Follow
కృష్ణ చైతన్యం 💓💖🙏
@scsreddy4440
298
Posts
13,813
Followers
కృష్ణ చైతన్యం 💓💖🙏
845 views
13 days ago
ఆర్టికల్ 🚨 “ మంచి సమాజం నిర్మాణం కేవలం #📙ఆధ్యాత్మిక మాటలు #భగవద్గీత సైన్స్ చదువులు మరియు పోలీసుల శిక్షలు - చట్టాలు శాసనాలతో వస్తుందా?” లేక భగవంతుడు చెప్పిన శాస్త్ర ధర్మ సాధన ఆధారంగా వస్తుందా? “చట్టాలు, శిక్ష భయం ప్రజలని తప్పులు చేయకుండా సహజంగా, శాశ్వతంగా ఆపలేవు ధర్మమే ఆపుతుంది " మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి? కొంతమంది భగవంతుడు లేడు అని సగం సగం చదువుకొని కేవలం సైన్స్ తోనే సమస్యలు తీరిపోతాయని అనుకునే వారికి ఈ ఐదు ప్రశ్నలు రెండు రోజులు పోలీస్, కోర్ట్ లేకపోతే—మీ టెక్నాలజీ ప్రజలను తప్పు చేయకుండా భయంతో కాదు హృదయ పరివర్తనతో ఆపగలదా? తప్పు చేసిన తర్వాత శిక్ష ఇస్తారు—కానీ ముందు నుంచే తప్పు చేయకుండా ఆపేది మీ సిస్టమ్‌లో ఉందా? ఎవరూ చూడని చోట—మీ టెక్నాలజీ మనిషిని నిజాయితీగా ఉంచగలదా? డబ్బు, పవర్ ఉన్నవాడు దుర్వినియోగం చేయకుండా మీ చదువు ఎలా ఆపుతుంది? భయం లేకపోతే తప్పు చేయకుండా ఉండే మంచి మనసును మీ సైన్స్ ఇవ్వగలదా? నేటి చట్టాలు మరియు శ్రీరాముడు ధర్మం ఈ రోజుల్లో మనం ఒక పెద్ద మాయలో ఉన్నాం. టెక్నాలజీ ఉంది, విద్య ఉంది, స్కిల్స్ ఉన్నాయి కానీ ఒక ప్రశ్న అడగాలి: ఈ అభివృద్ధి మనిషిని మంచి మనిషిగా మార్చిందా? ఒక సమాజాన్ని నిలబెట్టేది కేవలం చట్టాలు కాదు, ధర్మం. చట్టం భయం వల్ల మనిషి తప్పు చేయకపోవచ్చు. కానీ ధర్మం ఉంటే ఎవరూ చూడకపోయినా, మనిషి తప్పు చేయడు. ఇదే అసలు సివిలైజేషన్. టెక్నాలజీ vs బుద్ధి ఈ రోజుల్లో: డిగ్రీలు ఉన్నాయి స్కిల్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది కానీ: గౌరవం తగ్గింది మహిళలపై దాడులు పెరిగాయి ప్రకృతి నాశనం అవుతోంది 2024కు సంబంధించి నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (NJDG) ప్రకారం భారత్‌లో మొత్తం దాదాపు 4.47–5.15 కోట్ల (447–515 లక్షల కేసులు) కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. NCRB డేటా ప్రకారం 2023లో భారతదేశంలో మొత్తం 62.4 లక్షల (6.24 మిలియన్) క్రైమ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి మరియు క్రైమ్ రేట్ 448.3 క్రైమ్ కేసులు ప్రతి 1 లక్ష జనాభాకు అని నివేదించారు ఎందుకు? బుద్ధి (wisdom) లేకపోవడం వల్ల టెక్నాలజీ మనకు శక్తి ఇస్తుంది కానీ ధర్మం మాత్రమే దానికి సరైన దిశ ఇస్తుంది శ్రీ రాముడు – ధర్మానికి ప్రతిరూపం శ్రీ రామచంద్ర ప్రభు కేవలం ఒక రాజు కాదు. ఆయన ధర్మాన్ని జీవించిన వ్యక్తి. ఆయనకు రాజ్యం ఉంది, శక్తి ఉంది. కానీ ఒక మాట కోసం అన్నిటినీ వదిలి వనవాసానికి వెళ్లారు. ఇది బలహీనత కాదు ఇది ధర్మంపై ఉన్న నిబద్ధత అందుకే ఆయన పాలనను “రామరాజ్యం” అంటారు. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం అంటే: న్యాయం సహజంగా జరుగుతుంది మహిళలు గౌరవింపబడతారు ప్రజలు చట్టాలు భయంతో కాదు, బాధ్యతతో జీవిస్తారు అక్కడ పోలీస్ అవసరం తక్కువ, ఎందుకంటే ప్రజలలో ధర్మం ఎక్కువ. భగవంతుడు లేకపోతే ఏమవుతుంది? భగవంతుడు అంటే కేవలం ఒక నమ్మకం కాదు— ఆయన ధర్మానికి మూలం “ఎవరో చూస్తున్నారు” అనే భావం లేకపోతే “నేను ఎందుకు తప్పు చేయకూడదు?” అనే ప్రశ్న వస్తుంది అప్పుడు: రాజకీయ నాయకులు తమ ఇష్టం ప్రకారం నడుస్తారు. అందుకే భారతదేశంలో క్రైమ్ చేసే రాజకీయ నాయకులు పార్లమెంట్ అసెంబ్లీ లో ఉన్నారు సమాజం క్రమంగా క్రైమ్ వైపు వెళ్తుంది విద్యార్థులు విలువలు కోల్పోతారు మహిళలపై నిర్లక్ష్యం పెరుగుతుంది. Election Commission Reports: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చిన డేటా ప్రకారం, 543 ఎంపీలలో 251 మందిపై (≈46%) క్రిమినల్ కేసులు పెండింగ్‌గా ఉన్నాయి. అందులో 170 మంది ఎంపీలపై “సీరియస్ క్రిమినల్ చార్జెస్” (హత్య, అటెంప్టెడ్ మర్డర్, కిడ్నాప్, క్రైమ్స్ ఏగైనిస్ట్ వుమెన్ మొదలైనవి; కనీసం 5 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష ఉండే ఆరోపణలు) ఉన్నాయి. తెలంగాణలో ఎంపీల్లో 71% మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్లు రిపోర్ట్ చేశారు. కేవలము సైన్స్ చదువుకుంటే పై సమస్యలు ఆపలేము అందుకే ధర్మం తోడు కావాలి. ఇవన్నీ జరుగుతున్నాయి, భక్తి అవసరం లేదు అన్న ప్రతి ఒక్కరికి పై వాటి దగ్గర సమాధానం ఉందా భక్తి లేని చివరికి: సమాజం బలహీనంగా మారుతుంది. 2024కు సంబంధించి అంచనాలు ప్రకారం క్రైమ్ రేట్ 445.9 క్రైమ్ కేసులు ప్రతి 1 లక్ష జనాభాకు ఉంది (అంటే 100,000 మందికి 445–446 కేసులు దీనికి నేటితరం నాస్తిక సమాజం ఏమి చెబుతుంది భగవంతుడు లేదన్న వ్యక్తులు ధర్మము భక్తి ఆచరిస్తే సహజంగా సంతోషంగా ఉంటుంది. భగవంతుడు లేడు అని చెప్పి విచ్చలవిడితనం పెంచుకొని చెడుకు బానిసలు ఇవ్వడం అతిపెద్ద సైన్స్ చదువులు అనుకుంటున్నారా? నిజమైన సైన్స్ భగవద్గీత : Bhagavad Gita లో ఒక స్పష్టమైన హెచ్చరిక ఉంది: “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి…” (4.7) ధర్మం తగ్గితే—అశాంతి పెరుగుతుంది భక్తి – అసలు పరిష్కారం భక్తి అంటే: కేవలం పూజా ఆచారాలు కాదు ఇది ఒక హరే కృష్ణ మహా మంత్రం జప సాధన ద్వారా వచ్చిన అంతర్గత మార్పు: ఇతరులను గౌరవించడం స్వార్థాన్ని తగ్గించడం బాధ్యతతో జీవించడం ఇది వచ్చినప్పుడు: సమాజం సహజంగా సరిగా నడుస్తుంది టెక్నాలజీ అవసరం ఉంది— కానీ అది సరిపోదు స్కిల్స్ ఉండాలి కానీ బుద్ధి కూడా ఉండాలి అభివృద్ధి ఉండాలి కానీ ధర్మంతో కలిసిన అభివృద్ధి కావాలి. ఒక చెడ్డ వ్యక్తి లీడర్ యొక్క అహంకారంతో యుద్ధాలు కూడా వస్తాయి అలాంటి సందర్భంలో మన వ్యక్తిగత చదువులు ఏమి పని చేయవు. అది సమాజంలో ధర్మం ఉందనుకోండి సరైన నాయకున్ని ఎంచుకుంటారు. అందుకే ధర్మంతో కూడిన చదువు చదివితేనే సరైన ప్రభుత్వం సరైన సమాధానం నిర్మించగలము. “ధర్మం లేకుండా టెక్నాలజీ ప్రమాదం… భగవంతుడు లేకుండా ధర్మం నిలవదు… అందుకే ధర్మం మరియు భగవంతుడు—సమాజానికి రెండు కళ్ళు.” శ్రీమద్ భాగవతం 9.10.50 శ్రీల ప్రభుపాద వారి భాష్యం : శ్రీ రామచంద్రుడు రాజ్యాన్ని స్వీకరించారు. ఆయన ప్రజలను తండ్రి తన పిల్లలను చూసుకునే విధంగా చూసుకున్నారు. ప్రజలు కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలలో నిమగ్నమై, ఆయనను తమ తండ్రిగా భావించారు. రాజు లేదా నాయకుడు ఒక రాజర్షి అయితే, ప్రజలతో ఆయనకు స్పష్టమైన సంబంధం ఉంటుంది. అప్పుడు సమాజంలో గందరగోళం ఉండదు, ఎందుకంటే దొంగలు తగ్గిపోతారు. కానీ కలియుగంలో వర్ణాశ్రమ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కువగా తప్పు మార్గంలో నడుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో, ఇలాంటి వారు ఒకరినొకరు ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందువల్ల ప్రభుత్వం గందరగోళంగా మారుతుంది, ఎవరూ సంతోషంగా ఉండరు. శ్రీమద్ భాగవతం 9.10.51 భాష్యం శ్రీల ప్రభుపాద నాలుగు యుగాలలో—సత్య, త్రేతా, ద్వాపర, కలి—ఇవన్నిటిలో కలియుగం అత్యంత దోషపూరితమైనది. కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు చేస్తే, ఈ కలియుగంలో కూడా సత్యయుగ స్థితిని తీసుకురాగలం. ఈ ఉద్దేశ్యంతోనే హరే కృష్ణ ఉద్యమం, లేదా కృష్ణ చైతన్య ఉద్యమం ఉంది. “కలేర్ దోషనిధే రాజన్ అస్తి హ్యేకో మహాన్ గుణః కీర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగః పరమ్ వ్రజేత్” (శ్రీమద్ భాగవతం 12.3.51) అర్థం: ఓ రాజా! కలియుగం అనేక దోషాలతో నిండిపోయినా, ఒక గొప్ప గుణం ఉంది—కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనిషి భౌతిక బంధనాల నుండి విముక్తి పొంది పరమ స్థితిని చేరుకోగలడు. ప్రజలు ఈ హరే కృష్ణ సంకీర్తన ఉద్యమాన్ని—“హరే కృష్ణ, హరే రామ” అని జపిస్తే—కలియుగపు కలుషిత ప్రభావాల నుండి తప్పక విముక్తి పొందుతారు. అప్పుడు ఈ యుగంలోని ప్రజలు కూడా సత్యయుగంలోని ప్రజలలా సంతోషంగా జీవించగలరు. ఎవరైనా, ఎక్కడైనా ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని సులభంగా ఆచరించవచ్చు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, నియమాలను పాటించడం, పాపాచారాల నుండి దూరంగా ఉండటం అవసరం. ఒకవేళ ఎవరికైనా పాపాచారాలను వెంటనే విడిచిపెట్టడం కష్టమైనా, వారు భక్తితో, విశ్వాసంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే—వారు నిశ్చయంగా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు, వారి జీవితం విజయవంతమవుతుంది. “పరం విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం” శ్రీ కృష్ణ సంకీర్తనం మహా విజయాన్ని అందిస్తుంది. ఇదే కలియుగంలో Lord Rama గారు గౌరసుందరునిగా అవతరించి ఇచ్చిన ఆశీర్వాదం “చట్టాలు మనిషిని భయపెడతాయి… కేవలం చదువులు సైన్స్ డబ్బులు ఇస్తాయి కానీ ధర్మం మనిషిని మార్చుతుంది… రామరాజ్యం రావాలంటే—మార్పు మనసులో మొదలవాలి. అది హరే కృష్ణ మహా మంత్రం జపం సాధనతో ప్రారంభమవుతుంది” ప్రతిరోజు భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్ తరగతులకు హాజరు కావాలంటే " 9121 585 375 " కు whatsapp మెసేజ్ చేయగలరు. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో భగవద్గీత చెప్పబడుతుంది భక్తులు ఈ అవకాశం ఉపయోగించుకోగలరు ఇట్లు మీ సేవకులు చైతన్య కృష్ణ దాస ©Jivjaago Media Director
కృష్ణ చైతన్యం 💓💖🙏
734 views
13 days ago
ఆర్టికల్ 🚨 “చట్టాలు, శిక్ష భయం ప్రజలని #🎉రామనవమి వేడుకలు😊 #📙ఆధ్యాత్మిక మాటలు #భగవద్గీత తప్పులు చేయకుండా సహజంగా, శాశ్వతంగా ఆపలేవు ధర్మమే ఆపుతుంది " మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి? కొంతమంది భగవంతుడు లేడు అని సగం సగం చదువుకొని కేవలం సైన్స్ తోనే సమస్యలు తీరిపోతాయని అనుకునే వారికి ఈ ఐదు ప్రశ్నలు రెండు రోజులు పోలీస్, కోర్ట్ లేకపోతే—మీ టెక్నాలజీ ప్రజలను తప్పు చేయకుండా భయంతో కాదు హృదయ పరివర్తనతో ఆపగలదా? తప్పు చేసిన తర్వాత శిక్ష ఇస్తారు—కానీ ముందు నుంచే తప్పు చేయకుండా ఆపేది మీ సిస్టమ్‌లో ఉందా? ఎవరూ చూడని చోట—మీ టెక్నాలజీ మనిషిని నిజాయితీగా ఉంచగలదా? డబ్బు, పవర్ ఉన్నవాడు దుర్వినియోగం చేయకుండా మీ చదువు ఎలా ఆపుతుంది? భయం లేకపోతే తప్పు చేయకుండా ఉండే మంచి మనసును మీ సైన్స్ ఇవ్వగలదా? నేటి చట్టాలు మరియు శ్రీరాముడు ధర్మం ఈ రోజుల్లో మనం ఒక పెద్ద మాయలో ఉన్నాం. టెక్నాలజీ ఉంది, విద్య ఉంది, స్కిల్స్ ఉన్నాయి కానీ ఒక ప్రశ్న అడగాలి: ఈ అభివృద్ధి మనిషిని మంచి మనిషిగా మార్చిందా? ఒక సమాజాన్ని నిలబెట్టేది కేవలం చట్టాలు కాదు, ధర్మం. చట్టం భయం వల్ల మనిషి తప్పు చేయకపోవచ్చు. కానీ ధర్మం ఉంటే ఎవరూ చూడకపోయినా, మనిషి తప్పు చేయడు. ఇదే అసలు సివిలైజేషన్. టెక్నాలజీ vs బుద్ధి ఈ రోజుల్లో: డిగ్రీలు ఉన్నాయి స్కిల్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది కానీ: గౌరవం తగ్గింది మహిళలపై దాడులు పెరిగాయి ప్రకృతి నాశనం అవుతోంది ఎందుకు? బుద్ధి (wisdom) లేకపోవడం వల్ల టెక్నాలజీ మనకు శక్తి ఇస్తుంది కానీ ధర్మం మాత్రమే దానికి సరైన దిశ ఇస్తుంది శ్రీ రాముడు – ధర్మానికి ప్రతిరూపం శ్రీ రామచంద్ర ప్రభు కేవలం ఒక రాజు కాదు. ఆయన ధర్మాన్ని జీవించిన వ్యక్తి. ఆయనకు రాజ్యం ఉంది, శక్తి ఉంది. కానీ ఒక మాట కోసం అన్నిటినీ వదిలి వనవాసానికి వెళ్లారు. ఇది బలహీనత కాదు ఇది ధర్మంపై ఉన్న నిబద్ధత అందుకే ఆయన పాలనను “రామరాజ్యం” అంటారు. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం అంటే: న్యాయం సహజంగా జరుగుతుంది మహిళలు గౌరవింపబడతారు ప్రజలు చట్టాలు భయంతో కాదు, బాధ్యతతో జీవిస్తారు అక్కడ పోలీస్ అవసరం తక్కువ, ఎందుకంటే ప్రజలలో ధర్మం ఎక్కువ. భగవంతుడు లేకపోతే ఏమవుతుంది? భగవంతుడు అంటే కేవలం ఒక నమ్మకం కాదు— ఆయన ధర్మానికి మూలం “ఎవరో చూస్తున్నారు” అనే భావం లేకపోతే “నేను ఎందుకు తప్పు చేయకూడదు?” అనే ప్రశ్న వస్తుంది అప్పుడు: రాజకీయ నాయకులు తమ ఇష్టం ప్రకారం నడుస్తారు. అందుకే భారతదేశంలో క్రైమ్ చేసే రాజకీయ నాయకులు పార్లమెంట్ అసెంబ్లీ లో ఉన్నారు సమాజం క్రమంగా క్రైమ్ వైపు వెళ్తుంది విద్యార్థులు విలువలు కోల్పోతారు మహిళలపై నిర్లక్ష్యం పెరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి, భక్తి అవసరం లేదు అన్న ప్రతి ఒక్కరికి పై వాటి దగ్గర సమాధానం ఉందా భక్తి లేని చివరికి: సమాజం బలహీనంగా మారుతుంది గీతా సత్యం Bhagavad Gita లో ఒక స్పష్టమైన హెచ్చరిక ఉంది: “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి…” (4.7) ధర్మం తగ్గితే—అశాంతి పెరుగుతుంది భక్తి – అసలు పరిష్కారం భక్తి అంటే: కేవలం పూజా ఆచారాలు కాదు ఇది ఒక హరే కృష్ణ మహా మంత్రం జప సాధన ద్వారా వచ్చిన అంతర్గత మార్పు: ఇతరులను గౌరవించడం స్వార్థాన్ని తగ్గించడం బాధ్యతతో జీవించడం ఇది వచ్చినప్పుడు: సమాజం సహజంగా సరిగా నడుస్తుంది టెక్నాలజీ అవసరం ఉంది— కానీ అది సరిపోదు స్కిల్స్ ఉండాలి కానీ బుద్ధి కూడా ఉండాలి అభివృద్ధి ఉండాలి కానీ ధర్మంతో కలిసిన అభివృద్ధి కావాలి “ధర్మం లేకుండా టెక్నాలజీ ప్రమాదం… భగవంతుడు లేకుండా ధర్మం నిలవదు… అందుకే ధర్మం మరియు భగవంతుడు—సమాజానికి రెండు కళ్ళు.” శ్రీమద్ భాగవతం 9.10.50 శ్రీల ప్రభుపాద వారి భాష్యం : శ్రీ రామచంద్రుడు రాజ్యాన్ని స్వీకరించారు. ఆయన ప్రజలను తండ్రి తన పిల్లలను చూసుకునే విధంగా చూసుకున్నారు. ప్రజలు కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలలో నిమగ్నమై, ఆయనను తమ తండ్రిగా భావించారు. రాజు లేదా నాయకుడు ఒక రాజర్షి అయితే, ప్రజలతో ఆయనకు స్పష్టమైన సంబంధం ఉంటుంది. అప్పుడు సమాజంలో గందరగోళం ఉండదు, ఎందుకంటే దొంగలు తగ్గిపోతారు. కానీ కలియుగంలో వర్ణాశ్రమ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కువగా తప్పు మార్గంలో నడుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో, ఇలాంటి వారు ఒకరినొకరు ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందువల్ల ప్రభుత్వం గందరగోళంగా మారుతుంది, ఎవరూ సంతోషంగా ఉండరు. శ్రీమద్ భాగవతం 9.10.51 భాష్యం శ్రీల ప్రభుపాద నాలుగు యుగాలలో—సత్య, త్రేతా, ద్వాపర, కలి—ఇవన్నిటిలో కలియుగం అత్యంత దోషపూరితమైనది. కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు చేస్తే, ఈ కలియుగంలో కూడా సత్యయుగ స్థితిని తీసుకురాగలం. ఈ ఉద్దేశ్యంతోనే హరే కృష్ణ ఉద్యమం, లేదా కృష్ణ చైతన్య ఉద్యమం ఉంది. “కలేర్ దోషనిధే రాజన్ అస్తి హ్యేకో మహాన్ గుణః కీర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగః పరమ్ వ్రజేత్” (శ్రీమద్ భాగవతం 12.3.51) అర్థం: ఓ రాజా! కలియుగం అనేక దోషాలతో నిండిపోయినా, ఒక గొప్ప గుణం ఉంది—కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనిషి భౌతిక బంధనాల నుండి విముక్తి పొంది పరమ స్థితిని చేరుకోగలడు. ప్రజలు ఈ హరే కృష్ణ సంకీర్తన ఉద్యమాన్ని—“హరే కృష్ణ, హరే రామ” అని జపిస్తే—కలియుగపు కలుషిత ప్రభావాల నుండి తప్పక విముక్తి పొందుతారు. అప్పుడు ఈ యుగంలోని ప్రజలు కూడా సత్యయుగంలోని ప్రజలలా సంతోషంగా జీవించగలరు. ఎవరైనా, ఎక్కడైనా ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని సులభంగా ఆచరించవచ్చు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, నియమాలను పాటించడం, పాపాచారాల నుండి దూరంగా ఉండటం అవసరం. ఒకవేళ ఎవరికైనా పాపాచారాలను వెంటనే విడిచిపెట్టడం కష్టమైనా, వారు భక్తితో, విశ్వాసంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే—వారు నిశ్చయంగా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు, వారి జీవితం విజయవంతమవుతుంది. “పరం విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం” శ్రీ కృష్ణ సంకీర్తనం మహా విజయాన్ని అందిస్తుంది. ఇదే కలియుగంలో Lord Rama గారు గౌరసుందరునిగా అవతరించి ఇచ్చిన ఆశీర్వాదం “చట్టాలు మనిషిని భయపెడతాయి… కేవలం చదువులు సైన్స్ డబ్బులు ఇస్తాయి కానీ ధర్మం మనిషిని మార్చుతుంది… రామరాజ్యం రావాలంటే—మార్పు మనసులో మొదలవాలి. అది హరే కృష్ణ మహా మంత్రం జపం సాధనతో ప్రారంభమవుతుంది” ప్రతిరోజు భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్ తరగతులకు హాజరు కావాలంటే " 9121 585 375 " కు whatsapp మెసేజ్ చేయగలరు. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో భగవద్గీత చెప్పబడుతుంది భక్తులు ఈ అవకాశం ఉపయోగించుకోగలరు ఇట్లు మీ సేవకులు చైతన్య కృష్ణ దాస ©Jivjaago Media Director
కృష్ణ చైతన్యం 💓💖🙏
1.2K views
16 days ago
హరే కృష్ణ ప్రియ భక్తులారా, #🙏🏻కృష్ణుడి భజనలు #🛕అయోధ్య రామ మందిరం🙏 No Class Today ⭕ 🔔🔔🔔🔔 *ఈ రోజు కొన్ని ముఖ్యమైన సేవలు ఉన్న కారణంగా ఈ రోజు క్లాస్ ఉండదు.* 🔔🔔 దయచేసి ఈ సమయాన్ని హరే కృష్ణ మహామంత్ర జపం చేయడానికి మరియు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడానికి ఉపయోగించండి. *గురు మరియు కృష్ణుని కృపతో తదుపరి రోజున మామూలుగా క్లాస్ కొనసాగుతుంది.* మీ సహకారానికి ధన్యవాదాలు. హరే కృష్ణ. ©Chaitanya Krishna Dasa
కృష్ణ చైతన్యం 💓💖🙏
768 views
18 days ago
ఆర్టికల్ 🚨 “మాంసం తినొద్దు అంటారు… సరే #📙ఆధ్యాత్మిక మాటలు #భగవద్గీత , మొక్కలు కూడా జీవులే కదా? అది కూడా హింస కాదా?” ఆర్టికల్ 🚨 “మాంసం తినొద్దు అంటారు… సరే, మొక్కలు కూడా జీవులే కదా? అది కూడా హింస కాదా?” ఈ ప్రశ్నకు సమాధానం భావంతో కాదు… తర్కంతో, శాస్త్రంతో, విజ్ఞానంతో అర్థం చేసుకోవాలి. హింస తప్పదు కానీ తగ్గించాలి ఈ ప్రపంచంలో: నీటిలో సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా, వైరస్‌లు) ఉంటాయి మన శరీరంలో కూడా లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి జీవించడం అంటేనే కొంతమేర జీవహింస జరుగుతుంది కాబట్టి ప్రశ్న: “హింస ఉందా?” కాదు “ఎంత హింస? అవసరమా? నియంత్రితమా?” అన్నది ముఖ్యం ఇది తర్కబద్ధ జీవన విధానం ఉపన్యాసం (BG 13.22–24 మెల్బోర్న్, జూన్ 25, 1974) శ్రీల ప్రభుపాదులు: “ఇతరులు కూరగాయలు తింటున్నారు, అది కూడా హింసే. అవును, అది కూడా పాపమే. అది నేను ఇప్పటికే వివరించాను ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అని. అంటే మీరు మీ కుటుంబ సభ్యులను లేదా ఏ మనిషినైనా తినాలి అన్నమాట కాదు. లేదు, అక్కడ తప్పకుండా వివేకం (భేదజ్ఞానం) ఉండాలి.” భగవంతుడు ఏమి తినమన్నాడు? Bhagavad-gītā As It Is 9.26 “పత్రం పుష్పం ఫలం తోయం… భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను” ఇది ఒక దివ్య ఆహార నియమం ఆకు పువ్వు పండు నీరు మాంసం లేదు ఇది ఎందుకు? ఎందుకంటే ఇవి సాత్త్విక, శరీరానికి అనుకూలమైన, తక్కువ హింసతో లభ్యమయ్యే పదార్థాలు భగవద్గీత 3.13 పై వ్యాఖ్యానం శ్రీల ప్రభుపాదులు: భగవద్గీతలో చెప్పబడింది ‘యే పచంతి ఆత్మకారణాత్’ ఎవరైనా తమ కోసమే వండుకొని తింటే, వారు పాపమే తింటున్నారు. అది మాంసం అయినా, కూరగాయలు అయినా తేడా లేదు. వెజిటేరియన్లు పాపం చేయరు, మాంసాహారులు పాపం చేస్తారు అలా కాదు. ఎవరైనా కృష్ణుని కోసం వండకుండా తింటే, వారు పాపమే తింటున్నారు.” విజ్ఞానం ఏమి చెబుతుంది? ఇక్కడ ముఖ్యమైన తేడా: మొక్కలు మొక్కలలో కేంద్ర నాడీ వ్యవస్థ లేదు మెదడు లేదు నొప్పిని గ్రహించే నాడీ సంకేత వ్యవస్థ లేదు అవి కేవలం రసాయనిక ప్రతిస్పందన ద్వారా స్పందిస్తాయి జంతువులు సంపూర్ణ నాడీ వ్యవస్థ (మెదడు, నరాలు) ఉంది నొప్పిని స్పష్టంగా అనుభవిస్తాయి భయం, బాధ, ఆందోళన అనుభవిస్తాయి చంపేటప్పుడు: అధిక స్థాయి ఒత్తిడి హార్మోన్లు (కోర్టిసోల్, అడ్రినలిన్) విడుదల అవుతాయి ఇవి రక్తంలో వ్యాపించి, మాంసంలో నిలుస్తాయి మనం అది తింటే: శరీరంలో దాహం, ఆందోళన, హార్మోన్ అసమతుల్యత పెరుగుతుంది గుండె వ్యాధులు, క్యాన్సర్, మెటబాలిజం సమస్యలు పెరుగుతున్నాయి అని పరిశోధనలు చెబుతున్నాయి ఇది కేవలం ధర్మం కాదు — జీవశాస్త్రం (బయాలజీ) కర్మ లాజిక్ (తర్కంతో) ఒక సింపుల్ లాజిక్: ఎక్కువ చైతన్యం ఉన్న జీవిని హింసిస్తే → ఎక్కువ ప్రభావం తక్కువ చైతన్యం ఉన్న జీవిని తీసుకుంటే → తక్కువ ప్రభావం జంతువు: “నన్ను చంపొద్దు” అని ప్రయత్నిస్తుంది భయం, బాధ స్పష్టంగా చూపిస్తుంది అంటే అది అధిక స్థాయి అనుభవం (conscious suffering) మొక్క: కేవలం జీవక్రియ స్థాయిలో స్పందిస్తుంది బాధ అనుభవం లేదు అందుకే కర్మ కూడా తక్కువ భగవద్గీత 9.26 పై వ్యాఖ్యానం శ్రీల ప్రభుపాదులు: “కృష్ణుడు చెబుతున్నాడు — ‘పత్రం పుష్పం ఫలం తోయం’ ఆకు, పువ్వు, పండు, నీరు — ఇవి భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను. కాబట్టి మేము ఈ వర్గానికి చెందిన పదార్థాలను కృష్ణునికి సమర్పిస్తాము — పండ్లు, పూలు, ధాన్యాలు, పాలు — తర్వాత మేము వాటిని స్వీకరిస్తాము.” అసలు తత్త్వం (విజ్ఞానం + భక్తి) మనము తినడానికి కాదు… శుద్ధి చేసి, సమర్పించి, ప్రసాదంగా స్వీకరించాలి ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్ర ప్రక్రియ ఆహారం → సమర్పణ → ప్రసాదం ప్రసాదం → మనసు శుద్ధి → చైతన్యం పెరుగుతుంది “మన ఇష్టం కాదు… నియమం ముఖ్యం భగవంతుడు అనుమతించిన ఆహారమే శ్రేయస్సుకు దారి తీస్తుంది” అందువల్ల ప్రభువులారా… ఈ విషయాన్ని మూడు కోణాల్లో చూడాలి: జీవశాస్త్రం (Biology) జంతువులు → నొప్పి, హార్మోన్లు మొక్కలు → తక్కువ స్పందన నైతికత (Ethics) అవసరం లేని హింస → తప్పు అవసరమైన నియంత్రిత జీవనం → సరి ఆధ్యాత్మిక శాస్త్రం (Spiritual Science) భగవంతుని ఆజ్ఞ → సాత్త్విక ఆహారం “తక్కువ హింస, ఎక్కువ శుద్ధి, దివ్య సమర్పణ — ఇదే నిజమైన ఆహార విధానం” ప్రభు… ఇప్పుడు ఇది: సాయంత్ర దర్శనం (న్యూయార్క్, జూలై 11, 1976) శ్రీల ప్రభుపాదులు: “మేము నేరుగా ఏమీ చేయము. మేము కృష్ణ ప్రసాదమే తీసుకుంటాము. కృష్ణుడు చెబుతున్నాడు — ‘ఇవి నాకు సమర్పించండి’ అంటే కూరగాయలు, పండ్లు, పూలు, ధాన్యాలు. మేము వాటిని సమర్పించి, తర్వాత తీసుకుంటాము. అందులో ఏదైనా పాపం ఉంటే అది కృష్ణునిదే, నా దే కాదు.” _____ ప్రతిరోజు భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్ తరగతులకు హాజరు కావాలంటే " 9121 585 375 " కు whatsapp మెసేజ్ చేయగలరు. ఇట్లు మీ సేవకులు చైతన్య కృష్ణ దాస ©Jivjaago Media Director