#⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిశి నుంచి శశి వెలుగుల్లోకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం...
• ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు అవార్డుల పంట
• నూతన విధానాలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు దిశ, దశ లేని పరిస్థితి ఉండేది. కనీసం పర్యాటకశాఖ కార్యక్రమాలకు కూడా నిధులు, నిర్వహణకు అధికారులు కూడా లేని దుస్థితిలో ఉండేది. పర్యాటక శాఖ భవనాలు అత్యంత దారుణంగా కనిపించేవి. అయితే ఇటీవల పర్యాటక శాఖ తీసుకొస్తున్న వినూత్న విధానాలు, పర్యాటక ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.
1. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పోలలో ఒకటైన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ బ్రాండింగ్, వినూత్న ప్రచారాలు, మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేసినందుకు ఈ అవార్డుకు గుర్తించారు. అరకు లోయ, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్థవంతంగా ప్రమోట్ చేసినందుకు అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు జూన్ 4న కేరళలోని కోవళంలో జరిగే అధికారిక వేడుకకు వెళ్లనున్నారు.
2. గ్లోబల్ టూరిజం అవార్డు: ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సుస్థిర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్స్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ శ్రీ నిశిత గోయల్ గారు ఈ అవార్డును స్వీకరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ అవార్డు