సామాన్యుడికి మరో షాక్.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
పండుగల సీజన్కు ముందే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత ఐదు నెలల్లో 16 ప్రధాన నిత్యావసర ఆహార వస్తువుల్లో 15 వస్తువుల ధరలు పెరిగాయి.
ముఖ్యంగా కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, వంట నూనెలు, పాలు, చక్కెర వంటి రోజువారీ అవసరమైన వస్తువుల ధరలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బలహీన రుతుపవనాలు, పప్పుధాన్యాల సాగు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరల పెరుగుదల, అలాగే పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ అధికంగా ఉండడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు లేకపోతే, రాబోయే రోజుల్లో కూడా నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#today's special