ్చ హస్తామలకశ్చ తథా |
తోటకో వార్తికకారశ్చాన్యే |
ఏతైశ్చతుర్భిః శిష్యైః సహితం |
జగద్గురుం శంకరం ప్రణమామి ||
*పద్మపాద: పూర్వ ఆమ్నాయం (పురి)
*హస్తామలక: పశ్చిమ ఆమ్నాయం (ద్వారక)
*తోటక: ఉత్తర ఆమ్నాయం (బదరి)
*వార్తికకార (సురేశ్వరాచార్య): దక్షిణ ఆమ్నాయం (శృంగేరి) ఇలా వీరిని ఆయా పీఠాలలో ఆచార్యులను నియమించారు.
****************************************
*జగద్గురు రూప వర్ణన*
వక్త్రం పద్మమివాభాతీ, నేత్రే నీలోత్పల ప్రభే |
వాచః పీయూష తుల్యాశ్చ, తం వందే శంకరం గురుమ్ ||
పద్మం వంటి ప్రసన్నమైన ముఖము, నీలోత్పలాల వంటి ప్రకాశవంతమైన నేత్రాలు, అమృతం వంటి మధురమైన మాటలు కలిగిన గురువు శంకరాచార్యులకు వందనం.
****************************************
*సామాన్యుల దేవతా అనుగ్రహం కోసం అనేక సంఖ్యాక స్తోత్రముల రచన*
మధురాక్షరకావ్యం నిర్మితం యేన మానినా |
స్తోత్రైః సుధామయైశ్చైవ లోకోద్ధరణ కారణమ్ ||
లోకోద్ధరణ కోసం అమృతం వంటి మధురమైన అక్షరాలతో కూడిన స్తోత్రాలను, కావ్యాలను శంకరులు నిర్మించారు.
****************************************
*శ్రీ శంకరులను అనుసరించు భక్తులకు కలిగే అనుగ్రహం*
యో హృత్కమల మధ్యస్థం, జగద్గురుమనుస్మరేత్|
తస్య విద్యా చ కీర్తిశ్చ, వర్ధతే నాత్ర సంశయః ||
ఎవరైతే తన హృదయ కమలంలో జగద్గురువు శంకరాచార్యులను నిరంతరం స్మరిస్తారో, వారికి విద్య మరియు కీర్తి నిశ్చయంగా పెరుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
****************************************
సనాతన ధర్మం లో జగద్గురువులైన శంకరులు చూపిన వైదిక విధులను ఆచరించడం అందరి కర్తవ్యం .
మీ పిల్లలని పెద్దలను ప్రతివారి మీ సమీపం లోని శంకర మఠములు లో జరిగి వైదిక సేవలు పాల్గొని భగవద్ అనుగ్రహం పొందండి.
జయ జయ శంకర హర హర శంకర 🙏
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏
*రాళ్ళబండి శర్మ* గారి time line నుండి సేకరణ
****************************************
#☀️శుభ మధ్యాహ్నం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩 #🙏శ్రీ ఆది శంకరాచార్యులు జయంతి🕉️