#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్డేట్స్ #🌇శుభ సాయంకాలం వారి భక్తుల సౌకర్యార్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం ఈ నెల 15.04.26 వ తేదీ నుంచి ఉదయం 6.00 గంటల నుంచి 6.45 నిమిషాల వరకూ ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అంతరాలయ దర్శనం కల్పిస్తున్నట్లుగా ఆలయ కార్య నిర్వహణ అధికారి & ఉప కమిషనర్ శ్రీ వెండి దండి శ్రీనివాసుల రెడ్డి గారు పత్రికా ప్రకటన విడుదల చెయ్యడం చాలా సంతోషించదగిన విషయం.*
*" సకల పాపహరణం ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం" అనే స్థల పురాణ ప్రాముఖ్యతను అనుసరించి కరోనాకు పూర్వం ఉన్నటువంటి "శ్రీ వారి ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం" మూడు సంవత్సరాల అనంతరం పునః ప్రారంభం అవ్వడం నిజంగా శ్రీ వారి భక్తులకు ఒక శుభవార్త.*
*శ్రీ వారి ప్రహ్లాద సమేత అంతరాయాల దర్శనం విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులకు,ప్రజా ప్రతినిధులకు,ఆలయ అధికారులకు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు..!!*
*ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నృసింహాయ నమః..!!* 🙏🚩
ఇట్లు,
*శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి - కదిరి.*