ఫాలో అవ్వండి
pradeep i ithraveni
@76391710pradeep
578
పోస్ట్
4,008
ఫాలోవర్స్
pradeep i ithraveni
499 వీక్షించారు
4 రోజుల క్రితం
#🌸మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💖 *అదుర్స్ అనిపించే మహిళల బైక్ ర్యాలీ*# అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాగపూర్‌లో మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. వీరంతా చీరలు ధరించి బుల్లెట్ల బైకులపై రయ్యిన దూసుకెళ్లారు. హ్యుమనిటీ సోషల్‌ ఫౌండేషన్‌, నిర్మల్‌ పరివార్‌ సంస్థలు ఈ ఈవెంట్‌ను నిర్వహించాయి.
pradeep i ithraveni
691 వీక్షించారు
14 రోజుల క్రితం
#🌾మన ఊరి పంటలు *పండ్లను కడగకుండా తినేస్తున్నారా? ఇది చూడండి!* ముంబైలో ఎలుకలు పండ్లను తినకుండా కాపాడేందుకు వ్యాపారులు 'రాటోల్' అనే మందును పూయడం కలకలం రేపింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 'రాటోల్'లో ఎల్లో ఫాస్పరస్, జింక్ ఫాస్ఫైడ్ లాంటి ప్రమాదకర విషపదార్థాలు ఉంటాయని అధికారులు తెలిపారు. కొద్ది మొత్తంలో తీసుకున్నా లివర్ డ్యామేజీ అవుతుందని, ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. కాబట్టి పండ్లు తినేముందు శుభ్రంగా కడగటం ఎంతో ముఖ్యం#
pradeep i ithraveni
7.8K వీక్షించారు
26 రోజుల క్రితం
#🥗బలం & పోషక ఆహరం #🥗బలం & పోషక ఆహరం #🌾మన ఊరి పంటలు టన్ను బంగినపల్లి రూ.1.75 లక్షలు అమరావతి: కాయకు కవర్లు కట్టి సాగుచేసిన బంగినపల్లి మామిడి రేటెంతో తెలుసా? టన్ను రూ.1.75 లక్షలు! గత కొన్నేళ్లతో పోలిస్తే టన్నుకు రూ.50 వేలకు పైగా అధికంగా దక్కుతోంది.#
pradeep i ithraveni
803 వీక్షించారు
29 రోజుల క్రితం
#🎼 90's క్లాసిక్స్ 🎶 9 రోజుల పాటు భరతనాట్యం.. చరిత్ర సృష్టించిన కర్ణాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుశీ దీక్ష తన ప్రతిభతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్య పరిచారు. ఏకధాటిగా 216 గంటల పాటు (9 రోజులు) నృత్యం చేసి ఆమె 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రతి 3 గంటలకోసారి 15 ని.ల విరామంతో అలసటను సైతం ఓడించి ఆమె ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకులను మైమరిపించాయి. గతేడాది ఆగస్టులోనూ ఆమె ఇలాగే నృత్యం చేసి ప్రశంసలందుకున్నారు..#
pradeep i ithraveni
1.7K వీక్షించారు
1 నెలల క్రితం
#😋ఇష్టమైన ఫుడ్ రెసిపీ *రెడీమేడ్ సాంబార్ కిట్..* గ్రోసరీ స్టోర్లో అమ్మకానికి ఉంచిన 'సాంబార్ కిట్' వీడియో నెట్టింట వైరలవుతోంది. సాంబార్ చేయడానికి అవసరమైన కూరగాయలను కలిపి ఆ కిట్లో ప్యాక్ చేశారు. అయితే ఇది బ్యాచ్లర్స్కు బాగా ఉపయోగపడుతుందని కొందరు దీన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు ధరపై (రూ.113) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 10M వ్యూస్ దాటిన ఈ వీడియో సోమరితనానికి చిహ్నమా లేక సమయం ఆదా చేసే మార్గమా అనే చర్చకు దారితీసింది..#
pradeep i ithraveni
568 వీక్షించారు
1 నెలల క్రితం
#తెలంగాణ టూరిస్ట్ ప్లేసెస్😍✈ *మేడారం జాతరలో లేడీ IPS డాన్స్ వైరల్.. బ్యాక్గ్రౌండ్ తెలుసా?* మేడారం జాతరలో మంత్రి సీతక్కతో కలిసి థింసా నృత్యం చేసిన ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ సోషల్ మీడియాలో వైరల్గా మారారు. చక్కని అభినయం, సంప్రదాయమైన నృత్యం చూసి నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూపీకి చెందిన వసుంధర 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరు ఏసీపీగా ఉన్నారు. ఈమె IAS అజయ్ను పెళ్లి చేసుకున్నారు#
pradeep i ithraveni
511 వీక్షించారు
1 నెలల క్రితం
#🌇చూడవలసిన ప్రదేశాలు *40 ఏళ్ల అమెరికన్ పర్వతారోహకుడు అలెక్స్ హొనాల్డ్ తైవాన్‌లోని తైపీలో ఉన్న తైపీ 101 భవనం ఎక్కడాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు.* అతను 1:31:35 సమయంలో టవర్ పైకి చేరుకున్నాడు. ఈ భవనం 1,667 అడుగుల ఎత్తు ఉంది. ప్రపంచంలోనే 11 వ ఎత్తైన భవనం..#
pradeep i ithraveni
581 వీక్షించారు
1 నెలల క్రితం
#🐶🐱జంతు ప్రేమికులు🥰 *రూ. 13.7 కోట్ల వాచీలో అనంత అంబానీ అడవి.. గడియారం లోపల సింహాలు, పులులు...* ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీకి లగ్జరీ వాచీలు అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఆయన దగ్గర ఉన్న వాచీల కలెక్షన్ చూసి ప్రపంచమే ముక్కున వేలేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆయన కోసం ప్రపంచ ప్రసిద్ధ గడియారాల తయారీ సంస్థ జాకబ్ అండ్ కంపెనీ ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని సృష్టించింది. కేవలం సమయాన్ని చూపడమే కాదు, ఒక అద్భుతమైన కథను చెప్పే ఈ వాచీ ఖరీదు అక్షరాలా రూ.13.7 కోట్లు. ఈ వాచీ లోపల ఏకంగా ఒక అడవిని, అందులో అనంత అంబానీ విగ్రహాన్ని రూపొందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గుజరాత్ లోని జామ్‌నగర్‌లో అనంత అంబానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్ వంటారా గురించి మనందరికీ తెలిసిందే. గాయపడిన, ఆపదలో ఉన్న వేల జంతువులకు ఇది పునరావాసం కల్పిస్తోంది. అనంత అంబానీకి జంతువుల పట్ల ఉన్న ఈ అపారమైన ప్రేమను గౌరవిస్తూ, జాకబ్ అండ్ కంపెనీ ఓపెరా వంటారా గ్రీన్ క్యామో పేరుతో ఒక ప్రత్యేక ఎడిషన్ వాచీని విడుదల చేసింది. ఈ వాచీ డిజైన్ చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గడియారం డయల్ లోపల ఒక చిన్నపాటి అడవిని సృష్టించారు. ఈ వాచీ డయల్ మధ్యలో అనంత అంబానీ 3D సూక్ష్మ విగ్రహాన్ని చేతితో పెయింట్ చేసి అమర్చారు. ఆయన తన ఫేవరెట్ ఫ్లోరల్ షర్ట్ వేసుకుని ఉన్నట్లుగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. కేవలం అంబానీ విగ్రహమే కాదు, ఆయన చుట్టూ అడవికి రాజు అయిన సింహం, బెంగాల్ టైగర్ లఘు విగ్రహాలను కూడా ఎంతో నైపుణ్యంతో చెక్కారు. వంటారా ఎకోసిస్టమ్ లో జంతువులు ఎంత క్షేమంగా ఉన్నాయో చెప్పడానికి ఈ డిజైన్ ఒక నిదర్శనం. జాకబ్ అండ్ కంపెనీ ఇలాంటి స్టోరీ టెల్లింగ్ వాచీలను తయారు చేయడంలో ప్రపంచంలోనే నంబర్ వన్ గా పేరుగాంచింది. ఈ వాచీ తయారీలో వాడిన పదార్థాల గురించి వింటే దిమ్మతిరిగిపోతుంది. గడియారం కేసింగ్, డయల్ పై అడవిని తలపించేలా పచ్చని రంగులో క్యామోఫ్లాజ్ పాటర్న్ ఉంటుంది. ఈ డిజైన్ కోసం దాదాపు 400 విలువైన రత్నాలను (సుమారు 21.98 క్యారెట్లు) ఉపయోగించారు. వాచీ ఫ్రేమ్ మొత్తాన్ని ఖరీదైన వైట్ గోల్డ్ తో తయారు చేశారు. ఇక వాచీ బెల్ట్ విషయానికి వస్తే, దీనిని అసలైన ముసలి చర్మంతో రూపొందించారు. హై-ఎండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ కలయికలో వచ్చిన ఈ వాచీని చూస్తే అది ఒక గడియారంలా కాకుండా ఒక గొప్ప కళాఖండంలా కనిపిస్తుంది. ధర విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం దీని విలువ 15 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13.7 కోట్లుగా ఉంటుందని అంచనా. జనవరి 21, 2026న ఈ వాచీని లాంచ్ చేశారు. గతంలో కూడా జాకబ్ అండ్ కంపెనీ భారతీయుల కోసం రామ జన్మభూమి ఎడిషన్ వాచీని తయారు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అంబానీ వారసుడి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వంటారా వాచీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంబానీ కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇది ఒక అంతర్జాతీయ గుర్తింపుగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.#
See other profiles for amazing content