Follow
Ravi Talluri
@91775
70,381
Posts
33,270
Followers
Ravi Talluri
311 views
2 hours ago
*_ఋషి మహిమ ....!!_* *_వేదకాలం నాటి మహర్షులు , మునులు , యోగులు సమాజ శ్రేయస్సుకోసం పాటుపడేవారు_*. *_ముక్తి సాధనకోసం  జీవితకాలం_* *_వెచ్చించి చేసిన  తపస్సును దేశ సౌభాగ్యం కోసం వినియోగించేవారు_*. *_యజ్ఞయాగాదుల వలన లోకానికి ఎంతో మేలు కలుగుతుంది_*. *_ఋషులు తాము యజ్ఞయాగాలు చేయడమేకాక ఉత్తములైన చక్రవర్తుల చేత కూడా చేయించేవారు ._* *_ఇందువలన అందరి అభిష్టాలు నెరవేరి లోక కల్యాణం జరిగేది._* *_పురాణ కాలంలో అటువంటి_* *_మహర్షులెందరో కనిపిస్తారు._* *_అలాటి మహనీయులలో  కపిల మహర్షి  ఒకరు._* *_తన జీవితంలో చేయ వలసిన_* *_సత్కార్యములన్నింటిని  సంపూర్ణంగా_* *_ముగించి ,_* *_నిరాటంకంగా తపస్సు_* *_చేసుకునేందుకు పాతాళలోకానికి_* *_వెళ్ళాడు_*.   *_తనకు తపోభంగం కలిగించిన వారెంతటివారైనా వెంటనే భస్మమైపోయేంతటి తపశ్శక్తి గల మహర్షి కపిలుడు._* *_ఈ సమయంలో ,_* *_భూలోకంలో సగర చక్రవర్తి_* *_అశ్వమేధ యాగం  చేయ సంకల్పించాడు_*. *_ఆకాలంలలో, వారి అభీష్టాలు_* *_నెరవేర్చుకునేందుకు ,తమ ప్రజల_* *_యోగక్షేమాలకోసం యాగాలను చేసేవారు._* *_శ్రీ కృష్ణుడు కూడా_* *_భగవద్గీతలో యాగ మహిమను_* *_వివరించాడు._* *_ఈ ప్రపంచంలో సకల_* *_జీవరాశులను   మానవులను సృష్టించి,  యజ్ఞ యాగముల_* *_ద్వారా మీ మీ అభీష్టాలు నెరవేర్చుకొనమని ఆదేశించాడు_*. *_యాగాలు చేస్తే వానలు_* *_పడతాయి. వర్షాలు పడితే_* *_పంటలు, చెట్లు సమృధ్ధిగా_* *_పెరిగి మంచి ఫలసాయం_* *_లభిస్తుంది_*. *_మానవులకి_* *_కరువు కాటకాల బాధతప్పి సుభిక్షంగా వుంటారు._* *_మంచి ఆలోచనలతో సత్కర్మలు  జరుగుతాయి_*. *_మానవజీవితాలను సుఖవంతం_* *_చేసుకునే మార్గాలు లభిస్తాయి_*. *_వారి వారి జీవితాలను_* *_సఫలం చేసుకునే అవకాశాలు_* *_లభిస్తాయి_,* *_అదేవిధంగా_* *_అభీష్టసిధ్ధి_, _లభిస్తుంది._* *_మహారాజులు , చక్రవర్తులు  యాగాలు_* *_చేయడానికి ముందు_* *_యాగాశ్వానికి పూజాపునస్కారాలు చేసి ఆ అశ్వాన్ని వదులుతారు._* *_దేశం అంతా తిరిగే ఆ అశ్వాన్ని  ఏ రాజైనా పట్టి బంధిస్తే  ఆ రాజుతో యుధ్ధం చేసి జయించాలి._*  *_అలాగ ఆ యాగాశ్వం దేశలన్ని తిరిగి వచ్చాక_* *_ఆ రాజు యాగం చేయడానికి_* *_మొదలెట్టాలి_,.* *_ఇటువంటి_* *_ఆచారాలు_*, *_నిబంధనలుతప్పక పాటించాలి._* *_రాజులందరిని జయించిన_* *_వారి కి మాత్రమే యాగం చేయడానికి హక్కు వుండేది_*. *_ఆవిధంగా_* *_సగరమహారాజు_* *_పంపిన అశ్వం_* *_అదృశ్యమయింది_*. *_వెంటనే సగరుని పుత్రులు_* *_అంతా ఆ అశ్వాన్ని వెతుకుతూ వెళ్ళేరు_*.  *_భూలోకంలో_* *_ఎక్కడా అశ్వం_* *_కనిపించలేదు_*. *_అప్పుడు ఎవరో  చెప్పగా విని_* *_సగర కుమారులు పాతాళ లోకానికి వెళ్ళేరు_*. *_అక్కడ ఒక గుహలో అశ్వం కట్టబడి వుండడం చూశారు._* *_వారు చూసిన గుహ_* *_కపిల మహర్షి  తపస్సు చేస్తూవున్న గుహ_*. *_అక్కడ అశ్వాన్ని కట్టి_* *_వెళ్ళినది స్వర్గాధిపతి_* *_దేవేంద్రుడు._* *_ఎందుకంటే,_* *_సగరమహారాజు యాగం_* *_పూర్తి చేస్తే తన_* *_ఇంద్ర పదవికి భంగం_* *_కలిగిస్తాడనే భయం_,.* *_కాని సగర పుత్రులు తమ_* *_అశ్వాన్ని బంధించినది_* *_కపిల మహర్షి అని తలచి మహర్షికి_* *_తపోభంగం_* *_కలిగించారు_*. *_ఆయన కళ్ళు_* *_ఆగ్రహంతో_* *_తెరవగానే సగర_* *_చక్రవర్తి పుత్రులు ఆరు వేల మంది_* *_భస్మమైపోయారు_*. *_వీరందరికి సద్గతులు_* *_లభించాలంటే_* *_గంగా తీర్ధంతో_* *_తర్పణాలు వదలాలి_*. *_సగర వంశస్తులందరూ  గంగా జలాన్ని_* *_తీసుకురావడానికి ఎంతో_* *_ప్రయత్నించారు కాని ఫలించలేదు_*. *_చివరకు వారి వంశంలోనివాడైన_* *_భగీరధుడు మాత్రము_* *_తన పూర్వీకులకు సధ్గతులు కలిగించాలని, దీక్ష పూనాడు._, *_ఆకాశ గంగని భూలోకానికి_* *_తీసుకురావడానికి ఘోర తపస్సు చేశాడు_*. *_భగీరధుని తపస్సుకు మెచ్చిన_* *_ఆకాశగంగాదేవి , " నీ తపస్సుకు మెచ్చి_*,  *_ఆకాశంనుండి  దిగి వస్తాను. కానీ , నా_* ,*_ఉధృత ప్రవాహ_* *_మార్గాన్ని నువ్వే సక్రమంగా కట్టడి_* *_చేసుకోవాలి." అని ఆదేశించింది._* *_భగీరధుని, పట్టుదల దీక్షలకు మెచ్చిన_*  *_మహాదేవుడు_* *_ఆకాశ గంగ ఆవేశాన్ని_* *_అణచడానికి_* *_పరమశివుడు గంగను_* *_తన  ఝటా ఝూటంలో పూర్తిగా బంధించాడు_*. *_దీనివలన తన_* *_ప్రయత్నం ఫలించక భగీరధుడు తీవ్ర వేదనతో మరల_* *_పరమేశ్వరుని ప్రార్ధించి,_* *_"స్వామీ  ఒక సత్కార్యం కోసం గంగాదేవిని తీసుకుని వెళ్ళడానికి  నేను తపస్సు చేశాను._*  *_కానీ ఆ  గంగను_* *_మీ జడలలో బంధించారు."_* *_అని తిరిగి తపమాచరించాడు_*. *_భగీరధుని యందు దయతో_* *_పరమేశ్వరుడు_* *_గంగను కొంచెం గా విడిచి పెట్టాడు._* *_అలా కొంచెంగా_* *_విడవబడిన గంగ_* *_దివినుండి భూమికి దిగి పలు ఇంతలై భూమి మీద_* *_శరవేగంతో ప్రవహించ సాగింది. ఆ క్రమంలో గంగ_* *_జహ్ను మహర్షి_* *_ఆశ్రమాన్ని  ముంచేసి_* *_ముందుకు సాగగా_* *_జహ్ను మహర్షి, ' లోక క్షేమానికై  నేను యాగం చేద్దామని  నిర్మించుకున్న_* *_యాగ శాలని ముంచి_* *_ప్రవహిస్తోందని , కోపోద్రిక్తుడై గంగను ఔపాసనపట్టి పూర్తిగా త్రాగివేశాడు._* *దీనిని చూసిన భగీరధుడు* *తను ఎంతో కష్ట పడి* *తీసుకుని వచ్చిన గంగని* *జహ్ను మహర్షి  ఇలా త్రాగేశాడు*. *గంగను పాతాళం వరకూ తీసుకుని* *వెడితే కదా !  మా  పూర్వీకుల కు* *సద్గతులు  కలుగుతాయి*. *_అడుగడుగునా_* *_నా ప్రయత్నాలు_* *_విఫలమౌతున్నాయే అని వేదన_* *_చెందాడు._* *_జహ్ను మహర్షి వద్దకు వెళ్ళి,  మనవి చేసుకున్నాడు._* *గంగను_* ,*_వదలి తన_* *_పూర్వీకులకు_* *_సద్గతులు_* *_కలిగించమని._* *_ప్రార్ధించాడు._* *_భగీరధుని లక్ష్యం ఉన్నతమైనదని_* *_తలచిన జహ్ను మహర్షి_* *_అతని  మనవి ఆలకించి_* *_తన చెవి ద్వారా కొంచెం_* *_గంగని బయటికి వదిలాడు._* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
375 views
3 hours ago
*_సంపూర్ణ మహాభారతము_* *_270 వ రోజు_* *_భీష్మ పర్వము తృతీయాశ్వాసము:_* *_భీష్ముడు తనను పడొగొట్టే మార్గము చెప్పుట_* *_భీష్ముడు "ధర్మనందనా! నేను యుద్ధ భూమిలో ఉన్నంత కాలం మీకు రాజ్యప్రాప్తి కలుగదు. నన్ను నిర్జిస్తేగాని మీకు రాజ్యప్రాప్తి కలుగదు" అన్నాడు._* *_ధర్మరాజు "పితామహా! రణభూమిలో మీరు త్రిశూలం ధరించిన రుద్రునిలా నిలబడినంత కాలం మిమ్ము గెలుచు వీరుడెవ్వడు. కనుక మిమ్ము గెలుచు ఉపాయము మాకు చెప్పవా" అన్నాడు_*. *_“ధర్మనందనా! నీవు చెప్పింది యధార్ధం నా చేత ఆయుధం ఉండగా నన్ను గెలుచుట అసాధ్యం. నా శక్తి తెలుసుకుని నన్ను గెల్చు ఉపాయం తెలుసుకొన వచ్చారు. మీకు సహాయం చేయుట కంటే సుకృతం ఏముంది. నేను ఆయుధం విసర్జించిన నన్ను గెలువ వచ్చు. నేను కవచం తీసిన వాడిని, ఆయుధం ధరింపని వాడిని, కేతనమును దించిన వాడిని, స్త్రీలను, స్త్రీగా ఉండి పురుషునిగా మారిన వాడిని, తలపాగా తీసిన వాడిని, అన్నదమ్ములు లేని వాడిని, పుత్రులు లేని వారు ఎదురైన వారితో యుద్ధం చేయను. వెంటనే నా ఆయుధములను విడిచి పెడతాను. పుట్టుకతో పురుషుడు కాక దైవత్వంతో పురుషుడైన వాడితో నేను యుద్ధం చేయను. ద్రుపద కుమారుడు శిఖండి పుట్టుకతో స్త్రీ అయి దైవీకంగా పురుషత్వం పొందాడు. శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేసిన నేను ఆయుధము విసర్జిస్తాను. అప్పుడు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని నన్ను సంహరించవచ్చు. తరువాత బంధు మిత్ర సహితంగా సుయోధనుని గెలుచుట సులభం” అన్నాడు._* *_వచ్చిన కార్యం సఫలమైంది అనుకుని ధర్మనందనుడు తమ్ములతో తమ శిబిరానికి మరిలాడు. దారిలో "తన మరణమునకు తానే దారి చెప్పిన భీష్ముని తలచుకుని విషాదం నిండిన హృదయముతో అర్జునుడు "కృష్ణా! భీష్ముడు లోక మాన్యుడు, దయాళువు, వయోవృద్ధుడు అలాంటి మహానుభావుని చంపడానికి నాకు మనస్కరించుట లేదు. మట్టిలో ఆడుకుని వచ్చిన నన్ను ఎత్తుకుని ముద్దాడి చిన్నతనంలోనే గతించిన నా తండ్రిని తలచుకుని ఆయన కంట తడి పెట్టుకునే వాడు. తండ్రిని కోల్పోయిన మమ్ము చేరదీసి అల్లారు ముద్దుగా పెంచిన తాతాగారిని నేను ఎలా చంపగలను. పితామహుడు పరాక్రమంతో సైన్యాలను అంతమొందించినా ఉపేక్షిస్తానుకాని చంపను ధర్మనందనుని తమ్ములు అంత కృూరులు కాదు కదా" అన్నాడు_*. *_ఆ పలుకులు విని కృష్ణుడు.. “అర్జునా! నీకు క్షత్రియ ధర్మం తెలియదా! క్షత్రియులు కొంచెం క్రూరత్వం అవలంబించి కలత చెందక శత్రు సంహారం చేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజలు కట్టు పన్నుతో ప్రజాశ్రేయస్సు కొరకు పాటు పడాలి. రాజధర్మం ఇదేనని బృహస్పతి ఇంద్రునకు చెప్పాడు. నీవు భీష్ముని చంపుతానని ప్రతిన చేసావు. ఆ మాట తప్పుట న్యాయమా! లోకులు నిన్ను చూసి నవ్వరా. ఇది రాజ ధర్మమే కాని క్రూరకర్మము కాదు. ఖేదము వదిలి భీష్ముని చంప ప్రయత్నించు" అన్నాడు_*. *_“అది సరే కృష్ణా! భీష్ముని చంపడానికి శిఖండి పుట్టాడు అంటారు కదా! శిఖండిని చూసిన పితామహుడు యుద్ధం చేయడు కదా! నేను వేరొకరిని చంపుతాను. శిఖండి భీష్ముని చంపుతాడు" అన్నాడు_*. *_“అర్జునా! ఇక మాటలేల భీష్ముని మరణం నీ చేతిలో ఉంది. నీ వెంత కాదన్నా విధి లిఖితం మార్చుట అసాధ్యము. ఇతర మాటలతో కాలయాపన చేయక భీష్ముని వధించు" అన్నాడు._* *_అర్జునుడు "రేపటి యుద్ధం ఎలా జరగాలో అలా జరుగుతుంది మీరు చెప్పినట్లే చేస్తాను" అన్నాడు_*. *_అందరూ తమ శిబిరాలకు వెళ్ళారు. అది విన్న దృతరాష్ట్రుడు “సంజయా! పాండు సుతులు ఎలా శిఖండిని ముందు పెట్టుకుని భీష్మునితో యుద్ధం చేసారు నాకు వివరించు " అన్నాడు_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
530 views
3 hours ago
*_సుందరకాండ-హనుమ_* *_36 వ భాగం_* *నమోస్తు రామాయ సలక్ష్మణాయ* *దేవ్యైచ తస్యై జనకాత్మజాయై* *నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో* *నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః* ⁠ *_స్వామి హనుమ రుద్రాంశ కలిగినవారు. రావణుని కలిసి రాముని ప్రతాపము తెలియజేసి సీతను అప్పగించవలసినదిగా తెలియజేయాలని సంకల్పించారు.⁠_* *అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః|* *రాజా జయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||* *దాసోsహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః|* *హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః||* *న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|* *శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||* *అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|* *సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్|*⁠ *_అస్త్రవిద్యలో విదుడైన రామునికి జయము. మహాబలుడైన లక్ష్మణునికి కూడా జయము. రాఘవునిచే పాలింపబడు సుగ్రీవునకు జయము. శత్రుసైన్యములను హతమార్చు హనుమంతుడను నేను క్లిష్టకార్యములను సాధించగల కోసలేంద్రుడైన రామునికి దాసుడను. వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ ఉన్న నాకు యుద్ధములో వేయిమంది రావణులు కూడా నాకు సమానులు కారు. రాక్షసులు అందరూ చూస్తూ ఉండగా లంకాపురిని ధ్వంసము చేసి మైథిలి కి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'._* *_ఈ విధముగా పలికిన హనుమను చూసిన రాక్షసులు భయకంపితులై రావణుని వద్దకు పరుగులు పెట్టి తాము చూసిన హనుమను రావణునికి తెలియజేసిరి_*. *_రావణాసురుడు తమ సైన్యములో బలవంతులైన రాక్షసులను హనుమను పట్టి తీసుకురమ్మని ఆనతిచ్చెను_*. *_స్వామి హనుమ ఉగ్రరూపము దాల్చి అశోకవనమున శింశుపా వృక్షమును తప్ప మిగిలిన వనమును ప్రాసాదములను ధ్వంసము చేయసాగెను_*. *_అప్పుడు అగ్ని ఉద్భవించెను. ప్రాసాదము దగ్ధము అయ్యెను. అప్పుడు మండుచున్న ఆ ప్రాసాదము చూస్తూ ఇంద్రుడు వజ్రాయుధముతో అసురులను హతమార్చిన విధి రాక్షసులను హతమార్చి , హనుమంతుడు అంతరిక్షములో నుండి ఈ వచనములను పలికెను_*. *_మహాత్ముడు బలవంతుడు అయిన సుగ్రీవుని వశములో వున్న నాలాంటి వానరేంద్రులు వేలకొలదీ పంపబడిరి. మేము అనేకమంది భూమండలము అంతా సంచరిస్తున్నామ "కొందరు పది ఏనుగుల బలము కలవారు. కొందరు దానికి పదిరెట్ల బలము కలవారున్నారు. కొందరు వేయి ఏనుగుల బలము కలవారున్నారు. కొందరు వరద ప్రావాహపు బలము కలవారు. కొందరు వాయుబలము కలవారు. మరి ఇంకొందరు అప్రమేయమైన బలము కలవారు'. ఈలాంటి అనేకమంది యోధులతో దంతములు నఖములు ఆయుధములు గా గల వందవేలకోట్ల వానరులతో కలిసి అందరినీ అంతమొనర్చగల సుగ్రీవుడు ఇక్కడికి వచ్చును, 'ఈ లంకాపురి వుండదు. మీరు ఉండరు. రావణుడు ఉండడు. ఎందుకు అనగా మహాత్ముడగు ఇక్ష్వాకు నాధునితో బద్ద వైరము చేసికొనినందువలన'_* *_ఈ విధముగా స్వామి హనుమ తమ పరాక్రమమును ప్రదర్శిస్తూ లంకా వాసులకు రావణునికి హెచ్చరికలు పంపెను.⁠_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
430 views
3 hours ago
*_నల్లరాయి విగ్రహం - ఏ రాయి ఇది_* *_స్వామి విగ్రహం నల్లగా ఉంది కదా. అది ఏ రాయి?_* *1. రాయి పేరు*: *_శాస్త్రీయంగా "ఫెల్స్పార్ + క్వార్ట్జ్ + బయోటైట్" మిక్స్ ఉన్న మెటామార్ఫిక్ రాక్. జనరల్‌గా "నల్లశిల" లేదా "గ్రానైట్ రకం" అంటారు. కానీ ఎగ్జాక్ట్ రాయి ఏంటో 1000 ఏళ్లుగా ఎవరికీ క్లియర్‌గా తెలియదు._* *2. ఎక్కడిది*: *_కొండ మీదే దొరికింది అంటారు. పుట్టలో స్వయంభువుగా వెలిశాడు కాబట్టి కొండ రాయే విగ్రహం అయ్యింది. ఎక్కడి నుంచో తెచ్చి చెక్కలేదు_*. *3. విశేషం*: *_ఈ రాయికి నీళ్లు పడితే మెరుపు వస్తుంది. చీకట్లో కూడా కాంతి వస్తుంది. అందుకే "ఆణిముత్యాల కాంతి" అంటారు. సాధారణ గ్రానైట్‌కు ఉండని గుణం ఇది_*. *4. తాకరు ఎందుకు*: *_రాయి రకం తెలియాలంటే కొంచెం స్క్రాప్ తీసి ల్యాబ్‌కు పంపాలి కదా. మూలమూర్తిని గోరుతో కూడా గీరకూడదు కాబట్టి టెస్ట్ చేయలేదు. అర్చకులు మాత్రం "స్వామి దేహం వజ్రకాయం" అంటారు._* ------= *_వెంకటేశ్వరుడు vs బాలాజీ vs శ్రీనివాసుడు పేర్ల తేడా_* *_ఒకే స్వామికి 3 పేర్లు ఎందుకు?_* *1. శ్రీనివాసుడు*: *_ఒరిజినల్ పేరు. "శ్రీ" = లక్ష్మీదేవి, "నివాసుడు" = నివసించేవాడు. లక్ష్మీదేవి ఎప్పుడూ గుండె మీద ఉంటుంది కాబట్టి శ్రీనివాసుడు. శాసనాల్లో ఈ పేరే ఎక్కువ._* *2. వెంకటేశ్వరుడు*: *_"వేంకట" = శేషాచల కొండ పేరు, "ఈశ్వరుడు" = ప్రభువు. కొండకు ప్రభువు కాబట్టి వెంకటేశ్వరుడు. అన్నమయ్య, అళ్వారులు ఈ పేరే ఎక్కువ వాడారు. అఫీషియల్ పేరు ఇదే._* *3. బాలాజీ*: *_ముంబై వైపు, మహారాష్ట్ర భక్తులు పెట్టిన పేరు. "బాలా" = చిన్నవాడు/పిల్లవాడు, "జీ" = గౌరవం. చిన్నపిల్లాడిలా భక్తుల కోరికలు తీరుస్తాడు కాబట్టి బాలాజీ. ఉత్తరాదిలో ఈ పేరే ఫేమస్._* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
357 views
3 hours ago
*_శ్రీమహావిష్ణుపురాణం_* *_132 వ భాగం_* *_కల్కి అవతారం_ -* *_కుథోధరి రాక్షసి సంహారం.._* *_చక్రతీర్థంలో కల్కి మూర్తి స్నాన సంధ్యాది అనుష్టానాలు చేస్తుండగా అరవైవేల సంఖ్యలో ఉన్న సూక్ష్మ రూపులైన వాలిఖ్యాది మునులు కల్కి దర్శనానికి వస్తారు._* *_కల్కివిచారవదనాలలో ఉన్న వాలిఖ్య మునులు చూసి అందుకు కారణం అడుగుతాడు_*. *_వాలిఖ్యులు నమస్కరించి "కల్కిమూర్తీ కుంభకర్ణుని మనవరాలు, కుమార్తె పుత్రిక అయిన కుథోధరి అనే భయంకరమైన రాక్షసి ఉంది. కాలకుంజుడనే రాక్షసుడి భార్య అయిన కుథోధరి విశాలమైన, భీకరమైన ఆకారం కలిగి ఉంటుంది. ఆమె ఆకారం పొడవు ఆకాశం వరకు వ్యాపించి అంతరిక్షంలో సగం ఉంటుంది. ఆ రాక్షసి హిమాలయాన తల పెట్టుకుని కాళ్ళను నిషాధాద్రి వరకు చాపి పడుకుని ఉంటుంది. ఆమెకు ఐదు ఏళ్ల వికుంజుడు అనే కుమారుడు ఉన్నాడు. వికుంజుడు త్రాగగా వదిలిన తల్లి పాలు కారుతూ ఒక నదిలా ప్రవహిస్తుంటాయి. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు చుట్టు పక్కల నివసించే ప్రజలు, జంతువులు గాలిలో ఎగిరి ఆ నదిలో కొట్టుకు పోతుంటారు. సూక్ష్మరూపులమైన మేము ఆ విధంగాఎగిరి నదిలో పడి ఇక్కడకు కొట్టుకుని వచ్చాము. రోజు ఆ రాక్షసి వలన కొట్టుకుని దూరంగా వెళ్లడం, తిరిగి వెనక్కు వెళ్లడం జరుగుతోంది. మేము తపస్సులు చేయలేక పోతున్నాము. శ్రీహరి అవతారమైన మీరు ఆ రాక్షసిని సంహరించి మమ్మల్ని రక్షించాలి" అని ప్రార్ధిస్తారు_*. *_కల్కి అంగీకరించి తన సైన్యంతో వాలిఖ్య మునుల వెంట ఆరాక్షసి ఉండే ప్రదేశానికి వెళతాడు. రాక్షసిపాలతో ఏర్పడిన క్షీరనదిని చూశాడు. నది వెంట వెళ్ళి ఆ రాక్షసి నివసించే ప్రదేశానికి వెళతాడు_*. *_నిద్రపోతున్న ఆ భీకర భారీ భయంకర రాక్షసిని చూసి ఆశ్చర్యం చెందుతాడు. ఈ రాక్షసిని ఎలాసంహరించాలి అని ఆలోచిస్తుండగా, కుథోధరిరాక్షసి అశ్వాల,గజాల,మనుషుల వాసనకు నిద్రలేస్తుంది. ఆకలితో కనపడ్డ కల్కిమూర్తితో సహా వారందరిని నోరు తెరిచి గుటుక్కున మ్రింగివేస్తుంది_*. *_రాక్షసి కడుపులో చేరిన కల్కి మూర్తి ఆలోచించి తనఆకారాన్ని పెంచడం ప్రారంభిస్తాడు._* *_కల్కిఆకారం పెరిగిపెరిగి రాక్షసి కడుపును చీల్చివేస్తుంది. రాక్షసి మరణిస్తుంది_*. *_కల్కిమూర్తి,పరివారం, చతురంగ బల సైన్యం ఉదరం నుంచి బయటకు వస్తుంది._* *_దేవతలు ఆకాశం నుంచి చూసి ఆనందించి పుష్పవర్షం కురిపిస్తారు._* *_వాలిఖ్య మునులు కల్కిని స్తుతిస్తారు_*. *_కుథోధరి మరణానికి భర్త కాలకుంజుడు, కుమారుడు వికుంజుడు రాక్షస సైన్యంతో కల్కి పై దాడికి వస్తారు. కల్కి ఖడ్గంతో విజృంభించి కాల కుంజుని, అతనిరాక్షస సైన్యాన్ని సంహరిస్తాడు. బాలుడైన కుథోధరి పుత్రుని దయతో వదిలేస్తాడు. కానీ ఆ బాలుడు కొంతమంది రాక్షసులతో తిరిగి వచ్చి కల్కిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కల్కి తన ఖడ్గాన్ని ప్రయోగించి స్వయంగా చంపకుండా, పరశురాముడు బోధించిన బ్రహ్మాస్త్రాన్ని మంత్రంతో ఆ బాలుని పై ప్రయోగించి చంపుతాడు_*. *_హిమాలయాలు రాక్షసుల నుండి విముక్తి పొందడంతో అక్కడ నివసించే మునులు వచ్చి కల్కికి కృతజ్ఞతలు తెలుపుతారు._* *_కల్కి మూర్తి హరిద్వారం వచ్చి గంగాస్నానం చేస్తాడు. గంగ స్త్రీ రూపంలో ప్రత్యక్షంగా వచ్చి పుండరీక వనంలో కల్కికి సేవలు చేస్తూ అర్చిస్తుంది._* *_నారాయణుని అవతారమైన కల్కి పుండరీక వనంలో ఉన్నారని తెలిసి చుట్టుపక్కల ఆశ్రమాల నుంచి మునులు, ప్రజలు వచ్చి దర్శించి పూజలు, స్తుతులు చేస్తుంటారు_*. *_మరుత్తుడు దేవాపి వచ్చి కల్కిని సేవిస్తుండగా వారి వంశ చరిత్ర తెలుసుకుని ఆనందిస్తాడు. మరుత్తుని అయోధ్యకు, దేవాపిని హస్తినాపురానికి రాజులుగా పట్టాభిషేకం చేస్తాడు. విశాఖయూపుని కుమార్తెను మరుత్తునికి, రుచిలశ్వుని కుమార్తెను దేవాపికి ఇచ్చి వివాహం చేస్తాడు_*. *_తరువాత ఆకాశం వంక చూసి కల్కి సంకల్పించగా రెండు దివ్య విమానాలువస్తాయి._* *_మరుత్తుని, దేవాపిని ఆ విమానాలు ఎక్కి దుష్ట సంహారం చేసి కలి పురుషుని ప్రభావం అంతం చేయమని చెబుతూ "మరుత్తదేవాపిలారా! ఈ విమానాలు కామగమనం కలవి. ముల్లోకాలు మూడు నిమిషాలలో తిరిగి రాగలవు. ఈ విమానాలలో అనేక దివ్య ఆయుధాలు ఉన్నాయి. మీ దుష్ట సంహారానికి ఉపయోగ పడతాయి" అని ఇవ్వగా మరుత్త దేవాపిలు స్వీకరిస్తారు. కల్కి మూర్తికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని మరుత్త దేవాపిలు విమానాలపై దుష్ట సంహారానికి బయలుదేరి వెళతారు_*. *_కొంతకాలానికి కల్కి మూర్తి సభ జరపుతుండగా సభకు ఒకయతి పురుషుడు వస్తాడు_*. *_అతని దివ్య తేజస్సుకు కల్కిస్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉచితాసనుని చేసి రాకకు గల కారణం అడుగుతాడు_*. *_ఆయతి పురుషుడు కల్కికినమస్కరించి "ప్రభూనారాయణునిఅవతారమైన మీరు దుష్ట శిక్షణ చేసి భూభారం తగ్గించారు.వర్ణాశ్రమ ధర్మాలు,వేదవిధులు,యజ్ఞయాగాదులు రాజులు, ప్రజలు పాటించేలా, చేసేలా చేశారు_*. *_ఫలితంగా కలి ప్రభావం అంతరించి కలిపురుషుడు అంతమయ్యాడు. నేను రాబోయే కృతయుగానికి అధిపతినైన కృతయుగ పురుషుడిని. కలి భయం అంతరించడం చేత నేను భూమి పై అడుగు పెట్టాను, ప్రజలందరు కృతయుగధర్మాలు పాటించేలా చేయండి" అని అర్థిస్తాడు._* *_కల్కిమూర్తి సంతోషించి లోకంలో కృతయుగ ధర్మాలు పునః స్థాపించి ధర్మం నాలుగు పాదాలలో నడిచేలా చేస్తాడు_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
396 views
3 hours ago
*_సాలిగ్రామ హారం - 108 సాలిగ్రామాలు_* *_స్వామివారి మెడలో ఉండే అతి పవిత్రమైన హారం._* *_108 గుండ్రటి సాలిగ్రామ శిలలతో చేసిన హారం._* *_సాలిగ్రామం అంటే నేపాల్‌లోని గండకీ నదిలో మాత్రమే దొరికే నల్లరాతి శిల. దాని మీద సహజంగా చక్రం గుర్తు ఉంటుంది. దాన్ని సాక్షాత్తూ విష్ణు స్వరూపంగా పూజిస్తారు_*. *_ఒక్కో సాలిగ్రామానికి ఒక్కో పేరు, ఒక్కో ఫలితం ఉంటుంది. 108 కలిపితే అష్టోత్తర శతనామాలకు ప్రతీక._* *_ఈ హారం బరువు సుమారు 2 కేజీలు ఉంటుంది_*. *_నిత్యం స్వామివారికి అలంకరించే ప్రధాన ఆభరణాల్లో ఇది ఒకటి. గురువారం అభిషేకం తర్వాత ప్రత్యేకంగా అలంకరిస్తారు_*. *_సాలిగ్రామ హారం ధరించిన స్వామిని దర్శిస్తే సర్వ పాపాలు పోతాయని నమ్మకం_*. *_కిరీటంలోని చిలుక బొమ్మ అర్థం_* *_వజ్ర కిరీటంపై కనిపించే చిలుక బొమ్మ వెనుక కథ ఉంది._* *_స్వామివారి వజ్ర కిరీటానికి ఎడమ వైపున ఒక చిన్న బంగారు చిలుక బొమ్మ ఉంటుంది._* *_కథ: ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు, ఒక చిలుక ఆయనతో పాటు గర్భగుడిలోకి వచ్చి "శ్రీనివాస గోవిందా" అని పలికింది. అది విని రాజు ముగ్ధుడయ్యాడు._* *_ఆ చిలుక భక్తికి గుర్తుగా రాయలు వారు బంగారు చిలుకను చేయించి కిరీటంపై పెట్టించారు_*. *_మరో కథ: అమ్మవారైన అలమేలుమంగ స్వామిని కలవడానికి చిలుక రూపంలో వచ్చిందని కూడా చెప్తారు. అందుకే ఆ చిహ్నం_* *_చిలుక వాక్కుకు, వేదానికి, శుభానికి సంకేతం. భక్తుల మొరలను స్వామికి చేరవేస్తుందని అర్థం_*. *_ఆభరణాల లాకర్ - ఎక్కడ దాస్తారు_* *_తిరుమల ఆభరణాల భద్రత ప్రపంచంలోనే గట్టిది._* *_స్వామివారి ఆభరణాల విలువ లక్షల కోట్లలో ఉంటుంది. వీటిని "బొక్కసం" అంటారు_*. *_ఆలయంలోపల, గర్భగుడికి దగ్గరలో అత్యంత భద్రత ఉన్న రహస్య గదుల్లో వీటిని భద్రపరుస్తారు. దాన్ని "పూల అర" లేదా "బంగారు బావి" అని పిలిచే ప్రాంతాల దగ్గర ఉందంటారు._* *_6 అంచెల భద్రత: TTD సెక్యూరిటీ, APSP పోలీసులు, ఆక్టోపస్ ఫోర్స్, సీసీ కెమెరాలు, లేజర్ సెన్సార్లు, బయోమెట్రిక్ లాక్_*. *_తాళం చెవులు ఒకరి దగ్గర ఉండవు. ప్రధాన అర్చకులు, EO, ఆలయ డిప్యూటీ EO - ఇలా ముగ్గురు, నలుగురు కలిస్తేనే లాకర్ తెరుచుకుంటుంది_*. *_ఏ ఆభరణం బయటకు తీసినా, తిరిగి పెట్టినా అన్నింటికీ లెక్క ఉంటుంది. రోజూ ఆడిట్ జరుగుతుంది._* *_అత్యంత ఖరీదైన వజ్ర కిరీటం, సాలిగ్రామ హారం లాంటివి ప్రత్యేక వాల్ట్‌లో ఉంటాయి._* #మన సంప్రదాయాలు సమాచారం