నాకంటే లావుగా ఉన్నావ్.. బతకడం దేనికంటూ చంపేశాడట..!
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో తన భార్యను నెలల తరబడి వేధించిన ఓ భర్త, చివరికి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు ప్రియాంక కమలాకర్ (29) వృత్తిరీత్యా స్టాఫ్ నర్సు. ఆమెకు బసవరాజ్ వడ్డార్ అనే వ్యక్తితో డిసెంబర్ 2024లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని వారాలకే ప్రియాంకకు నరకం మొదలైనట్లు పోలీసుల ఎఫ్ఐఆర్ (FIR) ద్వారా తెలుస్తోంది. ప్రియాంక పుట్టింటి నుంచి అదనపు కట్నం, బంగారం తీసుకురావాలని బసవరాజ్ అతని కుటుంబ సభ్యులు (రేణవ్వ, సుభాష్, సిద్దరామేష్) తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా, ఆమె రూపాన్ని, బరువును చూపిస్తూ పదే పదే అవమానించేవారు.భర్త బసవరాజ్ తన కంటే లావుగా ఉన్నావంటూ ఆమెను తరచూ కించపరిచేవాడని, పిల్లలు ఎందుకు పుట్టడం లేదంటూ సూటిపోటి మాటలతో వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి
సోమవారం రాత్రి నవల్గుండ్ తాలూకాలోని హనసి గ్రామంలో ఉన్న వారి ఇంట్లో బసవరాజ్, ప్రియాంకను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల తర్వాత ఈ దారుణం వెలుగులోకి రావడంతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పెళ్లయిన తర్వాత ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చిందని, అయితే భర్త చేసిన భౌతిక దాడుల వల్ల ఆ రెండుసార్లు ఆమెకు గర్భస్రావం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రియాంక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నవల్గుండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రియాంక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు
#😇My Status #✌️నేటి నా స్టేటస్ #😢Sad Feelings💔 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్