ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారు ఈరోజు ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు.
గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం జూబ్లీహిల్స్లోని ఆయన స్వగృహంలో ఉంచనున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అతని రాజకీయ జీవితం : 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన ఆయన, వృత్తిరీత్యా న్యాయవాది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా మరియు జనసేన పార్టీ కీలక నేతగా ఉన్నారు. N.Tరామారావు తో కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ఎన్టీఆర్ అమెరికాకు వైద్యం కోసం వెళ్ళిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల, నాదెండ్ల భాస్కరరావు దాదాపు ఒక నెల రోజుల పాటు (ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు) ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి 1998లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. 2019లో ఆయన బీజేపీలో చేరారు. #నాదండ్ల భాస్కరరావు గారు చనిపోయారు