ఫాలో అవ్వండి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
55,883
పోస్ట్
36,473
ఫాలోవర్స్
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
11 వీక్షించారు
18 నిమిషముల క్రితం
🌹 #న(మస్కా)రం ..🌹 🚩 నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.... నమస్కారం లోనే ఉంది మస్కా అంతా ! 🚩తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవంత కార్యలాభం కలగ లేదు భారతంలో. అదే ఆలస్యంగా వచ్చీ నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన అర్జునుడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహం లాభించింది. నిండు సభామధ్యంలో ఇలా దండకం చదివీ చదవంగానే ఆయనగారి అర్థాంగికీ అదే లాభం. కృష్ణ పరమాత్ముడి అండ దొరికింది. దండాలా మజాకా? 🚩రామాయణంలో మాత్రం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అలా అంజలి ఘటించి నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకైనా దక్కని అపురూప గౌరవం ఆంజనేయుడికి దక్కింది. 🚩ఉన్న ఒక్క తొండంతోనే చేతనైనంత వరకూ దాసోహ పడి ఆపదల నుంచి గట్టెక్కింది గడుసు గజేంద్రం. 🚩ఆరోగ్యాన్నిచ్చి, బంధు కృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడనే గదా సూర్యుణ్ణి భగవంతుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో పొద్దునా సాయంత్రం పడీ పడీ నమస్కారాలు చేస్తున్నాం! మరి అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పది మందిలో గుర్తింపు తెచ్చి పెట్టే ప్రణామ యోగానికి 'లోకబాంధవ' గౌరవం ఇస్తే తప్పేమిటి? 🚩నోబెలు పురస్కారాలే ఎవరెవరికో వస్తున్నాయి గదా ఇవాళా రేపూ? ఎక్కడో ఉన్న సూర్యనారాయణుడి శక్తికే నిత్యం నమస్కారాలు సమర్పిస్తున్న మనం అర్హతలతో నిమిత్తం లేకుండా వెధవాయలని సైతం అధికార పదవులకు సదా చేరువులో ఉంచే చేతుల ఇంద్రజాలాన్ని మరెంతగా మన్నించాలి? 🚩అదృష్టం. ఏ అరబ్బుల దేశంలోనో పుట్టుంటే ఖర్మ కాలి ఏ ఒసామా బిన్ లాడెన్నో కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకోవాల్సి వచ్చేది. 'దేవుడానన్నీ 'నమస్తే'ల ఖండంలో పుట్టించినందుకు శతకోటి నమస్కారాలు! 🙏🙏🙏🙏🙏🙏 🚩 రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. 🚩ఎన్నేసి రకాల నమస్కారాలు మన సంస్కృతిలో! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #👋నమస్కారం #namaskaram #namaskaram
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
0 చూసారు
28 నిమిషముల క్రితం
#అంతర్యామి #కాలచక్రం... 🍁మనిషి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. జీవన పయనంలో మూడు ప్రధాన శక్తులు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అవి భావం, కర్మ, కాలం. భావం మన మనసులో ఆకాంక్షలను రేకెత్తిస్తుంది, కర్మ వాటిని కార్యరూపంలో పెడుతుంది. కానీ కాలం మాత్రం అన్నింటికి పరిమితులు విధిస్తుంది. కాల గమనాన్ని ఎవరూ అడ్డుకోలేరని విదురనీతి చెప్పిన మాట మనందరికీ అనుభవైకవేద్యమే. ప్రాచిన భారతీయ తాత్వికులు, మునులు అందరూ కాలాన్ని జీవనాధారమైన సత్యంగా చూశారు. కాలం మహాశక్తిమంతమైంది. అది సృష్టిలోని అన్నిటినీ తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. బలవంతుడు, జ్ఞానవంతుడు, ధనవంతుడు ఎవరైనా కాలం ముందు సమానమే. పనులు వాయిదా వేయడమంటే కాలానికి లొంగిపోయినట్లే. 🍁సమయాన్ని వృథా చేయడమంటే జీవితాన్ని వృథా చేసుకోవడమే. నేటి వేగవంతమైన ప్రపంచంలో సమయ పాలన ముఖ్యమైన జీవన నైపుణ్యం. 🍁'సమయాన్ని సద్వినియోగం చేయడమనేది భక్తిలో మొదటి మెట్టు' అనే గురువుల బోధన అర్ధం చేసుకుంటే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. సమయాన్ని మిత్రుడిగా అవగాహన చేసుకున్నవారు మాత్రమే లక్ష్యసాధనలో ముందుంటారు. కాలాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేవారు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాధాన్యాలు నిర్ణయించుకోగలరు. ఒత్తిడికి గురవ్వరు. 🍁 రోజు ముగిశాక ఆ వేళ తన సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాను అని స్వీయపరిశీలన చేసుకుంటారు. ఆ క్రమంలో చేసిన సత్కార్యాన్నో, గతంలో మొదలెట్టిన పని పురోగతినో నమోదు చేసుకోవాలి. ఇది మరింత బాగా పనిచేసేందుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కాలం ప్రవహిస్తున్న నదిలాంటిది. దాన్ని ఆపలేం కానీ దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మాత్రం మన చేతిలోనే ఉంది. 🍁కాలం నిశ్శబ్ద గురువు. ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో దానికి తెలుసు.. 🍁'నేనే కాలం. లోకాల సంహారకుడిగా, వాటిని నశింపజేయడానికి ఇక్కడ ప్రవృత్తుడనై వచ్చాను' అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కాలం అనేది సృష్టిలయల నిత్యచక్రంలో భాగం. మనకు లభించిన సమయమే మన యుద్ధక్షేత్రం. దాన్ని వృథా చేయకుండా కర్తవ్యాన్ని ఆచరించడమే గీతా మార్గం. మన కర్తవ్యాన్ని సమయానికి చేయడం అంటే దైవసంకల్పానికి అనుగుణంగా జీవించడం. సత్సంగం మనకు సమయాన్ని విలువైనదిగా చూసే దృష్టినిస్తుంది. కాలం మన శత్రువు కాదు, అది మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. మన జీవితాన్ని నిర్మించగల శక్తి ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణానికీ ఉంది. 🍁 కానీ స్వార్థానికి, ఇహలోకపు ఆకర్షణలూ ఆడంబరాలకు బానిసలమై పరమాత్మ ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ప్రతి వ్యక్తీ పడుకునే ముందు ఇవాళ నేను ఆ సర్వాంతర్యామికి చేరువయ్యే పని ఏదన్నా చేశానా అని ప్రశ్నించుకోవడం అలవరచుకుంటే సమయం సద్వినియోగం అయితీరుతుంది.🙏 ✍️బాలాంత్రపు సత్య కుమారీ ⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️ శ్రీ రామ జయ రామ జయజయ రామ #భగవంతుడు సర్వంతర్యామి 🙏🙏🙏 #తెలుసుకుందాం #🗣️జీవిత సత్యం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
575 వీక్షించారు
37 నిమిషముల క్రితం
బంధాలకు కొన్ని.. అనుబంధాలకు మరికొన్ని.. ప్రేమాభిమానాలకై కొన్ని.. ఆత్మీయతానురాగాలకై మరికొన్ని.. అయినవారి కోసం కొన్ని.. కాని వారి కోసం మరికొన్ని.. లెక్క లేనన్ని కన్నీటి బిందువులు రాలుతుంటే హృదయం ఎంత భారంగా ఉండేదో ! నీ సేవకోసం పరితపిస్తూ.. నీ దర్శనం కోసం ఎదురుచూస్తూ.. నీ అనుగ్రహానికై పరితపిస్తూ.. నీ పిలుపుకోసం నిరీక్షిస్తూ.. జనించిన ప్రతి కన్నీటి బిందువుతో మనసు ఎంత తేలిక పడుతున్నదో! నా ప్రతి కన్నీటిచుక్కతో.. నీ పదములు కడిగనివ్వు.. హృదయ భారం తగ్గనివ్వు.. మనసు తేలిక పడనివ్వు.. నా జన్మ చరితార్థం కానివ్వు.. 🙏🏻 #💗నా మనస్సు లోని మాట #భగవంతుడు #భగవంతుడు #భగవంతుడు భక్తుడు #భగవంతుడు సర్వంతర్యామి 🙏🙏🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
0 చూసారు
40 నిమిషముల క్రితం
భగవంతుడి లెక్కలు ఇవ్వాళ జీవుడు ఈ శరీరంలో వున్నాడు. గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో వున్నాడో తెలియదు. ఏదో శరీరంలో వుండి ఏదో తప్పిదం చేసాడు, ఏదో పాపం చేసాడు, పుణ్యం చేసాడు. ఆ పాపమైనా, పుణ్య మైనా అనుభవించే పోవాలి. పాపము అనుభవ స్వరూపంగా పోవట పోవటానికి దుఃఖము; అలాగే పుణ్యము అనుభవంగా పోవటానికి సుఖము, రెండింటికి లెక్క ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపమెంత, పుణ్యమెంత? ఎంత సుఖపెట్టవచ్చు? ఎంత దుఃఖపెట్టవచ్చు? ఇది లెక్క కట్టగలి గినవాడే లెక్కచెప్పి నీ ఎదుట నిలబడి నీ పాపపుణ్యముల ఫలితమును నీకివ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్కకట్టి, ఆ లెక్క సారాంశంగా సుఖదుఃఖములని స్తాడు. ఆ పరమేశ్వరుని మనం పట్టుకొని నిలదీ యడానికి ఆయన మన కన్నుల ఎదుట కనబడే వాడు కాడు. మాంస నేత్రములకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్ని చ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవిం చటమొక్కటే మనం చేయగలిగిన పని. అది కూడా భక్తితో కూడుకున్నది. దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవం తుడు దుఃఖమిచ్చాడని బాధ పడకుండా, నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి వుంటాను, దానికి ప్పుడు దుఃఖమిచ్చాడు. ఈశ్వరా! ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దఃఖమునకు కారణమైన పాపము నాచేత చేయ బడకుండుగాక. కాబట్టి నాకు దైవమునందు పూనిక కలుగుగాక! అని భగవంతునికి నమస్కరించగలిగిన ప్రజ్ఞ అంకురించటం నిజమైన పరిణతి కలిగిన భక్తిని పొంది వుండటం. అందుకే ధూర్జటి 'నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై గొననీ, జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ చ్చినరానీ, యవినాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా! అని అంటాడు. అలా ఉండగలిగిన పరిణతి ఈశ్వరుని కృపచేత మాత్రమే సంభవమవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైన స్వరూపం. అది ఈశ్వర స్వరూపంగా వుండి, ఈ సుఖదుః ఖముల రూప ములలో పాపపుణ్యములనుభవించేసి, దానివలన కంటికి కనబడని ఈశ్వరుని ప్రజ్ఞని గుర్తెరిగి ఆయన పాదముల యందు నిరతిశయమైన భక్తిని పెంపొందింపజేసుకుని కృతార్థుడు కాగలిగిన వ్యక్తి ధన్మాత్యుడు. #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
225 వీక్షించారు
54 నిమిషముల క్రితం
🇮🇳🌱 భారతదేశపు “ప్లాస్టిక్ మాన్” — డా. రాజగోపాలన్ వాసుదేవన్ గారి అద్భుతమైన ఆవిష్కరణ! ♻️ తమిళనాడులోని మదురై తియాగరాజార్ ఇంజనీరింగ్ కళాశాలలో రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందించిన డా. రాజగోపాలన్ వాసుదేవన్ గారు, భారతదేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన మహానుభావుడిగా గుర్తింపుపొందారు. 🌍 2002లో ఆయన అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా — ప్లాస్టిక్ వ్యర్థాలను చిన్న ముక్కలుగా చేసి బిటుమెన్‌తో కలిపి రోడ్ల నిర్మాణంలో ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో ప్లాస్టిక్ కాలుష్యం తగ్గి, రోడ్లు మరింత బలమైనవి, దీర్ఘకాలికమైనవి, తక్కువ ఖర్చుతో కూడినవి అయ్యాయి. 🚧✨ ఈ సాంకేతికతతో తయారైన రోడ్లు వర్షాలు, గోతులు, దెబ్బలు వంటి సమస్యలను సులభంగా తట్టుకుంటాయి. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో 1 లక్ష కిలోమీటర్లకు పైగా ప్లాస్టిక్ రోడ్లు ఈ విధానంతో నిర్మించబడ్డాయి! 💪🇮🇳 వారి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం, 2018లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 🏅 ఆయన చూపించిన మార్గం — “ఫెంకిన ప్లాస్టిక్ వ్యర్థం కాదు, ఒక విలువైన వనరే” అని నిరూపించింది. 🌟 డా. వాసుదేవన్ గారి ఆవిష్కరణ భారతదేశాన్ని పర్యావరణహిత, సుస్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించింది. 🌱🛣️ #తెలుసుకుందాం #super #👍సూపర్ టాలెంట్👍 #ఆలోచన బాగుంది #ఒక మంచి ఆలోచన
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
194 వీక్షించారు
59 నిమిషముల క్రితం
#అయ్యప్ప ఆలయంపై ఈ వాక్యాన్నే ఎందుకు రాశారు?* మన కంటే గొప్పవారిని, పెద్దలను చూసినప్పుడు వారికి చిరునవ్వుతో నమస్కారం చేస్తాం. ఇది భారతీయులకు మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. ప్రతి హిందువు జీవితంలో ‘నమస్కారం’ ఓ అంతర్భాగం. నిద్ర మేల్కోగానే భూమాతకు, తల్లిదండ్రులు, సూర్య భగవానుడు, గురువులు, కుల, ఇష్ట దైవాలకు నమస్కారం చేసి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. అలాగే పెద్దలు కనపడితే నమస్కరించి, చిరునవ్వుతోనే పలకరిస్తాం. ఇది మన హిందూధర్మానికి మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. మన పెద్దలు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారో? ఎప్పుడైనా ఆలోచించారా? వారు ఏం చేయించినా అందులో నిగూఢమైన వైదిక , ఉపనిషత్, పురాణ వాజ్ఞ్మయ సారంతో ముడిపడే ఉంటుంది. **రెండు చేతులు జీవాత్మ-పరమాత్మలకు సంకేతం. ఆ రెండూ కలవడం...జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. అదే మన జీవిత కాలపు లక్ష్యం. ఎదుట ఉన్న వ్యక్తులకు నమస్కారం చేసేటప్పుడు ,రెండు చేతులను ఒకదానికొకటి ఎదురెదురుగా కలుపుతాం. అంటే నీలోని ఆత్మ , నాలోని ఆత్మ ఒక్కటే అని చెప్పడం. ఎదుటి వ్యక్తికి, మనకి భేదం లేదని, మనమంతాఒక్కటే అని చెప్పకనే చెబుతాం. అంతా ఒక్కటిగా మెలగమని మన పూర్వీకులు మనకు నేర్పించిన అద్భుతమైన సంస్కారం ఈ "నమస్కారం. మరి దీనికి మూలం.. సామవేద అంతర్గత చాందోగ్యోపనిషత్ సారమైన " తత్వమసి " అనే మహా వాక్యం.ఆదిత్యయోగీ. **ఈ మహా వాక్యాన్ని అర్థం చేసుకొనే శక్తి కలియుగంలో మానవులకు ఉండదని, దాని పరమార్థాన్ని "నమస్కారం" అనే సంకేతం ద్వారా వారికి తెలియకుండానే ఆచరింపజేశారు. అయితే ఈ వాక్యం శబరిమలలోని అయ్యప్ప ఆలయం ముందు రాసి ఉంటుంది. 41 రోజుల కఠోర దీక్షచేసి, పవిత్రమైన ఇరుముడిని శిరస్సును పెట్టుకుని, పావన పదునెట్టాంపడి ఎక్కగానే భగవంతుడి కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం తత్వమసి. అంటే భక్తితో స్మామికి నమస్కరించే ముందే, నమస్కారానికి మూలమైన ‘తత్వమసి’ మహావాక్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నమస్కరించే ముందు ఎందుకు, ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసుకొని నమస్కరించమని దీని అర్థం. **‘తత్వమసి’ అనేది సంస్కృత పదం. తత్‌+ త్వం +అసి అను మూడు పదాల కలయికే ‘తత్వమసి’, తత్‌.. అంటే అది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు. ‘అది నీవై ఉన్నావు’ అనేది తత్వమసి వాచ‌కానికి అర్థం. మాలధరించి, మండల కాలం పాటు దీక్షచేసి, కొండ కోనలు దాటి పావన పదునెట్టాంబడి ఎక్కి ఏ పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని వచ్చావో ‘అది నీవై ఉన్నావు’ ‘నీలోనే పరమాత్మ అంతర్యామియై ఉన్నాడు’ అని తెలియజేస్తుంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. మండల కాల బ్రహ్మచర్య దీక్ష అనే ఆత్మ ప్రబోధ‌ను కలిగించి, అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్‌ ప్రబోధ‌మే ‘తత్వమసి’. అందుకే పదునెట్టాంపడి ఎదురుగా సన్నిధానం పైభాగాన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు. అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కొక్క సంవత్సరం కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల లాంటి ప‌ద్దెనిమిది అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే.. కొన్నాళ్లకు ‘తత్వమసి’ పరమార్థం ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది..* _________________________________________ ఉడిపి శ్రీ కృష్ణ మఠం; ఉడిపి శ్రీ కృష్ణ మఠం, భారతదేశం, కర్ణాటక లోని ఉడిపి నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు, ద్వైత మఠానికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ చారిత్రక హిందూ దేవాలయం. మఠం ప్రాంతం సజీవ ఆశ్రమాన్ని పోలి ఉంటుంది, ఇది రోజువారీ భక్తికి, జీవనానికి పవిత్ర స్థలం. ఉడిపి అనంతేశ్వర ఆలయంతో పాటు వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన అనేక దేవాలయాలు శ్రీ కృష్ణ దేవాలయం చుట్టూ ఉన్నాయి. చరిత్ర కృష్ణ మఠాన్ని వైష్ణవ సన్యాసి జగద్గురు మధ్వాచార్యలుచే 13వ శతాబ్దంలో స్థాపించబడింది. అతను వేదాంత ద్వైత పాఠశాల స్థాపకుడు. మధ్వాచార్యుడు గోపీచందనపు పెద్ద బంతిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని కనుగొన్నాడని భక్తులు నమ్ముతారు. మధ్వాచార్యులు చెప్పినట్లుగా, తన తంత్రసార సంగ్రహంలో, విగ్రహం పశ్చిమాభిముఖంగా (పశ్చిమ ముఖంగా) ఉంచబడింది.ఇతర అష్ట మఠాలలోని ఇతర విగ్రహాలన్నీ పశ్చిమ దిశగా ఉంటాయి.భక్తులు ఎల్లప్పుడూ లోపలి కిటికీ ద్వారా శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు.దీనిని నవగృహ కిండి అని పిలుస్తారు. కనకన కిండి అని పిలువబడే బయటి కిటికీ,ఇది గొప్ప సన్యాసి కనకదాసు పేరు పెట్టబడిన తోరణంతో అలంకరించబడి ఉంటుంది.కనకదాసు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఇదే విధమైన కిటికీ విగ్రహం ముందు భాగంలో ఉంటుంది. దీనిని నవగ్రహ కిండి అంటారు.దీనిని కనకున కిండి అని తరచుగా పొరబడుతుంటారు.ఆదిత్యయోగీ. భారత కాలమానం ప్రకారం ఆలయం 5:30 గంటలకు తెరుస్తారు. ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, దేవతను తొమ్మిది రంధ్రాలతో (నవగ్రహ కిండి) వెండి పూతతో కూడిన కిటికీ ద్వారా పూజించటం ఈ ఆలయం ప్రత్వేకతగా చెప్పకోవచ్చు. ఈ ఆలయంలో భక్తులకు మధ్యాహ్న సమయంలో ప్రసాదాన్ని (భోజనం) అధిక సంఖ్యలో భక్తులకు అందజేసే సంప్రదాయం ఉంది. దీనిని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తారు. కృష్ణ మఠం నిర్వహణ: కృష్ణ మఠాల రోజువారీ సేవలు (దేవునికి అర్పణలు), పరిపాలన అష్ట మఠాలు (ఎనిమిది మఠాలు) ద్వారా నిర్వహించబడతాయి.ప్రతి అష్టమఠాలు రెండు సంవత్సరాల పాటు ఆలయ నిర్వహణ కార్యకలాపాలను చక్రీయ క్రమంలో నిర్వహిస్తాయి.వీరిని కన్నడలో అష్ట మాతగలు అని అంటారు.ప్రతి అష్ట మఠానికి దాని స్వంత దేవత ఉంటుంది, దీనిని పట్టాడ దేవరు అని పిలుస్తారు. కృష్ణ మఠం దాని మతపరమైన ఆచారాలు,సంప్రదాయాలు, ద్వైత లేదా తత్వవాద తత్వశాస్త్ర సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఉడిపిలో ఉద్భవించిన ఒక సాహిత్య రూపమైన దాస సాహిత్యానికి కేంద్రంగా ఉంది. ఈ ఎనిమిది మఠాలు: ఉడిపి కృష్ణ మఠానికి అయ్యే ఖర్చులను భక్తుల స్వచ్ఛంద విరాళాలు, కృష్ణ మఠాన్ని నిర్వహించే అష్టమఠాలు భరిస్తాయి.భక్తులు సహకారం నగదు లేదా వస్తు రూపంలో ఉంటుంది.1975లో కర్నాటక ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం 1975 అమలులోకి తెచ్చిన కారణంగా కృష్ణ మఠం పెద్ద ఎత్తున భూమిని కలిగి ఉంది. కృష్ణమఠం పౌలి పునర్నిర్మించబడింది. బ్రహ్మకలశోత్సవ కార్యక్రమం 2017 మే 18 న జరిగింది. అష్ట మఠాల స్వామీజీలు: పండుగలు: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పర్యాయ ఉత్సవంలో, ఆలయ నిర్వహణను తదుపరి అష్ట మఠానికి అప్పగిస్తారు.ఆలయాన్ని మలుపు తిరిగే బాధ్యతను వారికి అప్పగించారు. ప్రతి మఠాలకు ఒక స్వామి నేతృత్వం వహిస్తాడు.అతను తన పర్యాయ సమయంలో ఆలయానికి బాధ్యత వహిస్తాడు.పర్యాయ సంప్రదాయం 2021 నాటికి 500 సంవత్సరాలు పూర్తి చేసుకుంది [5] ప్రస్తుతం, అద్మరు మఠం జూనియర్ పోంటిఫ్ ఈశప్రియ తీర్థ స్వామి [6] సర్వజ్ఞ లేదా పర్యాయ పీఠాన్ని అధిరోహించడంతో అద్మరు మఠం ద్వారా ఆలయం నిర్వహణసాగుతుంది. మకర సంక్రాంతి, రథ సప్తమి, మధ్వ నవమి, హనుమాన్ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాతి మహోత్సవాలు, మాధ్వ జయంతి ( విజయ దశమి ), నరక చతుర్దశి, దీపావళి, గీతా జయంతి మొదలైన పర్యాయాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటారు....* #తెలుసుకుందాం #🥁స్వామియే శరణం అయ్యప్ప #అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప #swamiye saranam ayyappa 🙏 #ayyapp swami saranam ayyappa🙏🙏🔯🕉🔯🐆🔯🐅🐅
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
379 వీక్షించారు
3 గంటల క్రితం
ఐశ్వర్య సిద్ధి కోసం లక్ష్మీ గాయత్రీ మంత్రం: ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమః ॐ #ఓం శ్రీ మాత్రే నమః #ఓం శ్రీ లక్ష్మీ దేవి నమః హా #ఓం శ్రీమాత్రే నమః #🕉 ఓం శ్రీమాత్రే నమః #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏
See other profiles for amazing content