Follow
kumarsingh
@95685325
380
Posts
376
Followers
kumarsingh
187 views
5 days ago
*చోరీకి వచ్చి చిక్కుకున్న దొంగ.. షట్టర్‌లో తల ఇరుక్కుపోయి గంటల తరబడి విలవిల్లాడాడు!* ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ దొంగకు ఎదురైన విచిత్రమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చోరీ చేయడానికి వెళ్లిన అతడే చివరకు షట్టర్‌లో చిక్కుకుని ప్రాణాలు పోయే పరిస్థితికి చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చోరీ చేయాలని ఉద్దేశంతో ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్నాడు. క్లినిక్ షట్టర్‌ను పైకి ఎత్తి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, షట్టర్ మరియు గోడ మధ్యలో అతని తల ఇరుక్కుపోయింది. దాంతో అతడు బయటకు రావడానికి గంటల తరబడి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నొప్పితో, భయంతో విలవిల్లాడుతూ అక్కడే చిక్కుకుపోయాడు. ఉదయం క్లినిక్ సిబ్బంది వచ్చి షట్టర్ దగ్గర అనుమానాస్పదంగా ఏదో కనిపించడంతో పరిశీలించగా, దొంగ తల ఇరుక్కుపోయిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. #🆕Current అప్‌డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ
kumarsingh
667 views
6 days ago
*వాట్సాప్‌లోనే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు* ఇంటర్‌ ఫలితాలను మీ వాట్సాప్‌లో ఇలా చెక్ చేసుకోండి. 8096 95 8096ని మీ కాంటాక్ట్‌లలో "MeeSeva Telangana"గా సేవ్ చేయండి WhatsApp తెరిచి "Hi" పంపండి.. మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది. "BIE Exam Result" టైప్ చేసి Open Service నొక్కండి మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ/2వ) మరియు స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకోండి సబ్మిట్‌ చేయండి.. మీ ఫలితం WhatsAppలో తక్షణమే వస్తుంది. #🆕Current అప్‌డేట్స్📢 #🏆పోటీ పరీక్షల స్పెషల్
kumarsingh
546 views
9 days ago
*తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు రేపు* * ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఆదివారం వెల్లడించనున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శుక్రవారం తెలిపారు. #🏆పోటీ పరీక్షల స్పెషల్
kumarsingh
883 views
12 days ago
*రాత్రి 8 గంటలకి అన్ని బంద్!* యుద్ధం ఎఫెక్ట్.. పాకిస్థాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రం కావడంతో మార్కెట్లు, మాల్స్ అన్నింటినీ నేటి నుంచి రాత్రి 8 గంటలకే మూసివేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్ దుకాణాలు, ఆహార కేంద్రాలు, వివాహ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. #🆕Current అప్‌డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ
kumarsingh
529 views
12 days ago
ఫ్రీ బస్సులో కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ బస్ కండక్టర్ ఏమే అంటూ దురుసుగా ప్రవర్తించి తిట్టాడని ఆరోపిస్తున్న మహిళ విజయవాడ నుండి వీసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఎక్కి, మూడు ఆధార కార్డులు చూపించి రెండు టిక్కెట్లు ఇవ్వమని అడిగిన మహిళలు దీంతో కండక్టర్, మహిళలకు మధ్య వివాదం జరిగి, కండక్టర్‌ను చెంప మీద కొట్టిన మహిళ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసిన కండక్టర్ #🆕Current అప్‌డేట్స్📢
kumarsingh
546 views
13 days ago
*మందుబాబులకు బ్యాడ్ న్యూస్!* త్వరలో తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు ఇప్పటికే దీనిపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం వచ్చే నెలలో మద్యం ధరలు 12-15% పెరగనున్నట్లు తెలుస్తుంది #🆕Current అప్‌డేట్స్📢
kumarsingh
489 views
13 days ago
స్కూటీని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి... హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మైండ్ స్పేస్ సమీపంలో రాత్రి స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఆగకుండా స్కూటీని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ దుర్ఘటనలో ఆయేషా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళకు చెందిన ఈ దంపతులు మహేశ్వరం సమీపంలో నివసిస్తూ మలబార్ గోల్డ్‌లో పనిచేస్తున్నారు. ప్రమాదం తర్వాత డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు క్లీనర్‌ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు... #🆕Current అప్‌డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ