Follow
EM.Naveen❤️Anu
@emnaveen
728
Posts
1,125
Followers
EM.Naveen❤️Anu
520 views
16 hours ago
Nara Lokesh గారు...💛💛 కుర్రోడు కూల్ గా ఉన్నాడు అనుకున్నారేమో.. అనే డైలాగ్ గుర్తొచ్చింది లోకేష్ అన్న ని చూడగానే 💛✌️ 🧿🪬 Cut out చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ 💛💥 #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం
EM.Naveen❤️Anu
515 views
5 days ago
రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలోని కీలక అభివృద్ధి పనులు, సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు శ్రీరామ్ బాబుతో క‌లిసి విజ్ఞప్తి చేయ‌డం జ‌రిగింది. ప్రధానంగా జీడిపల్లి - పేరూరు రిజర్వాయర్ కాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం గురించి ప్రస్తావించాచు. పరిటాల రవీంద్ర సాగునీటి పథకానికి 2018 లోనే భూసేకరణ చేశారని, ప్రభుత్వంపై నమ్మకంతో దాదాపు వెయ్యి ఎకరాల వరకు భూములు ఇచ్చారని, 2018-19లో కేవలం 95 ఎకరాలకు మాత్రమే రూ.5.20 కోట్ల పరిహారం చెల్లించగా, మిగిలిన 915 ఎకరాలకు సంబంధించిన సుమారు రూ.50.75 కోట్ల పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని, భూములు కోల్పోయిన రైతులు గత ఎనిమిదేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, భూములు కోల్పోవడంతో పాటు పంటల ఆదాయాన్ని కూడా కోల్పోయారని వివ‌రించాము. చెల్లించాల్సిన రూ.55 కోట్లలో, ఇంకా దాదాపు రూ.53 కోట్ల నష్టపరిహారం రైతులకు అందాల్సి ఉందని, పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాము. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల రైతాంగానికి సాగు, తాగునీటి భద్రత కల్పించేందుకు హంద్రీనీవా మెయిన్ కెనాల్‌ను పీఏబీఆర్ కుడి కాలువతో అనుసంధానం చేయాలని కోరాము. ఈ కాలువ ద్వారా రెండు జిల్లాల్లో 49 మైనర్ ఇరిగేషన్ చెరువులకు నీరు అందుతుందని తెలిపాము. ఈ పనులకు రూ.4.50 కోట్ల వ్యయం అవసరమవుతుందని తెలిపాము. మరోవైపు రాప్తాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి భూమి కేటాయింపుపై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశాము. ధర్మవరం నియోజకవర్గంలో రహదారి, వంతెన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాము. ధర్మవరం – ఎన్.హెచ్ 42 రహదారిపై దెబ్బతిన్న కాజ్‌వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని కోరాము. ఈ కాజ్‌వే మరమ్మతుల కోసం రూ.90 లక్షలు మంజూరు చేయాలని కోర‌డం జ‌రిగింది. ధర్మవరం–ధర్మపురి రహదారిలో గంగమ్మగుడి సమీపంలో చిత్రావతి నదిపై ఉన్న లో-లెవల్ కాజ్‌వే స్థానంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశాము. ఈ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.30 కోట్లు అవసరం ఉంటుందని వివరించాము. మేము చేసిన విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారు. ఇందులో కొన్నింటికి ఇప్పటికే ఆదేశించామని... మిగిలిన వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. #ParitalaSunitha #TeamParitala #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం