ఫాలో అవ్వండి
Ravi Talluri
@91775
65,156
పోస్ట్
28,653
ఫాలోవర్స్
Ravi Talluri
22 వీక్షించారు
17 నిమిషముల క్రితం
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_బుధవారం అక్టోబర్ 08 2025_* *_శ్రీ విశ్వావసు నామ సంవత్సరం_* *_దక్షిణాయనం శరదృతువు_* *_ఆశ్వయుజ మాసం బహుళపక్షం_* *_తిథి: పాడ్యమి ఉ 07.31వరకు తదుపరి విదియ తె 05.13వరకు_* *_వారం:బుధవారం (సౌమ్యవాసరే)_* *_నక్షత్రం:అశ్విని రా 02.12వరకు తదుపరి భరణి_* *_యోగం: వ్యాఘాతం ఉ 08.52వరకు తదుపరి హర్షణం తె 05.51వరకు_* *_కరణం;కౌలువ ఉ07.31వరకు తదుపరి తైతుల రా 06.22వరకు ఆ తదుపరి గరిజ_* *_వర్జ్యం;రా 10.27-11.57వరకు_* *_దుర్ముహూర్తము:ఉ11.24-12.11వరకు_* *_అమృతకాలం:రా 07.27-08.57_* *_రాహుకాలం:మ 12.00-01.30_* *_యమగండం/కేతుకాలం; ఉ 07.30-10.00_* *_సూర్యరాశి:కన్య_* *_చంద్రరాశి:మేషం సూర్యోదయం:05.45సూర్యాస్తమయం: 05.43_* *_ఓం నమో గణాధిపతయేనమహ సర్వేజనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవతు_. _ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
309 వీక్షించారు
1 గంటల క్రితం
*_ఏదో యాంత్రికంగా సరదాలు సంతోషాలు లేకుండా కేవలం ఫోటో షూట్ ల కోసం జరుగుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తున్న నేటి కాలంలో పెళ్లిళ్ళల్లో ఇటువంటి సందడి చాలా సరదాగా ఉంటుంది_ - _ఈసారి మీ ఇంట్లో జరిగే పెళ్ళిలో అమ్మాయిలు చేత సరదాగా చేయించండి_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
261 వీక్షించారు
1 గంటల క్రితం
*_ఆనంద్ బక్షి ._* *(బక్షి ఆనంద్ ప్రకాష్ వైద్) ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రావల్పిండిలో 1930, జూలై 21న జన్మించాడు. ఇతని పూర్వీకులు రావల్పిండి సమీపంలో ఉన్న కుర్రీ గ్రామానికి చెందిన మోహ్యాల్ బ్రాహ్మణులు. వీరి మూలాలు కాశ్మీర్‌లో ఉన్నాయి. ఇతడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇతని తల్లి సుమిత్ర మరణించింది. విభజన సమయంలో ఇతని కుటుంబం పూనే, మీరట్‌ల గుండా ప్రయాణించి ఢిల్లీకి వలస వచ్చింది అక్కడ స్థిరపడింది.* *ఇతని ప్రాథమిక విద్య అనంతరం ఇతడు భారతీయ సైన్యంలో చేరాడు. ఇతనికి చిన్నతనం నుండే కవిత్వం వ్రాయాలని ఉబలాటం ఉండేది. అయితే సైన్యంలో ఇతనికి సమయం దొరకక ఎక్కువగా వ్రాయడానికి కుదరలేదు. సమయం చిక్కినప్పుడల్లా ఇతడు కవిత్వం వ్రాసేవాడు. తన పాటలను సైన్యంలో స్థానిక కార్యక్రమాలలో ఉపయోగించేవాడు. సైన్యంలో ఇతడు ఎక్కువ కాలం పనిచేశాడు*. *ఇతడు హిందీ సినిమాలలో రచయితగా, గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రవేశించాడు. కానీ చివరకు గేయ రచయితగా రాణించాడు*. *బ్రిజ్‌మోహన్ సినిమా భలా ఆద్మీ (1958) చిత్రంతో ఇతనికి గీతరచయితగా గుర్తింపు వచ్చింది. 1956 నుండి 1962 వరకు కొన్ని చిత్రాలకు పనిచేసినా 1962లో మెహెందీ లగీ మేరీ హాత్తో ఇతని విజయ పరంపర ప్రారంభమయ్యింది. ఇతడు మొత్తం 638 హిందీ సినిమాలకు 3500లకు పైగా పాటలను వ్రాశాడు*. *ఇతని పాటలకు లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్.డి.బర్మన్, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, ఎస్.డి.బర్మన్, అను మాలిక్, రాజేష్ రోషన్, ఆనంద్-మిలింద్ మొదలైన సంగీత దర్శకులు బాణీలు కూర్చగా, షంషాద్ బేగం, ఇలా అరుణ్, ఖుర్షీద్ బావ్రా, అమీర్‌బాయి కర్ణాటకి, సుధా మల్హోత్రా, కిశోర్ కుమార్, శైలేంద్ర సింగ్, కుమార్ సానూ, కవితా కృష్ణమూర్తి వంటి అనేక మంది గాయనీ గాయకులు ఇతని పాటలను ఆలపించారు*. *ఇతడు వ్రాసిన పాటలలో 1972లో వచ్చిన హరేరామ హరేకృష్ణ చిత్రంలోని దమ్‌ మారో దమ్ పాట ఇతడిని ప్రతిభావంతుడైన రచయితగా* *నిలబెట్టింది. ఇతడు గీతరచన చేసిన చిత్రాలలో బాబీ, అమర్ ప్రేమ్‌, ఆరాధన, జీనే కీ రాహ్, మేరా గావ్ మేరా దేశ్, ఆయే దిన్ బహార్ కే, ఆయా సావన్ ఝూమ్‌కే, సీతా ఔర్ గీతా, షోలే, ధరమ్‌ వీర్, నగీనా, లమ్హే, హమ్‌, మొహ్రా, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, పర్‌దేశ్, దుష్మన్, తాళ్, మొహబ్బతే, గదర్:ఏక్ ప్రేమ్‌ కథ, యాదే వంటి అనేక విజయవంతమైన చిత్రాలున్నాయి.* *ఇతడు ఉత్తమ గేయ రచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికై 40 సార్లు నామినేట్ చేయబడ్డాడు.* *వాటిలో 4 పర్యాయాలు ఉత్తమ గేయరచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం దక్కించుకున్నాడు.* *ఇతడు తన జీవితంలో విపరీతంగా ధూమపానం చేయడం వల్ల ఇతని ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డాడు.* *పర్యవసానంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 2002, మార్చి 30వ తేదీన తన 71వ యేట మరణించాడు. మరణించేనాటికి ఇతనికి భార్య కమలా మోహన్ బక్షి, కుమార్తెలు సుమన్ దత్, కవితా బాలి, కుమారులు రాజేష్ బక్షి, రాకేష్ బక్షి ఉన్నారు. ఇతడు రచించిన పాటలున్న చివరి సినిమా మెహబూబా ఇతని మరణానంతరం విడుదలయ్యింది.* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
421 వీక్షించారు
7 గంటల క్రితం
*_శ్రీరాముడా గొప్పవాడా? కృష్ణుడా గొప్పవాడా? — ఒక ఆధ్యాత్మిక సన్నివేశం_* *ఒకసారి అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు*. *ప్రయాణంలో ఆంజనేయుని కలుసుకున్నాడు.* *ఇద్దరూ పరస్పర కుశలప్రశ్నలు అడిగి,* *కురుక్షేత్ర సంగ్రామం గురించి మాట్లాడసాగారు.* *అర్జునుడు గర్వంగా అన్నాడు —* *“శ్రీకృష్ణుడే అందరిలో గొప్పవాడు!* *అతడు ఉన్నందునే మేము ఆ మహాసంగ్రామంలో విజయం సాధించాము.”* *ఆ మాట ఆంజనేయునికి నచ్చలేదు*. *అతను చిరునవ్వు చిందించి అన్నాడు —* *“మా ప్రభువు శ్రీరాముడి ముందు కృష్ణుడు ఎంతటివాడు?”* *అర్జునుడు సవాలు విసిరాడు —* *“అంతటి శక్తివంతుడైన రాముడు సేతువును తానే ఎందుకు నిర్మించలేదు?* *తన ధనుర్విద్యా కౌశలంతో సముద్రం మీద వంతెన కట్టవచ్చుకదా!* *వానరుల సహాయం ఎందుకు తీసుకున్నాడు?”* *ఆ మాట ఆంజనేయుడి చెవుల్లో మెరుపులా పడింది.* *అతడు ఉత్సాహంగా అన్నాడు —* *“అర్జునా! నువ్వు ధనుర్విద్యలో* *ప్రావీణ్యుడు కదా*, *నీ బాణాలతో వంతెన నిర్మించు*. *దానిపై నేను నడుస్తాను — అది కూలకపోతే నేనోడి అయినా సరే!* *కూలిపోతే నీవు నీ ప్రాణం త్యజించాలి.”* *ఇద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు*. *అర్జునుడు కృష్ణపరమాత్మను స్మరించి* *తన బాణాలతో సేతువును నిర్మించాడు*. *హనుమ ఆ వంతెనపై నడిచాడు, గంతులు వేశాడు,* *తన బలమంతా ఉపయోగించాడు*. *వంతెన కదల్లేదు!* *ఆంజనేయుడు ఓటమిని అంగీకరించి* *పందెం ప్రకారం చితి పేర్చాడు*. *చితిచుట్టూ ప్రదక్షిణలు చేసి,* *“రామా!” అంటూ మంటల్లో దూకబోయాడు*. *అర్జునుడు దిగ్భ్రాంతిచెందాడు —* *తన కారణంగా ఆ మహాభక్తుడు* *ప్రాణాలు కోల్పోవడాన్ని* *భరించలేక,* *కృష్ణుణ్ణి స్మరించాడు*. *అప్పుడే అక్కడికి ఒక పండు ముసలివాడు వచ్చాడు*. *చేతులు వణుకుతున్నాయి*, *కళ్ళు మసకబారాయి*. *అతను అడిగాడు —* *“ఏమయ్యా! ఏమి జరుగుతోంది ఇక్కడ?* *ఎందుకీయన ప్రాణత్యాగం చేయబోతున్నాడు?”* *ఇద్దరూ తమ కథ వివరించారు*. *వృద్ధుడు శాంతంగా విని అన్నాడు —* *“ఇదంతా జరిగినప్పుడు ఎవరైనా సాక్ష్యం ఉన్నారా?”* *ఎవరూ లేరని చెప్పడంతో,* *“అయితే ఈసారి నేనే చూస్తాను*. *మళ్లీ వంతెన నిర్మించు అర్జునా!” అని అన్నాడు.* *అర్జునుడు ఈసారి వంతెన కట్టాడు* — *కానీ కృష్ణుని స్మరణ చేయలేదు*. *ఆంజనేయుడు మాత్రం తన రాముణ్ణి తలచుకుని* *ఆ వంతెనపై అడుగుపెట్టగానే* — *ఫట్ ఫట్ ఫట్! వంతెన కూలిపోయింది!* *అర్జునుడు తన ఓటమిని అంగీకరించి* *మంటల్లో దూకబోయాడు*... *అప్పుడే ఆ వృద్ధుడు చిరునవ్వు చిందించాడు.* *అర్జునుడికి ఆయన కృష్ణుడిలా కనిపించాడు,* *ఆంజనేయుడికి ఆయన రాముడిలా కనిపించాడు*. *ఇద్దరూ భక్తి పారవశ్యంతో* *“శ్రీరామా! శ్రీకృష్ణా!” అంటూ* *ఆ వృద్ధుడిని కౌగిలించుకున్నారు*. *కళ్లు తెరిచేసరికి*— *ఆ వృద్ధుడు కనబడలేదు*. *మిగిలింది ఒకరికొకరి కౌగిలే.* *అహంకారాన్ని విడిచి భక్తిని ఆలింగనం చేసుకున్నారు.* *_ఇద్దరూ గ్రహించారు_* — *దైవం ఒక్కటే.* *రూపాలు వేరు, మూలం ఒకటే.* *మనసు వినమ్రతతో దైవస్మరణ చేస్తే* *అదే విజయానికి మూలం*. *మన జీవితంలో ఏది సాధించాలన్నా,* *మన ఇష్టదైవాన్ని — మన* *జ్ఞానగురువులను స్మరించుకుంటూ* *ముందుకు సాగితేనే* *అన్నీ సఫలం* *అవుతాయి.* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
490 వీక్షించారు
16 గంటల క్రితం
*_మన ఆరోగ్యం…!_* *_మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం_* *_మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం మంచిదేనా.?_* *_ఏమైనా అన‌ర్థాలు క‌లుగుతాయా..?_* *మ‌న శ‌రీరానికి నిద్ర ఎంతో అవ‌స‌రం. నిద్ర అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌ర‌మైన‌ జీవ‌న క్రియ‌*. *అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనాల్సి వ‌స్తుంది.* *జీవ‌నోసాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం అల‌వాట‌వ‌డంతో రాత్రి వేళ నిద్ర పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది.* *కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక‌పోతున్న వారు ఎందరో.* *మ‌న‌కు ఆహారం ఎంత ముఖ్య‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో నిద్ర‌లేమి ఒక జ‌బ్బుగా త‌యార‌య్యింది*. *సుదీర్ఘ ప‌ని గంట‌లు, ఆర్థిక ఇబ్బందులు*, *దాంప‌త్య స‌మ‌స్య‌లు ఇవి అన్నీ మాన‌సికి* *ఒత్తిళ్ల‌ను పెంచే అంశాలైతే గాడి త‌ప్పిన ఆహారపు అల‌వాట్లు, పోష‌కాహార లోపం*, *అనారోగ్య స‌మ‌స్య‌లు*, *మాన‌సిక ఆందోళ‌న‌లు ఇవి అన్నీ నిద్ర‌లేమికి దారి తీస్తున్న అంశాలు*. *రోజులో కూడా ప‌ని ఒత్తిడి వల్ల కూడా చురుకుద‌నం త‌గ్గిపోయి* *అలిసిపోయిన‌ట్టుగా అనిపిస్తుంది*. *రాత్రి ఎంత నిద్రించినా కూడా మ‌ధ్యాహ్న వేళ చిన్న పాటి కునుకు చాలా* *ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. హాయిగా మ‌ధ్యాహ్నం ఒక గంట పాటు నిద్రపోతే చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు*. *మ‌న‌లో చాలామంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత కానీ, తీరిక దొరికిన‌ప్పుడు కానీ ఒక కునుకు తీయ‌డం చూస్తూ ఉంటాం*. *ఇలా నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీరం పున‌రుత్తేజం అవుతుంది*. *ఇలా మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల మాన‌సిక‌, శారీర‌కప‌ర‌మైన ఒత్తిళ్లు ద‌రి చేర‌కుండా ఉంటాయి*. *తాజాగా జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం మ‌ధ్యాహ్నం చిన్న కునుకు తీయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని తేలింది*. *మ‌ధ్యాహ్నం పూట కొద్ది సేపు నిద్రించ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది*. *హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ర‌క్త‌నాళాలు శుభ్ర‌ప‌డ‌తాయి*. *రాత్రి ఆల‌స్యంగా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల క‌లిగే ఒత్తిడిని మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చు.* *మ‌ధ్యాహ్న స‌మ‌యంలో 30 నిమిషాల పాటు నిద్ర‌పోవ‌డం వ‌ల్ల ఆ త‌రువాత ప‌నిని ఉత్సాహంగా చేస్తారు*. *ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటేంటే మ‌గ వారితో పోలిస్తే ఆడ‌వారిలో మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు కొద్దిగా త‌క్కువ‌గా ఉంటాయి*. *మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల చురుకుద‌నాన్ని, ఏకాగ్ర‌త‌ను పెంచుకోవ‌చ్చు. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర 30 నిమిషాలు దాటితే మాత్రం అది ప్ర‌మాదంగా మారుతుంది.* *మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌రువాత 30 నిమిషాల కంటే ఎక్కువ‌గా నిద్ర‌పోయిన వారి శ‌రీరంలో జీవ‌క్రియ రేటు దెబ్బ‌తింటుంది*. *జీవ‌క్రియ దెబ్బ‌తిన‌డం వ‌ల్ల పొట్ట‌, న‌డుము ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డం, ర‌క్త‌పోటు అధికంగా పెర‌గ‌డం, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయ‌ని తేలింది.* *అంతేకాకుండా దీని ద్వారా గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంటుంద‌ట‌. అయితే మ‌ధ్యాహ్నం 30 నిమిషాల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌మాదం ఏమీ లేదు.* *మ‌న‌లో చాలా మంది ఉత్తేజంగా ఉండ‌డానికి కాఫీని ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. కాఫీని తాగ‌డానికి బ‌దులుగా చిన్న కునుకు తీయ‌డం ఆరోగ్యానికి మంచిది*. *మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో 30 నిమిషాలు నిద్రించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
521 వీక్షించారు
16 గంటల క్రితం
*GEN Z కోసం స్వతంత్ర పోరాట చరిత్ర లో కొన్ని* *1925 లో RSS పెట్టారు*, *1950 లో పటేల్ జీ చనిపోయారు,* *1925 -1950 లలో పటేల్ జీ RSS లో ఎందుకు JOIN అవ్వలేదు?* *పటేల్ జీ, గాంధీ జీ నెహ్రూ జీ లతో నే ఎందుకు పని చేసారు?* *చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఎందుకు ఉన్నారు?* *గాంధీ జీ ని చంపిన RSS ని పటేల్ జీ తీవ్రవాద సంస్థ గా ప్రకటించి, ఎందుకు నిషేధం చేసారు?* *1920-1945 వరకు పటేల్ జీ గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా ఉన్నారు*, *భారత జాతీయ కాంగ్రెస్ కీ అధ్యక్షులు గా పని చేసారు.* #😁Hello🙋‍♂️
See other profiles for amazing content