Follow
Ravi Talluri
@91775
70,028
Posts
32,924
Followers
Ravi Talluri
416 views
8 hours ago
*_హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, మల్లూరు, జయ శంఖర్ భూపాలపల్లి జిల్లా...!!_* *_ఉగ్రం వీరం మహా విష్ణుం_* *_జ్వలంతం సర్వతో ముఖం_* *_నృసింహం భీషణం భద్రం_* *_మ్రిత్యుర్ మ్రిత్యుం నమామ్యహం_* *_జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట  మండల కేంద్రం లో గల మల్లూర్ ఘాట్ దగ్గర వెలసిన స్వయం భు లక్ష్మి నరసింహ క్షేత్రం ఇది . ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది_* . *_చుట్టూ అడవి  మద్యలో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాల రమణీయంగా ఉంటుంది_*. *_యోగానంద నరసింహ స్వామి మరియు లక్ష్మి దేవితో కొలువై ఉన్న ఈ క్షేత్రం లో హనుమ ద్వారా  పాలకుడై  ఉన్నాడు_*. *_చుట్టూ దట్టమైన కొండల పైన వెలసిన ఈ క్షేత్రం లో చింతమాని పుష్కరిణి ఉంది . కొండ పై నుండి  చింతమాని ధర ప్రవహిస్తుంది .ఎల్లప్పుడు ఇక్కడ నీరు ఉంటుంది_,*. *_భద్రాది నుండి  గోదావరి ఎదురుగా సుమారు 90-100 కి మీ  దూరం లో  గల మల్లూరు నరసింహ క్షేత్రం  ను హేమాచల లక్ష్మి నృసింహ క్షేత్రం (హేమాద్రి) అని  పిలుస్తారు.ఇక్కడ ఉన్న ఉగ్రనరసింహ మూర్తి  9 అడుగుల ఎత్తు  గల నరహరి అష్ట బుజములతో విరాజిల్లుతూ  భక్త కోటికి  దర్శనం ఇస్తున్నాడు_* . *_ఇక్కడ స్వామి వారి మూలవిగ్రహాన్ని తాకితే మానవుల చర్మాన్ని తాకితే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతి కలుగుతుంది._* *_ఈ క్షేత్రం చాల మహిమన్మితమైన క్షేత్రం మరియు  స్వామి ని దర్శించుకుంటే  అన్ని రకాల బాదలు ,దోషాలు  పోతాయని భక్తుల విశ్వాసం_* . *_వైశాక  శుద్ధ పౌర్ణమి నుండి స్వామి వారి  కళ్యానోత్సవములు నిర్వహించబడును_*. చాల మంది  భక్తులు స్వామి వారి  కళ్యాణోత్సవానికి వస్తారు. *వెళ్ళు మార్గం :* *_మంగపేట్ కి సుమారు 5 కి మీ_* *_దూరం లో ఉన్న ఈ క్షేత్రం_* *_ఏటూరునాగారం_* _భద్రాచలం వెళ్ళు మార్గం లో_ వస్తుంది #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
422 views
8 hours ago
*_హమారా బజాజ్ - సువేగా - చల్ మేరీ లూనా_* *_భారతదేశ రవాణా రంగ చరిత్రనేది ఎన్నో మైలురాళ్ళతో ఆసక్తికరమైన మలుపులతో వున్న ఒక గాథ.కార్లప్రవేశం బ్రిటీష్ పాలనలోనే మొదలైంది. 1897లో క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీ యజమాని ఫాస్టర్ అనేవాడు_*. *_భారతదేశానికి మొదటికారును తీసుకువచ్చాడు.ఆ వెంటనే 1898లో జెంషెడ్‌జీ టాటా ముంబాయికి మొదటికారును తెచ్చిన స్వదేశీయుడిగా ఘనత వహించాడు.దేశీయ వాహనచరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని టాటా ప్రారంభించారు.అదే సంవత్సరంలో మరికొన్ని కార్లు కూడా ముంబాయి తీరానికి చేరుకోవడంతో మనదేశంలో వాహన సంస్కృతికి పునాది పడింది._* *_మలిదశలో కార్ల దిగుమతి & అసెంబ్లింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 1928 డిసెంబరులో జనరల్ మోటార్స్ హిందూస్థాన్ లిమిటెడ్ వారు యూరప్ నుండి విడిభాగాలను దిగుమతి చేసుకొని ముంబాయిలో అసెంబ్లింగ్ చేసి భారత రహదారులపైకి కారును తీసుకువచ్చారు_*. *_అయితేసంపూర్ణంగా భారతదేశంలో తయారైన మొదటి కారు అంబాసిడర్._* *_కోల్‌కతాలో 1948లో మోరిస్ ఆక్స్‌ఫర్డ్ వారు ఈ కార్లను ఉత్పత్తి చేసి ఆ తరువాత హిందూస్థాన్ మోటార్స్ పేరుతో కార్ల ఉత్పత్తి చేశారు_*. *_ఈ అంబాసిడర్ సుమారు 4 దశాబ్దాల పాటు భారతీయ రోడ్లను ఏలింది.హిందుస్థాన్ కంపెనీ వారు ప్రవేశపెట్టిన అంబాసిడర్ కారు కొత్త సాంకేతికతతో ఆధునిక సౌకర్యాలతో నవీన రూపంలో మరలా మార్కెట్టులోనికి వచ్చే అవకాశముంది_*. *_కార్ల సాంకేతికతలో మరింత అభివృద్ధి చెందిన తర్వాత 1984లో మధ్యతరగతి ప్రజల కలల వాహనంగా మారుతి–800 విడుదలైంది.ఇదే భారతదేశంలో మొదటి ఎయిర్ కండీషన్డ్ (AC) కారుగా వాహనరంగంలో ఒక కొత్తయుగానికి నాంది పలికింది_*. *_కార్లచరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన 1920లో చోటుచేసుకుంది. అల్వార్ మహారాజా జై సింగ్ ఇంగ్లాండ్‌లో రోల్స్ రాయిస్ షోరూమ్‌కి సాధారణ దుస్తుల్లో వెళ్ళగా సేల్స్ ప్రతినిధులు ఆయనను సామాన్యుడిగా భావించి అవమానించారు_*. *_ప్రతీకారంగా ఆ రాజాగారు ఒకేసారి ఏడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి భారతదేశానికి తెచ్చి వాటిని మునిసిపాలిటీకి అప్పగించి చెత్త సేకరణకు ఉపయోగించారు. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లు చెత్తబండ్లుగా వాడటంతో ఆ కార్ల బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతింది.చివరికి రోల్స్ రాయిస్ యాజమాన్యం రాజుగారికి క్షమాపణలు చెప్పి కొత్తకార్లను ఉచితంగా అందించింది._* *_ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 1950లో భారతదేశంలో మొదటగా ప్రవేశించిన స్కూటర్ లాంబ్రెట్టా.ఆ తర్వాత 1972లో బజాజ్ స్కూటర్ హమారా బజాజ్ అంటూ మనఇంటిలో భాగమై 2009 వరకు కొనసాగింది.బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడిన చిన్నవాహనమైన సువేగా మోపెడ్._* *_మంచి వేగంతో నడిచే మోపెడ్ అనే అర్థం వచ్చేలా భారతీయ మార్కెట్లో ప్రవేశించింది_*. *_కోయంబత్తూరుకు చెందిన కెఎల్ వి ఫౌండర్స్ సంస్థ 1962లో తిరుపతిలో ఈ సువేగా కర్మాగారాన్ని స్థాపించి 1988 వరకు విజయవంతంగా ఉత్పత్తి చేసింది._* *_ఇక 1972లో మార్కెట్లోకి వచ్చిన లూనా మోపెడ్ కూడా ఇరవైఏళ్ళ క్రితంవరకు మధ్యతరగతి ప్రజల ప్రియమైన వాహనంగా నిలిచింది. చల్ మేరీ లూనా అనే ప్రకటన గురించి ఇప్పటికీ పాతతరం వారికి గుర్తుండే వుంటుంది_*. *_మరోవైపు పటిష్టమైన ప్రయాణానికి మారుపేరైన జీపు (Jeep) అనే పదం General Purpose నుండి పుట్టింది.రెండవ ప్రపంచ యుద్ధసమయంలో 1941లో ఐరోపా సైనికుల అత్యవసర ప్రయాణాల కోసం వీటిని రూపొందించారు. భారతదేశంలో 1954లో మహీంద్రా అండ్ మహీంద్రా వారు మొదటిసారిగా జీపును నిర్మించారు. అంతవరకు అమెరికన్ విల్లీస్ (Willys) జీపు మనదేశంలో వుండగా మహీంద్రా జీపుల రాకతో భారతీయ రహదారులపై కొత్తశకం ప్రారంభమైంది_*. *_ఈ విధంగా భారతీయ వాహనరంగం బ్రిటీష్ కాలం నుండి స్వాతంత్ర్యం తర్వాతి దశవరకు ఎన్నో మలుపులు తిరిగి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ నేటి ఆధునిక ఆటోమొబైల్ పరిశ్రమకు పునాది వేసింది._* *_//సేకరణ//_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
526 views
8 hours ago
*_దేవి ఛిన్నమస్తా దశమహావిద్యలలో అత్యంత గంభీరమైన మరియు రహస్యమైన రూపాలలో ఒకటి_*. *_ఆమె అహంకారాన్ని పూర్తిగా జయించడాన్ని, ఆత్మబలిదానాన్ని, మరియు జీవితం, మరణం & ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క శాశ్వత చక్రాన్ని సూచిస్తుంది_*. *_సాంప్రదాయకంగా ఆమె తన తెగిపడిన తలను చేతిలో పట్టుకుని, ఆమె శరీరం నుండి దైవిక శక్తి ధారలు ప్రవహిస్తున్నట్లుగా ఒక అద్భుతమైన రూపంలో దర్శనమిస్తుంది._* *_పరిమితమైన అహంకారాన్ని దైవం యొక్క అనంతమైన సత్యానికి అప్పగించినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక సాక్షాత్కారం లభిస్తుందని చెప్పడానికి ఈ రూపం ఒక శక్తివంతమైన రూపకం._* *_ఛిన్నమస్తా కేవలం వినాశనాన్ని మాత్రమే ప్రతిబింబించదు; ఒక జీవం మరొక జీవాన్ని ఎలా నిరంతరం పోషిస్తుందో, మరియు ఆత్మ భౌతిక శరీరంపై ఉన్న వ్యామోహాన్ని ఎలా అధిగమించగలదో వివరిస్తూ, ఆమె పరివర్తన (మార్పు) యొక్క రహస్యాలను మూర్తీభవిస్తుంది. భక్తులు భయాన్ని, అజ్ఞానాన్ని, బంధాలను వీడి, ద్వంద్వత్వానికి అతీతమైన ఉన్నతమైన చైతన్య స్థితికి ఎలా చేరుకోవాలో ఆమె యొక్క ఈ ఉగ్రమైన, అయినా కరుణామయమైన రూపం బోధిస్తుంది. తాంత్రిక సంప్రదాయాలలో, ఆమె సృష్టి మరియు లయాల (వినాశనం) వెనుక ఉన్న దాగి ఉన్న ఏకత్వాన్ని వెల్లడించే అపారమైన ఆధ్యాత్మిక శక్తి గల దేవతగా పూజించబడుతుంది. అన్ని మార్పులు మరియు అనిత్యాల వెనుక దైవం యొక్క శాశ్వతమైన, అవినాశ్యమైన సత్యం దాగి ఉందని ఆమె భక్తులకు గుర్తుచేస్తుంది._* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
476 views
8 hours ago
1️⃣5️⃣. *_సుందరకాండ-హనుమ_* *_15 వ భాగం_* *నమోస్తు రామాయ సలక్ష్మణాయ* *దేవ్యైచ తస్యై జనకాత్మజాయై* *నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో* *నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః* *_హనుమ నిద్రపోతున్న రావణాసురుని పరికించి చూస్తున్నారు, తలపై వున్న కిరీటం కొంచెం పక్కకు వొదిగివుంది. ముఖమంతా తాను చేసిన తపముల వలన వచ్చిన తేజస్సుతో నిండి వుంది. రెండు చేతులు నిదురపోతున్న ఐదు తలల సర్పంలా, మదమెక్కిన గజముయొక్క తొండము వలె వుంది. విశాలమైన భుజములు, బంగారంతో చేయబడిన ఉత్తరీయం ధరించివున్నాడు. హనుమ రావణుని తపోశక్తి వలన ప్రకాశిస్తున్న తేజస్సును చూసి ఆశ్చర్యపడి సీతమ్మతల్లి ఎక్కడువుందో యని ఆలోచిస్తున్నారు. రావణుని పట్టమహిషి అయిన మండోదరి, మరియు ఇతర ముఖ్యమైన మందిరాలు అన్నీ తరచి తరచి చూసారు. ఎక్కడా సీతమ్మ కానరాలేదు._* *_మనస్తాపం_* *_హనుమ రావణుని శయన మందిరాలు, పట్టమహిషి యొక్క మందిరము, మిగిలిన నారీ మణుల మందిరాలు, పూజా మందిరాలు, ఆయుధశాలలు, పాకశాలలు, ఇలా వెదకని చోటులేదు, తిరగని ప్రదేశం లేదు లంకానగరంలో అణువణువు గాలించారు స్వామి. కాని తన తల్లి సీతమ్మ జాడ కానరాలేదు. మనసులో పరిపరి విధముల ఆలోచనలు. ఈ దుష్ట రావణుని చేతిలో పడడం కన్నా ఆత్మహత్యే శరణ్యమని భావించి తనకు తాను ఆత్మాహుతికి పాల్పడేదా, ఈ రాక్షస వికృతాకారాలు చూసి భయపడి తనువు చాలించేదా, ఇప్పుడు నేను సుగ్రీవునికి శ్రీరామచంద్రునికి ఏమని సమాధానం చెప్పను, సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది, కనుక నా వానర సోదరులు ప్రాణత్యాగాలు చేస్తారు. సముద్రం దాటగానే అంగద జాంబవంతులకు ఏమని సమాధానం చెప్పను. ఇలా హనుమ చింతిస్తూ, లేదు తల్లి మరణించి వుండదు, సంపాతి సీతమ్మ తల్లి లంకలో వుందని చెప్పాడు కదా, ఆయన మాటలు తప్పవు, మళ్ళీ వెదకడానికి నిశ్చయించుకున్నారు. రావణుని విలాసమందిరాలు, నాగకన్యామందిరాలు అన్నీ వెదుకుతున్నారు. కాని సీత జాడ లేదు. మళ్ళీ విచారం ఆవహించింది. సీత జాడ తెలియకపోతే నా రామునికి ఏమని బదులివ్వను, సీతమ్మ తల్లి జాడ తెలుసుకుని వస్తానని ప్రతిజ్ఞలు చేసానే, నా రామునికి సీతమ్మ కనిపించలేదని చెబితే బాధతో ప్రాణాలు వదిలేస్తారు, అది చూసి లక్ష్మణుడు కూడా ప్రాణత్యాగం చేస్తారు. ఇక్ష్వాకుల వంశం ముగిసిపోతుంది. సుగ్రీవుడు కూడా ప్రాణాలు విడుస్తాడు, వానరలు కొందరు ఆత్మాహుతికి పాల్పడతారు, కొందరు అగ్నిగుండంలోకి దూకుతారు, కొందరు ఉపవాసాలు చేసి మరణిస్తారు. వానర జాతికూడా అంతరించిపోతుంది. కావున నేను వెనక్కి వెళ్ళను. ఇక్కడే వానప్రస్థ జీవితం గడిపితే, నేనింకా సీతమ్మను అన్వేషిస్తున్నాననే ఆశలో జీవిస్తూ వుంటారు. చితి పేర్చుకుని అందులో దూకి ప్రాణత్యాగం చేయనా, లేక ఉపవాసాలు చేస్తూ ఇక్కడ రాక్షసులకు ఆహారమైపోనా ఇదొక నిర్వాణ మార్గం. అయినా సీతను చూడకుండా నేను వెనక్కి వెళ్ళినా, లేదా ప్రాణత్యాగం చేసినా నా కీర్తికి భంగం కలుగుతుంది, నా తల్లిదండ్రులు గురుదేవులు నన్ను ఆశీర్వదించి పంపిన దేవతలు అందరికీ అపఖ్యాతి తెచ్చిన వాడనవుతాను. ఈ విధముగా స్వామి శోకసముద్రంలో మునిగి, మళ్ళీ వివేకముతో ఆలోచించారు. సర్వ అనర్థాలకు దుఃఖమే మూలం, ఆ దుఃఖాన్ని వీడి సంతోషంగా వుండగలిగితే కావలసిన కార్యం నెరవేరుతుంది. అని,_* *నమోఽస్తు రామాయ సలక్ష్మణాయై దేవ్యై చ తస్యై జనకాత్మజాయై|* *నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోఽస్తు చన్ద్రార్క మరుద్గణేభ్యః* *_శ్రీరామలక్ష్మణులకు నమస్సులు, సీతమ్మతల్లికి వందనం. ఇంద్రునికి, తండ్రి వాయుదేవునికి, పరమేశ్వరుని నమస్కారం, యమదేవునికి, సూర్య చంద్రులకు నమస్సులు. నా ప్రభువు సుగ్రీవునకు నమస్సులు, అని అందరికీ నమస్కార ప్రార్థనలు సమర్పించి ముందుకు సాగిపోయారు. చతుర్ముఖ బ్రహ్మ సర్వదేవగణాలు, సమస్త భూతోకోటి, దేవగణాలు, అగ్నిహోత్రుడు, దేవేంద్రుడు, సూర్య చంద్రులు, పరమేశ్వరుడు, అశ్వినీ దేవతలు, నాకు కార్యసిద్ధి యివ్వాలి, నా రామకార్యానికి సహాయాన్ని అందించాలి, చంద్రబింబము వంటి మోము కల సీతమ్మ తల్లి నాకు కనిపించాలి, పరమ దుష్టుడు, నీచుడు, దుష్టుడు, కౄరుడైన రావణునిచే అపహరింపబడిన జానకీ మాతను ఏ విధముగా చూడగలనోయని ఆలోచిస్తూ, అంతవరకు గాలించని అశోకవనం వైపు వెడుతున్నారు_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
593 views
8 hours ago
1️⃣1️⃣2️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_112 వ భాగం_* *_శ్రీకృష్ణావతారము-14._* *_చాణూర ముష్టిక,కంస సంహారం:_* *_బలరామ కృష్ణులు కువలయా పీడ ఏనుగు దంతాలు చేతబట్టుకుని కంసుని రాజప్రాసాదంలో ఏర్పాటు చేసిన మల్లయుద్ధ మైదానంలోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ ఉన్న నందుడు మొదలైన నందగ్రామ ప్రజలు, మధురప్రజలు హర్షధ్వానాలతో వారికి స్వాగతం పలికారు_*. *_కంసుడు ఎదురుగా ఎత్తైన వేదిక పైన సింహాసనం మీద కూర్చుని బలరామకృష్ణులను పరికిస్తున్నాడు. “ఈ నీలమేఘ ఛాయ బాలుడైన కృష్ణుడా నన్ను చంపడానికి పుట్టినవాడు. నారదుడు చెప్పినట్లు నారాయణుడు అవతారమా లేక మాములు మానవబాలుడా తేలుస్తాను” అనుకుని మల్లయుద్ధ గోదా లోకి దిగమని చాణుర ముష్టికులు అనబడే తన మల్లయుద్ధ వస్తాదులకు సైగ చేశాడు._* *_వారు మైదానంలోకి దిగగానే బలరామ కృష్ణుల వంక చూసి “ప్రియమైన మేనళ్ళులారా! మీరు మా చాణూర ముష్టికులతో మల్ల యుద్ధం చేయండి_*. *_మేటిరాక్షసులను చంపిన మీ బల పరాక్రమాలు నేడు కళ్ళారా చూసి ఆనందపడతాను_*. *_వీరిని గెలిస్తే తరువాత నన్ను కల్వ వచ్చును” అని ఎగతాళి చేస్తునట్లు మాట్లాడాడు._* *_కృష్ణుడు పట్టించుకోక “కంస మామా! నీ ముచ్చట చెల్లించడానికే కదా మేము మధుర వచ్చాము. ప్రియమైన మా మామ ఆఖరి కోరిక తప్పక తీరుస్తాను” అని బలరామునికి సైగ చేశాడు._* *_ఇద్దరు వస్త్రాలు బిగించి కట్టి మల్లయుద్ధానికి సిద్దమయ్యారు_*. *_తన అనుమతి కోసం దగ్గరకు వచ్చిన చాణూర_* *_ముష్టికులతో కంసుడు_* *_“బాలురని దయ చూపకుండా ఇద్దరు బాలురను_* *_నిర్ధాక్షిణ్యంగా చంపేయండి" అని ఆదేశించాడు._* *_చాణురుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు ద్వంద్వ పోరాటానికి దిగారు. కొదమ సింహాల లాగా పోరాడుతున్న బలరామ కృష్ణులను చూసి ప్రజలు ఆనందంతో కరతాళ ధ్వనులు చేస్తుంటే, చాణుర ముష్టికులకు వారు సామాన్య బాలకులు కాదు అనిపించింది._* *_మల్లయుద్ధ ప్రవీణుల వలె వారు కురిపించే ముష్టిఘాతాలను తట్టుకోలేక పోతున్నారు._* *_అరక్షణంలో బాలురని చంపి కంసుడి మెప్పు, బహుమతులు పొందాలి అన్న స్థితి నుండి తమను బలరామ కృష్ణుల నుంచి ఎలా రక్షించుకోవాలి అనే స్థితికి చాణూర ముష్టికులు వచ్చారు._* *_బలహీన పడుతున్న వారిని చూసి కృష్ణుడు బలరామునితో “అన్నా! త్వరగా వీరి పని ముగించి మనం కంస మామ సంగతి చూడాలి” అన్నాడు._* *_కృష్ణుడు చాణూరుని ‘కరవడ’ మనే బంధంలో పట్టి ఉంచాడు._* *_చాణురుడు అతి కష్టంగా వది లించుకుని కృష్ణుని గుండెల పై పిడికిలితో కొట్టబోయాడు. కృష్ణుడు నేర్పుగా తప్పించుకుని వాడి రెండు చేతులు పట్టుకుని గిరగిరా తిప్పి నేల మీదకు గట్టిగా విసిరివేశాడు. రక్తం కక్కుకుని చాణూరుడు చనిపోయాడు_*. *_అక్కడ ముష్టికుడూ అంతే. బలరాముని బాహు ప్రహారాలకు తట్టుకోలేక రక్తం ధారగా కారుతుంటే నేల పై పడి మరణించాడు. కృష్ణుడు కంసుడి వైపు వెళ్లగా బలరాముడు చాణూరముష్టికులకు తోడుగా వచ్చిన మల్ల యోధుల, రాజ భటుల పని పట్టసాగాడు_*. *_కంసుడు తన మీదకు సింహం లాగా ఉరుకుతూ వస్తున్న కృష్ణుని చూసి కత్తి దూశాడు._* *_కంసుడి ఖడ్గ ప్రహరాన్ని తప్పించుకుని కృష్ణుడు అతని సింహాసనం పై నుంచి కిందకు తోసాడు_*. _కంసుడి కిరీటం పడిపోయింది. కత్తి దూరంగా పడింది. జట్టు పట్టుకుని మల్లయుద్ధ మైదానంలో పడ వేశాడు. కృష్ణుడి బాహువుల బలానికి కంసుడికి భయం, ఆశ్చర్యం కలిగాయి._ *_తన ఆకారంలో సగం కూడా లేని బాలుని ఏం చేయలేక నిస్తేజుడై చూస్తున్నాడు. మరణభయం కన్నులలో కనపడసాగింది. కంసుడి భయాన్ని ప్రజల్లో పోగొట్టాలని వాడిని మైదాన మంతా గిరగిరా తిప్పి మధ్యలో పడవేసి మీద కూర్చున్నాడు. కంసుని వంక నవ్వుతూ చూస్తూ “మామా! ఇన్నాళ్లూ చేసిన అనేక దుష్కర్మలకు ఫలం ఇప్పుడు పొందబోతున్నావు. పుట్టిన మానవునికి మరణం సహజం. అది మరచి అశరీరవాణి చెప్పిందని చెల్లెలు, బావను, కన్నతండ్రిని జైలులో పెట్టావు. పుట్టిన బిడ్డలను దయ కరుణ లేకుండా నిర్ధాక్షిణ్యంగా పుట్టగానే చంపావు. ఇప్పుడు మృత్యువు నీ ముగింట నిలిచింది. చూసి ప్రాణం వదులు” అనిరెండుచేతులు పిడికిలి బిగించి గుండెలపైకొట్టాడు_*. *_నోటి వెంట రక్తం రాగా కంసుడు ప్రాణం వదిలేశాడు._* *_కృష్ణుడి మీదకు వస్తున్న కంసుడి సోదరులను బలరాముడు యమపురికి పంపాడు. దేవతలు ఆకాశం నుంచి బలరామ కృష్ణుల మీద పుష్పవర్షం కురిపించారు. మధుర ప్రజలు పండుగ చేసుకున్నారు_*. *_అక్రూరుని వెంట బలరామ కృష్ణులు చెరసాలకు వెళ్లి_* *_తల్లిదండ్రులు వసుదేవుడు, దేవకిదేవిల_* *_చెర విడిపించారు_*. *_తమకు నమస్కరిస్తున్న బలరామ కృష్ణులను దేవకీవసుదేవులు లేపి హత్తుకున్నారు._* *_తనివితీరా ఎదిగిన కుమారులను చూసి మురిసిపోతున్నారు._* *_అక్రూరుడు వెళ్లి కారాగారంలో ఉన్న కంసుని తండ్రి ఉగ్రసేనుని విడిపించి అక్కడకు తీసుకు వచ్చాడు. తాతగారికి బలరామ కృష్ణులు ఇద్దరు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు_*. *_కృష్ణుడు ఉగ్రసేనునితో తాతగారూ! మరణించిన కంసుడు మొదలైన కుమారులకు అంత్యక్రియలు జరి పించండి" అనికోరాడు_*. *_ఉగ్రసేనుడు అక్రూరునితో కలసివెళ్లాడు. తల్లిదండ్రులను తీసుకుని బలరామ కృష్ణులు రాజభవనానికి వెళ్లారు. అక్కడ నందుడు మరియు ఇతర గ్రామవాసులు వేచి ఉన్నారు. నందునిపాదాలకు నమస్కరించి కృష్ణుడు “నాన్న గారూ! ఇన్నాళ్లు మాకు దూరంగా చెరసాలలో ఉన్న మా తల్లిదండ్రులు దేవకి వసుదేవులతో నేను,బలరాముడు ఉంటాం. మీరు నంద గ్రామం తిరిగి వెళ్లి యశోదమ్మకు సంగతి చెప్పి జాగ్రత్తగా చూసుకోండి" అని తాము తిరిగిరాలేమన్నసంగతి అర్ధం అయ్యేటట్టు చెప్పాడు. నందుడు,గోపాలురు నిరాశగా బృందా వనానికి బయలుదేరి వెళ్లారు_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
537 views
8 hours ago
*_దివ్యాస్త్రాలు_* *_ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన, తిరుగులేని 10 దివ్యాస్త్రాలు ఇవి:_* *_వీటిని ఎవరైనా తమంతట తాముగా చేతపట్టలేరు. అవి వారికి ప్రసాదించబడాలి_*. *_ఎన్నో ఏళ్ల అకుంఠిత దీక్ష, కఠోర తపస్సు, సంపూర్ణమైన అంతర్గత ప్రశాంతత ద్వారా మాత్రమే వాటిని సాధించగలరు._* *_మనం ఇప్పుడు ఆ దివ్యాస్త్రాల గురించి 10 నుండి 1 వరకు తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైనవి చివరన ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో ఉన్న అస్త్రం, బహుశా ఎవరూ ఊహించనిది._* *10. వాసవీ శక్తి:*` *_ఇది ఇంద్రుని ఆయుధం. దీనిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. ఇంద్రుడు దీనిని కర్ణుడికి బహుమతిగా ఇవ్వలేదు._* *_బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన ఇంద్రుడు, తనను యాచించిన వారిని ఎప్పటికీ కాదనలేని కర్ణుడి దానగుణాన్ని ఆసరాగా చేసుకుని అతని కవచకుండలాలను అడిగాడు. కర్ణుడు పుట్టుకతోనే వాటిని ధరించి ఉన్నాడు. అవి అతని శరీరంలో ఒక భాగం, అతని గుండెచప్పుడు లాంటివి. కానీ కర్ణుడు ఏమాత్రం వెనుకాడకుండా తన శరీరం నుండి వాటిని కోసి ఇంద్రుడికి సమర్పించాడు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు 'వాసవీ శక్తి'ని ప్రసాదించాడు. ఒక్కసారి ప్రయోగిస్తే శత్రువు మరణం తథ్యం. ఆ తర్వాత అది ఇంద్రుని వద్దకే తిరిగి వెళ్లిపోతుంది, కర్ణుడి వద్దకు కాదు._* *_కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతిరోజూ కర్ణుడు దానిని అర్జునుడి కోసమే దాచుకున్నాడు. ఎన్నో యుద్ధాలు, దానిని ప్రయోగించడానికి ఎన్నో సులువైన అవకాశాలు వచ్చినా నిగ్రహించుకున్నాడు. కానీ 14వ రోజు రాత్రి, భీముని రాక్షస పుత్రుడు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని ఊచకోత కోస్తున్నాడు. చీకటి పడేకొద్దీ రాక్షసుల బలం పెరుగుతుంది. ఆ రాత్రి ఘటోత్కచుడిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. అప్పుడు కర్ణుడు ఆ వాసవీ శక్తిని ప్రయోగించాడు_*. *_ఘటోత్కచుడు నేలకొరిగాడు. కానీ, అర్జునుడిని ఎదుర్కోవడానికి కర్ణుడి వద్ద ఉన్న ఏకైక అస్త్రం చేజారిపోయింది. ఆ తర్వాత జరిగిందే మహాభారతంలో ఒక విచిత్రమైన ఘట్టం.. పాండవ శిబిరం కన్నీటి సంద్రమైంది. ధర్మరాజు విలపించాడు, యోధులంతా ఆక్రోశించారు. కానీ అందరిలో ఒక్క శ్రీకృష్ణుడు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నాట్యం చేశాడు. విజయగర్వంతో భుజాలు చరుచుకున్నాడు, పాంచజన్యం పూరించాడు, అర్జునుడిని హత్తుకున్నాడు. ఎందుకంటే... కర్ణుడి అస్త్రాన్ని వృధా చేయించడానికే కృష్ణుడు ఆ రాత్రి ఘటోత్కచుడిని యుద్ధానికి పంపాడు. ఒకే అస్త్రం, ఒకే రాత్రి, ఒకవైపు అందరూ శోకిస్తుంటే ఒకే ఒక్కడు సంబరాలు చేసుకున్నాడు. ఆ క్షణంలోనే యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది._* *9. నాగపాశం:* *_ఇది ప్రాణాలను తీయదు, కానీ శరీరాన్ని పూర్తిగా బంధిస్తుంది. దీనిని రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు ప్రయోగించాడు. లంకా సంగ్రామంలో రామలక్ష్మణులను ఒకటి కంటే ఎక్కువసార్లు ఓడించి, సజీవంగా తిరిగి వెళ్లిన ఏకైక యోధుడు అతడే. అదీ కనిపించకుండా! మాయా యుద్ధం చేస్తూ ఆకాశం నుంచి దీనిని ప్రయోగించాడు_*. *_నాగపాశం గాలిలో ఉండగానే వేలాది సజీవ సర్పాలుగా మారుతుంది. అవి ఏమాత్రం తొందరపడవు, కాటేయవు... మిమ్మల్ని కదలనివ్వకుండా ఎంత గట్టిగా బిగించాలో లెక్కగడుతూ అంతలా చుట్టుకుంటాయి_*. *_అత్యంత పరాక్రమవంతులైన రామలక్ష్మణులు ఇద్దరూ ఒకేసారి కదల్లేని స్థితిలో రణభూమిలో నేలకొరిగారు. వానర సైన్యం రామలక్ష్మణులు మరణించారని భయంతో హతాశులయ్యారు. అయితే దీనికి విరుగుడు, ఆ అస్త్రం పుట్టకముందే ఈ సృష్టిలో లిఖించబడి ఉంది_* *_శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు. గరుడుని తల్లి వినత, సర్పాల తల్లి కద్రువ అక్కాచెల్లెళ్లు. ఒక పందెంలో మోసంతో గెలిచిన కద్రువ, వినతను బానిసగా చేసుకుంది. ఆ బానిసత్వంలోనే పుట్టిన గరుత్మంతుడు, అమృతాన్ని తీసుకొచ్చి తన తల్లిని విడిపించే వరకు ఆ భారాన్ని మోశాడు. ఆ క్షణం నుంచే గరుడునికి, నాగ జాతికి మధ్య ఉన్న వైరం ఈ సృష్టి ధర్మంలో భాగమైపోయింది. నాగపాశం సర్పజాతికి చెందినది. దానిని నాశనం చేయడానికే గరుత్మంతుడు ఉన్నాడు._* *_అతడు ఒక పెనుగాలిలా దూసుకురాగానే, సర్పాలన్నీ భయంతో చెల్లాచెదురయ్యాయి. రామలక్ష్మణులు మళ్లీ లేచి నిలబడ్డారు. నాగపాశం విడదీయలేని బంధనం. దానిని ఛేదించడానికి సాక్షాత్తూ ఆ గరుత్మంతుడే రావాల్సి వచ్చిందంటే, ఆ అస్త్రం ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు_* *8. వైష్ణవాస్త్రం:* *_నాగపాశం బంధిస్తుంది, వైష్ణవాస్త్రం ప్రాణాలు తీస్తుంది. ఈ విశ్వంలో దీన్నుంచి ప్రాణాలతో బయటపడగలిగే ఏకైక వ్యక్తి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు మాత్రమే. అది కేవలం ఒక వర్ణన కాదు, ఆ అస్త్రం సృష్టించబడినప్పుడు లిఖించబడిన నియమం._* *_కురుక్షేత్రం 12వ రోజు._* *యుద్ధభూమిలో ఉన్న చాలామంది పుట్టకముందు నుంచే యుద్ధాలు చేస్తున్న ప్రాగ్జ్యోతిషపుర రాజు భగదత్తుడు, సుప్రతీకమనే తన భారీ ఏనుగు మీద కూర్చుని అర్జునుడిపై దీనిని ప్రయోగించాడు*. *అప్పుడు కృష్ణుడు అర్జునుడికి అడ్డుగా నిలబడ్డాడు. కృష్ణుడు ఆ అస్త్రాన్ని అడ్డుకోలేదు, తన వక్షస్థలంపై స్వీకరించాడు.* *కృష్ణుడి ఛాతీకి తాకగానే అది ఒక పూలమాలగా మారి ఆయన మెడలో పడింది. ఎందుకంటే తాను ఎవరిని తాకిందో ఆ అస్త్రానికి తెలుసు. వెళ్లడానికి దానికి వేరే చోటు లేదు.* *చాలా కథల్లో చెప్పని ఒక నిజం ఉంది. ఈ అస్త్రం మొదటినుంచీ భగదత్తుడికి చెందింది కాదు. నరకాసురుడి రక్షణ కోసం భూదేవికి కృష్ణుడు ఇచ్చిన వరం అది. నరకాసురుడి నుంచి భగదత్తుడికి అది వారసత్వంగా వచ్చినా, దాని శక్తి తగ్గలేదు. కానీ అది కృష్ణుడిని తాకినప్పుడు, కేవలం తన సొంత గూటికి చేరిందంతే! యుద్ధం చేయనన్న తన ప్రతిజ్ఞను కృష్ణుడు మీరాడని అర్జునుడు కోపగించుకున్నాడు. దానికి కృష్ణుడి సమాధానం అత్యంత సరళమైనది— ఆ అస్త్రం బారినుండి బ్రతకగలిగేది ఆయన మాత్రమే. వేరే దారే లేదు.``` *7. బ్రహ్మాస్త్రం:*``` ఇంతవరకు మనం చూసిన అస్త్రాలన్నింటికీ ఒక భౌతిక రూపం ఉంది. గాలిలో వెళ్తున్నప్పుడు మనం వాటిని చూడగలం. కానీ ఏడవ స్థానంలో ఉన్న అస్త్రానికి రూపం లేదు. బ్రహ్మాస్త్రాన్ని కంటితో చూడలేము. యోధుడు తన చేతిలో పట్టుకున్న గడ్డిపోచ, కర్ర, బాణం అంచు... దేనిమీదైనా మంత్రాన్ని పఠించి దీనిని ప్రయోగించవచ్చు. దాన్ని దేనితో ప్రయోగిస్తున్నారన్నది ముఖ్యం కాదు. ఆ అస్త్రాన్ని ఆహ్వానిస్తున్న వ్యక్తి దాన్ని పూర్తిగా నియంత్రించగలడా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. దీని జ్ఞానం ఒక నిర్దిష్ట గురుశిష్య పరంపర ద్వారా ప్రయాణించింది. భరద్వాజుడి నుండి అగ్నివేశుడికి, అగ్నివేశుడి నుండి ద్రోణుడికి, ద్రోణుడి నుండి తన ప్రియ శిష్యుడు, దీనిని ఎన్నటికీ దుర్వినియోగం చేయడనే నమ్మకం ఉన్న అర్జునుడికి చేరింది. మరోవైపు, పరశురాముడు క్షత్రియులకు విద్యను నేర్పడు కాబట్టి, కర్ణుడు తనను తాను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుని మారుపేరుతో వెళ్లి ఈ అస్త్రాన్ని సాధించాడు. కానీ ఆ అబద్ధం తెలిసిన క్షణంలో, అత్యవసరమైన సమయంలో ఈ అస్త్రాన్ని మర్చిపోతావని పరశురాముడు శపించాడు. ఆ పరంపరలో తెగిపోయిన ఒకే ఒక బంధం అది. కర్ణుడి జీవితగమనం అంతా ఆ ఉదయం జరిగిన ఆ ఒక్క సంఘటన తోనే వంగిపోయింది. బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవచ్చు, వెనక్కి రప్పించవచ్చు, మరో బ్రహ్మాస్త్రంతో ఎదుర్కోవచ్చు. కానీ ఆరవ స్థానంలో ఉన్న అస్త్రం అలాంటి అవకాశమే ఇవ్వదు.``` *6. నారాయణాస్త్రం:*``` ద్రోణాచార్యుడు మోసంతో వధించబడిన తర్వాత, ఆయన కుమారుడు అశ్వత్థామ పాండవ సైన్యంపై ఈ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు వెలువడింది ఒకే ఆయుధం కాదు. ఆకాశమంతా మండుతున్న బాణాలతో నిండిపోయింది. ప్రతి బాణం గుంపుగా కాకుండా, నిర్దిష్టంగా ఒక్కో సైనికుడిని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చింది. అర్జునుడు తన విల్లు ఎక్కుపెట్టాడు. ఆ బాణాల వర్షం తీవ్రత మరింత పెరిగింది. నారాయణాస్త్రం చేసేది అదే. మీరు ఎంత ఎదురిస్తే అది అంత శక్తివంతంగా మారుతుంది. దానిపై తిరిగి పోరాడటం మీరు చేయగలిగే అతిపెద్ద పొరపాటు. కృష్ణుడు రథం దిగాడు. రణభూమిలో ఎవరికీ తలవంచని, అత్యంత బలశాలి అయిన భీముడి దగ్గరికి నడిచాడు. “అందరూ ఆయుధాలు కింద పడేయండి” అని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. యోధులందరూ ఆయుధాలు కింద పడేశారు... ఒక్క భీముడు తప్ప! అతడు ఆ మండుతున్న అగ్నివర్షాన్ని ధిక్కరిస్తూ గర్జించాడు. నారాయణాస్త్రం భీముడి పైనే తన ప్రతాపాన్నంతా చూపించింది. భీముడు పోరాడే కొద్దీ అది అతడిని దహించివేస్తోంది. అప్పుడు కృష్ణుడు స్వయంగా భీముడితో కుస్తీ పడి మరీ, అతడి ఆయుధాలను లాగేసి, రథం మీదినుండి కిందికి లాగాడు. వారంతా ఎప్పుడైతే ఆ అస్త్రానికి లొంగిపోయారో, అప్పుడే ఆ తుఫాను ఆగిపోయింది. ఆ యుద్ధంలో అత్యంత బలశాలి అయిన భీముడిని కృష్ణుడే స్వయంగా నేలమీదికి లాగాడు. భీముడు తన బలం వల్ల బ్రతకలేదు, బలాన్ని వదిలేయడం వల్ల బ్రతికాడు. ఆ అస్త్రానికి ఈ నియమాన్ని ఎవరు పెట్టారో కానీ, వారు యుద్ధం గురించి ఆలోచించలేదు... యుద్ధం కంటే ప్రాచీనమైన, అత్యున్నతమైన తత్వం గురించి ఆలోచించారు.``` *5. బ్రహ్మశిరోనామకాస్త్రం (బ్రహ్మశిరాస్త్రం):*``` పేరు వింటే మనం ఇందాక చూసిన బ్రహ్మాస్త్రం లాగే అనిపిస్తుంది. కానీ ఈ రెండూ ఒకే స్వభావం కలిగినవి కావు. బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుని ఒక ముఖం శక్తిని కలిగి ఉంటే, బ్రహ్మశిరాస్త్రం ఆయన నాలుగు ముఖాల శక్తిని కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రెండు అస్త్రాలు ఆకాశంలో ఢీకొంటే ఏం జరుగుతుందో గ్రంథాలు స్పష్టంగా వర్ణించాయి. 12 ఏళ్ల క్షామం! 12 ఏళ్ల పాటు వర్షాలు పడవు, ఒక్క ప్రాణి బ్రతకదు. భూమి తన పూర్వపు సారవంతమైన స్థితిని చేరుకోవడానికి ఒక తరానికి పైగా సమయం పడుతుంది. రాత్రిపూట జరిగిన ఆ ఘోర మారణకాండ తర్వాత అర్జునుడు అశ్వత్థామను వెంబడించాడు. అశ్వత్థామ నేలమీద ఉన్న ఒక గడ్డిపోచను తీశాడు. అది మామూలు గడ్డిపోచ. కానీ మంత్రాన్ని జపించి వదిలినప్పుడు అది గడ్డిపోచ కాదు, బ్రహ్మశిరాస్త్రం. అదే క్షణంలో అర్జునుడు కూడా తన బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండు అస్త్రాలు గాలిలో దూసుకెళ్తున్నాయి. నారద మహర్షి, వేదవ్యాసుడు ఆ రెండు అస్త్రాల మధ్య ఆకాశంలో భౌతికంగా నిలబడ్డారు. "ప్రాచీన యోధులకు ఎన్నో దివ్యాస్త్రాలు తెలుసు, కానీ ఎన్నడూ ఇలా జరగలేదు. మనుషులపై వీటిని ప్రయోగించకూడదు" అని వారు వారించారు. అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. అతనికి ఆ విద్య తెలుసు. ఆ అస్త్రాన్ని చేతబట్టడానికి ముందే, ఎన్నో ఏళ్ల క్రమశిక్షణతో అతను ఆ నిగ్రహాన్ని సాధించాడు. కానీ అశ్వత్థామ అలా చేయలేకపోయాడు. వ్యాసుడు నిలదీసినప్పుడు, తనకు ప్రయోగించడం మాత్రమే తెలుసునని, ఉపసంహరించుకోవడం నేర్చుకోలేదని అశ్వత్థామ అంగీకరించాడు. మంటను ఎలా అంటించాలో నేర్పారు కానీ, ఆర్పడం ఎలాగో అతనికి తెలియదు. అందుకే ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. పాండవ వంశానికి ఆఖరి వారసుడైన, ఇంకా జన్మించని ఆ శిశువు వైపు మళ్లించాడు. అప్పుడు కృష్ణుడు ఆ మాతృగర్భంలో ప్రవేశించాడు. ఆ బిడ్డ (పరీక్షిత్తు) బ్రతికాడు. తర్వాత కృష్ణుడు అశ్వత్థామ వైపు తిరిగి, అతని తల మీద ఉన్న మణిని తొలగించాడు. ఎప్పటికీ మానని గాయాన్ని ఇచ్చాడు. ఒక్క క్షణం పాటు వచ్చిన కోపానికి 3,000 ఏళ్ల పాటు అంటువ్యాధులతో, అందరిచేతా తరిమివేయబడుతూ, నిర్జన ప్రదేశాలలో ఒంటరిగా తిరిగేలా శపించాడు. అదే క్షణంలో ఉత్తర గర్భంలో ప్రాణాలు విడిచిన బిడ్డకు ప్రాణదానం చేశాడు. శిక్ష, కరుణ రెండూ ఒకే చేతినుండి వెలువడ్డాయి. అశ్వత్థామ ఇంకా ఎక్కడో తిరుగుతూనే ఉన్నాడని, తను వెనక్కి తీసుకోలేకపోయిన ఆ ఒక్క అస్త్రం కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడని ప్రతీతి. అశ్వత్థామ శోకంతో ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ నాల్గవ స్థానంలో ఉన్న అస్త్రాన్ని పొందిన యోధుడు, ఎన్నో రెట్లు శక్తివంతమైన ఆ అస్త్రాన్ని 18 రోజుల భీకర సంగ్రామంలో ఒక్కసారి కూడా ప్రయోగించలేదు.``` *4. పాశుపతాస్త్రం:*``` ఇది పరమశివుని అస్త్రం. అర్జునుడు దీనిని ఎలా పొందాడో చూద్దాం.. హిమాలయాల శిఖరాలపై నెలల తరబడి ఆహారం లేకుండా తపస్సు చేశాడు. ఆ తర్వాత కేవలం నీరు తాగి, ఆపై అదీ మానేసి, చేతులు పైకెత్తి గడ్డకట్టే చలిలో నిలబడ్డాడు. అప్పుడు శివుడు సామాన్య పర్వత వేటగాడి (కిరాతకుడి) రూపంలో వచ్చాడు. పార్వతీదేవి కూడా అదే వేషంలో ఆయన పక్కనే ఉంది. మూకాసురుడనే రాక్షసుడు ఒక అడవి పంది రూపంలో దండెత్తాడు. అర్జునుడు, ఆ వేటగాడు ఇద్దరూ ఒకేసారి బాణాలు వేశారు. పంది నేలకొరిగింది. ఆ వేట ఎవరిది అన్న దానిపై వారి మధ్య వాదన జరిగింది. అర్జునుడు వేటగాడిపై వరుసగా బాణాలు వేశాడు. ఏవీ పనిచేయలేదు. తన అమ్ములపొదిలోని బాణాలు తీయబోయాడు, కానీ ఎన్నడూ ఖాళీ అవ్వని ఆ అమ్ములపొది ఖాళీ అయింది. అప్పుడు ఇద్దరి మధ్య మల్లయుద్ధం జరిగింది. మారువేషంలో ఉన్న శివుడు అర్జునుడిని చిత్తు చేసి, శ్వాస తీసుకోనివ్వకుండా మట్టిలో కలిపాడు. అర్జునుడు ఓడిపోయి నేలమీద పడి ఉన్నప్పుడు, మట్టితో ఒక చిన్న శివలింగాన్ని చేసి, దానిపై అడవి పూల దండ వేశాడు. ఆ దండ మట్టి ప్రతిమ మీది నుండి లేచి నేరుగా వేటగాడి తలమీద చేరింది. శివుడు తన నిజరూపాన్ని దర్శింపజేసి, యోధులలో సాటిలేని వాడిగా అర్జునుడిని ప్రశంసించాడు. ఆపై పాశుపతాస్త్రాన్ని అతని చేతుల్లో పెట్టాడు. పద్నాలుగు భువనాల్లో కేవలం ఒక ఆలోచనతో, ఒక చూపుతో, ఒక మాటతో దీనిని ప్రయోగించవచ్చు. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. కానీ దీనిని ఎన్నటికీ సామాన్య శత్రువుపై ప్రయోగించకూడదు, అలా చేస్తే ఇది మొత్తం విశ్వాన్నే దహించివేస్తుంది. ఇది ఆదినుండి శివుడు పెట్టిన నియమం. 18 రోజుల యుద్ధంలో అర్జునుడు కేవలం సంయమనం మాత్రమే పాటించలేదు. తాను దేన్ని నాశనం చేయవచ్చో, దేన్ని చేయకూడదోనన్న నియమాన్ని గౌరవించాడు. అస్త్రాన్ని ప్రయోగించకుండా ఆగిపోవడం వేరు, ఆ భేదాన్ని తెలుసుకుని నిగ్రహం పాటించడం వేరు.``` *3. సుదర్శన చక్రం:*``` దీని కథ ఒక వాగ్దానంతో మొదలవుతుంది - 100 తప్పులు. కృష్ణుడు ఇచ్చిన వాగ్దానం ఇది. కృష్ణుడి మేనత్త కొడుకు శిశుపాలుడు పుట్టుకతోనే వికృతంగా, అదనపు చేతులు, మూడో కంటితో పుట్టాడు. ఆ శిశువును కృష్ణుడి ఒడిలో పెట్టగానే, ఆ అదనపు అవయవాలు మాయమయ్యాయి, మూడో కన్ను మూసుకుపోయింది. ఇది చూసిన శిశుపాలుడి తల్లి(కృష్ణుని మేనత్త) కృష్ణుడిని కరుణించమని వేడుకుంది. కృష్ణుడు ఆమెకు ఒక సంఖ్య చెప్పాడు - 100. శిశుపాలుడు చేసే 100 తప్పులను క్షమిస్తానని, ఆ తర్వాత జరిగేదానికి శిశుపాలుడే బాధ్యుడని మాట ఇచ్చాడు. రాజసూయ యాగంలో దేశదేశాల రాజులు కొలువై ఉండగా, శిశుపాలుడు నిలబడి కృష్ణుని నిందించడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంశాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, అసలు అక్కడ ఉండేందుకు కృష్ణుడికున్న అర్హతను అవమానించాడు. సభ అంతా మౌనంగా చూస్తోంది. కృష్ణుడు ప్రశాంతంగా కూర్చుని 1, 20, 50, 99 అని లెక్కపెడుతున్నాడు. 101వ తప్పు చేయగానే, కృష్ణుడు తన చిటికెన వేలు పైకెత్తాడు. సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది. అది కేవలం ఒక ఆయుధం కాదు, విశ్వ ధర్మానికి (Cosmic Order) ప్రతీక. విష్ణువు కేవలం దాన్ని ధరించడు, ఆయన తత్వమే ఆ చక్రం. ఒకసారి అది చేతినుండి వెలువడితే అది ఆగదు, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు, దాన్ని అడ్డుకోలేరు. చక్రం దూసుకెళ్లింది. శిశుపాలుడు మాట్లాడుతుండగానే నేలకొరిగాడు. అప్పుడు సభలో ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. శిశుపాలుడి శరీరం నుంచి ఒక తేజస్సు వెలువడి కృష్ణుడిలో లీనమైంది. ఎందుకంటే శిశుపాలుడు మరెవరో కాదు, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడైన జయుడు. శత్రువుగా జన్మించమని శాపం పొందినవాడు. ఆ మరణం ఒక శిక్ష కాదు, అది మోక్షం. ఆ ఆత్మ తిరిగి తన గూటికి చేరింది. ఒక మనిషి ప్రాణాలు విడవడం, ఆపై అతనిలోని తేజస్సు ఆ చక్రాన్ని ప్రయోగించిన భగవంతునిలో లీనమవ్వడాన్ని ఆ సభ అంతా చూసింది. అక్కడ హింస లేదు కచ్చితత్వం ఉంది. 99 సార్లు ఎదురు తిరిగే అవకాశం ఉన్నా మౌనంగా భరించిన ఒక అత్యున్నతమైన నిశ్శబ్దం అక్కడ ఉంది.``` *2. త్రిశూలం:*``` మొదటగా దీని గురించి తెలుసుకోవాల్సిన నిజం ఒకటుంది. సుదర్శన చక్రం, త్రిశూలం ఎన్నడూ ఒకదానికొకటి ఎదురుపడలేదు. ఏ గ్రంథంలోనూ, ఏ కథలోనూ అలా జరగలేదు. విష్ణువు, శివుడు చెరో పక్షాన నిలబడి యుద్ధం చేసిన దాఖలాలు ఉన్నా, ఈ రెండు అస్త్రాలు మాత్రం ఎన్నడూ ఒకదానిపైకి మరొకటి ఎక్కుపెట్టబడలేదు. ఎందుకంటే కొన్ని ఘర్షణలకు ముగింపు ఉండదు. ఈ కథలను భద్రపరిచిన వారికి కూడా తెలుసు... కొన్ని విషయాలు ఊహలకు సైతం అందనివని! త్రిశూలానికి ఉన్న మూడు మొనలు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలు. ఈ విశ్వం నడిచేది ఈ మూడు శక్తుల మీదే. అవి కేవలం అలంకారానికి ఉన్నవి కావు. ఆకాశంలో తేలియాడే రాక్షసుల నగరాలను (త్రిపురాలను) శివుడు సంహరించినప్పుడు, ఈ మొత్తం విశ్వం ఆ యుద్ధంలో పాలుపంచుకుంది. అందులో ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, మరొకటి ఇనుముతో చేయబడినవి. భూమి రథంగా, మేరు పర్వతం ఇరుసుగా, సూర్యచంద్రులు చక్రాలుగా, సాక్షాత్తూ బ్రహ్మదేవుడు సారథిగా మారారు. వాసుకి విల్లుగా, శ్రీమహావిష్ణువు బాణంగా, అగ్నిదేవుడు బాణం మొనగా మారారు. అయితే ఇతర పురాణాల్లో లేని ఒక నిజాన్ని లింగ పురాణం చెబుతోంది. ఆ బాణం విల్లునుండి వెలువడక ముందే, శివుడు కేవలం తన కంటి చూపుతోనే ఆ మూడు నగరాలను భస్మం చేశాడు_*. *_ఆయన ఒక్క చూపు చాలు. సృష్టిలో ఉన్న దేవతలందరి శక్తులతో తయారైన ఆ బాణం కేవలం ఒక ఉత్సవ విగ్రహం లాంటిదైంది. ఈ విశ్వమంతా ఏకమై ఆ ఆయుధాన్ని తయారుచేస్తే, పరమశివుడికి దాని అవసరమే రాలేదు._*``` *1. బ్రహ్మదండం:* *_మొదటి స్థానంలో విశ్వాన్ని నాశనం చేసే ఏదో మహా అస్త్రం ఉంటుందని మీరు ఊహించి ఉంటారు. కానీ మన ప్రాచీన గ్రంథాలు అత్యున్నతమైనదిగా పరిగణించింది నాశనం చేసే అస్త్రాన్ని కాదు... నాశనం అనే ప్రక్రియనే నిష్ప్రయోజనంగా మార్చే ఒక దివ్యమైన శక్తిని. వాల్మీకి రామాయణంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని జీవితాంతం తపించిన ఒక రాజు. పదుల కొద్దీ ఏళ్లు కఠోరమైన తపస్సు, ఉపవాసాలు, ఎండ, చలి, మౌనం ఆచరించి మరీ ఎన్నో అస్త్రాలను సంపాదించాడు. అందులో బ్రహ్మాస్త్రం కూడా ఉంది. తనను ఎవరూ ఆపలేరన్నంత శక్తిని కూడబెట్టుకున్నానని నమ్మాడు. తాను సంపాదించిన అస్త్రాలన్నింటినీ ఒక్కొక్కటిగా వశిష్ఠుడిపై ప్రయోగిస్తున్నాడు_*. *_వశిష్ఠుడు కేవలం తన చేతిలో ఉన్న దండాన్ని (బ్రహ్మదండాన్ని) పైకెత్తాడు. అది కేవలం ఒక సాధారణ కర్ర. అస్త్రాలను కూడబెట్టుకోవడం కంటే, తనను తాను ఉన్నతంగా మలుచుకోవడానికి జీవితాన్ని వెచ్చించిన ఒక మహర్షి చేతిలోని దండం అది. ఆ బ్రహ్మదండం ప్రతి అస్త్రాన్ని ప్రశాంతంగా, పూర్తిగా తనలో ఇముడ్చుకుంది. అది అస్త్రాలను అడ్డుకోలేదు, వాటిపై ప్రతిదాడి చేయలేదు. అవి ఏమాత్రం ఉనికిలో లేవన్నట్లుగా వాటిని మింగేసింది. విశ్వామిత్రుడు చేతిలో ఏమీ లేకుండా నిలబడిపోయాడు. యోధుడి బలం దేనికీ పనికిరాదని, ఒకే ఒక దండం ముందు తన క్షత్రియ బలం శూన్యమని అతనికి అర్థమైంది. అతడు కూడబెట్టుకున్నదంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయింది_*. *_అప్పుడు అతడు వెనుదిరిగాడు. ఆయుధాలను శాశ్వతంగా వదిలేశాడు. తన రాజ్యాన్ని, తన కిరీటాన్ని, తన అహంకారాన్ని వదిలేసి, వశిష్ఠుడు అప్పటికే చేరుకున్న ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి తన శేష జీవితాన్ని తపస్సుకు ధారపోశాడు. ఆ దండం అతన్ని కేవలం ఓడించలేదు... అతని జీవిత పరమార్థాన్నే మార్చేసింది._* *_ఈ జాబితాలో ఉన్న ప్రతి అస్త్రానికీ కొన్ని నియమాలున్నాయి. కర్ణుడు దాచుకున్న ఏకైక అస్త్రాన్ని రాత్రి సమయంలో ప్రయోగించాడు. అశ్వత్థామ వెనక్కి తీసుకోలేని అస్త్రాన్ని ప్రయోగించి 3000 ఏళ్లుగా ఒంటరిగా నడుస్తున్నాడు. అర్జునుడు అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని 18 రోజుల పాటు తన వద్దే ఉంచుకున్నా, దాని నియమాలను గౌరవించి యుద్ధం గెలిచాడు. మన పురాణాలు కేవలం అస్త్రాలను మాత్రమే కాదు, వాటి నియమాలను, పరిణామాలను, ఆ నియమాలను అతిక్రమించిన వారి పేర్లను, వారు అనుభవించిన శిక్షలను భద్రపరిచాయి._* *_ఎందుకంటే ఆయుధాలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ వాటి చుట్టూ ఉన్న జ్ఞానం సజీవంగా ఉంటే అది ఎప్పటికీ చెరిగిపోదు_*. *_కడుపులో ఉన్న బిడ్డ,_* *_వెనక్కి తీసుకోలేని అస్త్రం,_* *_దానికి అడ్డుగా నిలబడిన కృష్ణుడు..._* *_ఇవన్నీ మనకు ఒకటే చెబుతున్నాయి_*. *_శక్తిని సాధించడం కష్టం కాదు..._* *_ఆ శక్తి ఉన్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిగ్రహంగా ఉండాలో తెలుసుకోవడమే అత్యంత కష్టం_* #మన సంప్రదాయాలు సమాచారం