ఫాలో అవ్వండి
కృష్ణ చైతన్యం 💓💖🙏
@scsreddy4440
200
పోస్ట్
13,682
ఫాలోవర్స్
కృష్ణ చైతన్యం 💓💖🙏
595 వీక్షించారు
ఆర్టికల్ 🚨 ఒకే పరిస్థితి ఎదురైనా, ఒక్కొక్కరు #భగవద్గీత #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻కృష్ణుడి భజనలు ఒక్కొక్క విధంగా ఎందుకు స్పందిస్తారు? చైతన్యం స్థాయిలు – పరిస్థితుల ప్రభావం కాదు, కృష్ణచైతన్యం ప్రభావం ఈ ప్రపంచంలో మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒకే పరిస్థితి ఎదురైనా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. వారి జీవితం వారి చైతన్యం స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ చైతన్యం → పరిస్థితులకు బానిస మాధ్యమిక చైతన్యం → పరిస్థితులను తట్టుకోగలదు ఉన్నత చైతన్యం → పరిస్థితులను మార్చగలదు ఎందుకంటే స్పందనను నిర్ణయించేది పరిస్థితి కాదు… మనలో ఉన్న చైతన్యం స్థాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నారు: భగవద్గీత 3.27 ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః మన చర్యల వెనుక ప్రకృతి గుణాల ప్రభావం ఉంటుంది. జీవుడు తన స్థితిని బట్టి స్పందిస్తాడు. మూడు రకాల చైతన్య స్థితులు 1) తక్కువ చైతన్య స్థితి – పరిస్థితుల చేత నడిపించబడటం తక్కువ చైతన్యంగా ఉన్న వ్యక్తి… పరిస్థితులు చూసి వెంటనే ప్రభావం చెందుతాడు కోపం, భయం, లోభం, కామం వేగంగా పెరుగుతాయి తనపై నియంత్రణ తగ్గిపోతుంది ఉదాహరణ: ఒక అందమైన స్త్రీ/ పురుషుడుని చూసినప్పుడు తక్కువ చైతన్య వ్యక్తి వెంటనే చెడు భావాలవైపు లాగబడతాడు. ఇది తమోగుణ–రజోగుణ ప్రభావం. జీవితంలో చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించుకొని భయపడతారు భగవద్గీత 2.62 ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే విషయాలను ధ్యానం చేస్తే ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తి నుండి కోరిక, ఆ తర్వాత పతనం. 2) మాధ్యమిక చైతన్య స్థితి – పరిస్థితులకు లోబడకపోవడం మధ్య స్థితిలో ఉన్న వ్యక్తి… పరిస్థితులను చూస్తాడు కానీ ఆందోళన చెందడు వివేకంతో ఆలోచిస్తాడు శాస్త్రం తెలుసుకున్నవాడు కావడంతో నియంత్రణ పెరుగుతుంది భగవద్గీత 6.35 అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే మనస్సు సాధనతో, వైరాగ్యంతో నియంత్రించవచ్చు. 3) ఉన్నత చైతన్య స్థితి – పరిస్థితులను శుద్ధి చేయగలగడం ఇది నిజమైన కృష్ణ చైతన్యం. ఈ స్థితిలో ఉన్న భక్తుడు… పరిస్థితులపై ఆధారపడడు చెడు భావాలు వచ్చినా వెంటనే భగవంతుని స్మరణతో నాశనం చేస్తాడు. ఎక్కువగా హరేకృష్ణ మహా మంత్రం జపం చేస్తారు. సమాజానికి మార్గదర్శకుడవుతాడు అందమైన వ్యక్తిని చూసినా ఆత్మదృష్టితో చూస్తాడు: “ఇది శరీరం కాదు, ఇది ఆత్మ.” భగవద్గీత 5.18 పండితాః సమదర్శినః జ్ఞానులు అందరినీ సమదృష్టితో చూస్తారు. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే భావోద్వేగం కాదు. భక్తి అంటే శాస్త్ర ఆధారంగా చేసే సాధన. భగవంతుడిని మనం డైరెక్ట్‌గా అర్థం చేసుకోలేం… కాని సాధన ద్వారా వచ్చే కృష్ణ చైతన్యంతో తెలుసుకోగలం. భగవద్గీత 18.55 భక్త్యా మాం అభిజానాతి భక్తి ద్వారా మాత్రమే కృష్ణుడు నిజంగా అర్థమవుతాడు. హరే కృష్ణ మహామంత్రం – చైతన్యం శుద్ధి చేసే శాస్త్రీయ మార్గం శ్రీల ప్రభుపాద : భాగవత ప్రకాశము పుస్తకం -2 చాప్టర్ ప్రతి యుగానికి వేర్వేరు యజ్ఞాలు శాస్త్రాలలో నిర్దేశించబడ్డాయి.మరియు ఈ ఇనుప యుగమైన కలియుగంలో, ప్రజల మనస్సును ప్రకాశింపజేసే, వారిని భగవద్భావంలో స్థాపించే యజ్ఞమే సిఫార్సు చేయబడింది. ఈ యజ్ఞ ప్రక్రియనే సంకీర్తన యజ్ఞం అంటారు— అంటే మనుషులలో నశించిన ఆధ్యాత్మిక చైతన్యాన్ని తిరిగి ప్రేరేపించే మహోన్నత ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఆధ్యాత్మిక గానం, నృత్యం మరియు ప్రసాద సేవ ద్వారా ప్రారంభించిన వెంటనే, ప్రజలు సహజంగానే వినయవంతులుగా, నిజాయితీగలవారుగా మారిపోతారు హరే కృష్ణ మంత్రం మనలోని… కామాన్ని నియంత్రిస్తుంది మనస్సును శాంతిగా చేస్తుంది చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది భగవద్గీత 9.14 సతతం కీర్తయంతో మాం భక్తులు ఎల్లప్పుడూ కీర్తన చేస్తూ ముందుకు సాగుతారు. సమాజంలో ఉపయోగం ఈ రోజు ప్రపంచంలో… addictions anger depression broken relationships ఎందుకు పెరుగుతున్నాయి? చైతన్యం తక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి పరిష్కారం: శాస్త్రం సాధన భక్తుల సాంగత్యం హరే కృష్ణ జపం ఇవి చైతన్యాన్ని పెంచుతాయి. మనుషులందరూ ఒకటే కాదు. కృష్ణచైతన్యం అనేది జీవితం యొక్క అసలైన పరిష్కారం. హరే కృష్ణ మహామంత్రం మన నిజమైన చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 ప్రతిరోజు భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్ తరగతులకు హాజరు కావాలంటే " 9121 585 375 " కు whatsapp మెసేజ్ చేయగలరు. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో భగవద్గీత చెప్పబడుతుంది భక్తులు ఈ అవకాశం ఉపయోగించుకోగలరు ఇట్లు మీ సేవకులు చైతన్య కృష్ణ దాస ©Jivjaago Media Director
కృష్ణ చైతన్యం 💓💖🙏
1.1K వీక్షించారు
మధ్వనవమి : భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం. దానిని ప్రవచించినవారు శ్రీమధ్వాచార్యులు. వాయుదేవుడే మధ్వాచార్యునిగా జన్మించాడని నమ్ముతారు. ఉడుపి పట్టణానికి సుమారు ఇరవై మైళ్ల దూరంలో పాజక క్షేత్రం ఉంది. అక్కడ నివసించే మధ్యగేహభట్టు, వేదవతి దంపతులకు ఆంగ్లశకం 1238లో వాసుదేవుడనే పేరుతో మధ్వాచార్యులు జన్మించారు. చిన్నతనంలోనే ఎన్నో మహిమలను చూపి అందరినీ అబ్బురపరిచారు. 32 సలక్షణాలతో, నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించే వాడు. ఎనిమిదో ఏట సన్యాసాశ్రమం స్వీకరించారు. ద్వైతమతాన్ని ఉద్ధరించారు. శ్రీహరియే సర్వోత్తముడని ప్రతిపాదించారు. ముప్పై ఏడు గ్రంథాలు రచించారు. భగవద్గీత, ఉపనిషత్తులపై ద్వైతసిద్ధాంతానికి అనుగుణంగా వ్యాఖ్యలు రచించారు. బ్రహ్మ సూత్రాలపై నాలుగు వ్యాఖ్యానాలు అందించారు. భారత, భాగవతాలకు, భగవద్గీతకు తాత్పర్య నిర్ణయం వెలువరించారు. తంత్రసారాన్ని, ఆగమ విధానాలను నిర్ణయిస్తూ ప్రమాణ లక్షణాలనే పేరుతో గ్రంథాలను విరచించారు. ఆధ్యాత్మిక ప్రగతికి, నైతిక ప్రవర్తనకు భక్తిమార్గమే శరణ్యమని బోధించారు. జంతుబలుల్ని నిషేధించారు. దాస సాహిత్యాన్ని విశేష ప్రాచుర్యంలోకి తెచ్చారు. తుది ఘడియల్ని కూడా ఉడుపి అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూనే గడిపారు. ఆరోజు మాఘశుద్ధ నవమి. ఆ పవిత్ర సమయంలో సకల దేవతా సమూహం పుష్పవృష్టి కురిపిస్తుండగా భక్తులందరి సమక్షంలోనే సశరీరంగా అంతర్థానమయ్యారు. దానినే మాధ్వులు మధ్వనవమిగా జరుపుకుంటారు. ఉడుపి అనంతేశ్వరాలయంలో మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మధ్వ నవమి వరకూ 9 రోజులపాటు విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. నవమినాడు పర్యాయ పీఠాధిపతితో పాటు మిగిలిన ఎనిమిది మంది పీఠాధిపతులూ సంస్థానంలో భక్తిశ్రద్దలతో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుమధ్వవిజయం పారాయణ చేస్తారు. మరికొందరు సర్వమత గ్రంథాలనూ పారాయణ చేస్తారు. మంత్రాలయం ఆలయ ప్రాంగణంలో మధ్వాచార్యుల గ్రంథాలను, వారి చిత్రపఠాన్ని స్వర్ణరథంలో ఉంచి వైభవోపేతంగా రథయాత్ర నిర్వహిస్తారు. #🙏🏻కృష్ణుడి భజనలు #భగవద్గీత
కృష్ణ చైతన్యం 💓💖🙏
680 వీక్షించారు
Hare Krishna Prabhu dandvat pranam 🙏 Date 27th Tuesday January 2026 Topic ; నిత్యానంద ప్రభవు కృప ద్వారా మనలో భక్తిని బలపరిచే విధానం speaker ; Chaitanya Krishna Prabhu కలియుగంలో భగవంతుడి సిస్టం – గౌర నిత్యానంద తత్త్వం 1 . ఈ రోజుల్లో చాలా మంది వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, భగవద్గీత, పురాణాలు చదవడం లేదు. అందుకే కలియుగంలో నిజమైన తత్త్వం ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు. వాయు పురాణంలో చెప్పినట్లుగా బలరాముడే నిత్యానంద రాముడు. కానీ పురాణాలు చదవని కారణంగా ఈ సత్యం సామాన్యులకు తెలియకుండా పోయింది. 2 . భగవంతుడు అంటే ఎవరు? దేవాది దేవుడు అంటే ఏమిటి? భగవంతుడి సిస్టం ప్రిన్సిపల్స్ ఎలా పనిచేస్తాయి? ఏ శాస్త్రంలో ఎవరు ఏమి చెప్పారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఒకటి రెండు క్లాసులు వింటే సరిపోదు. సాధన అవసరం. నిరంతర ఎంక్వయిరీ అవసరం. జీవిత లక్ష్యం అంటే – ఏది సత్యం? ఏది అసత్యం? అని వెతుకుతూనే ఉండడం. 3 . భక్తి అంటే అక్కడే ఆగిపోవడం కాదు. భక్తి అంటే సత్యం దొరికే వరకూ వెతుకుతూనే ఉండడం.నిత్యానందంగా, నిరంతరం ఆనందంగా ఉండే స్థితిని చేరుకోవడమే భక్తి లక్ష్యం.మనము ఉన్న ప్లేస్ కరెక్టా? మనం జీవిస్తున్న జీవితం కరెక్టా?దీనికి ఒకే ఒక్క ప్రమాణం ఉంది –ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 24 గంటలు నిత్యానందంగా ఉన్నామా?అలా ఉంటే మనం కరెక్ట్ ప్లేస్‌లో ఉన్నాం.అలా లేకపోతే – ఎంత ప్రయత్నించినా ఆనందం రాకపోతే – ఎక్కడో తప్పు ఉంది అని అర్థం. 4 . నిత్యానందం మన నిజమైన ఆస్తి.ధనం ఉన్నవాడు ధనవంతుడు కాదు – ధర్మం ఉన్నవాడే ధనవంతుడు.భక్తులకు నిజమైన సంపద నిత్యానందమే. ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు ఎలా ఒకరిపై ఒకరు ఆధారపడి ప్రేమతో జీవిస్తారో, అలాగే భగవంతుడితో కూడా మనకు మోహం ఉండాలి. ఇది భౌతిక మోహం కాదు – ఆధ్యాత్మిక మోహం. ఆధ్యాత్మిక జీవితం అంటే భౌతిక మొహాన్ని ఆధ్యాత్మిక మోహo గా స్పిరిచ్లైట్ చేయడం అప్పుడే భగవంతుడితో నిజమైన సంబంధం ఏర్పడుతుంది. 5 . కలియుగంలో ఈ ఆధ్యాత్మిక మోహాన్ని కలిగించడానికి గౌర నిత్యానందులు అవతరించారు.భౌతిక మోహాన్ని ఆధ్యాత్మిక మోహంగా మార్చడానికే వారి అవతారం.నిత్యానంద ప్రభువు బలరాముడి అవతారం. ఆయన ఆదిగురు. అందుకే ఆయనను సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటారు. సేవించబడేవాడు → సేవ్యక్ భగవాన్ (శ్రీకృష్ణుడు) సేవ చేసే అత్యుత్తముడు → సేవక భగవాన్ (గురువు / నిత్యానందుడు) నిత్యానంద ప్రభువు కృష్ణ ప్రేమ అనే రిజర్వాయర్‌ను పగలగొట్టి, ఎలాంటి తపస్సులు చేయకుండానే ప్రజలకు సులభంగా ప్రేమభక్తిని ఇచ్చారు. 6 . కృష్ణ ప్రేమ ఒక రిజర్వాయర్ లాంటిది.ఆ రిజర్వాయర్‌ను పగలగొట్టి, కోట్ల జన్మల తపస్సు చేయాల్సిన అవసరం లేకుండా, సాధారణ ప్రజలకూ కృష్ణ ప్రేమను సులభంగా అందించినవారు నిత్యానంద ప్రభువు.నిత్యానంద ప్రభువు ఏకచక్రధామంలో అవతరించారు.తండ్రి: అఘాయిపండిత తల్లి: పద్మావతి దేవి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు భీష్ముని చంపడానికి విసిరిన చక్రం పడిన స్థలమే ఏకచక్రధామo అక్కడే నిత్యానంద ప్రభువు అవతారం తీసుకున్నారు. బాల్యంనుంచి ఆయన ఎన్నో లీలలు చేశారు. 7 . హనుమంతుడి పాత్రలు, రామాయణ లీలలు, కృష్ణ లీలలు – ఇవన్నీ సహజంగా ఆయనలో ప్రదర్శించేవి.ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే భగవంతుని శక్తి వ్యక్తమయ్యేది.అప్పటి ధర్మం ప్రకారం ఒక సన్యాసి వచ్చి “మీ అబ్బాయిని మాకు ఇవ్వండి” అని అడిగితే, తల్లిదండ్రులు కన్నీళ్లతో అయినా ఇచ్చేవారు. అలా నిత్యానంద ప్రభువు సన్యాస మార్గంలోకి వచ్చారు.కాశీ, రామేశ్వరం, బృందావనం ప్రయాణాల్లో మాధవేంద్రపురిని కలుస్తారు. అక్కడి నుంచే గౌరవ వైష్ణవ సంప్రదాయం విస్తరించింది.చైతన్య మహాప్రభువుకి 20 సంవత్సరాలు, నిత్యానంద ప్రభువుకి 32 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి కలయిక జరిగింది. 8 . కృష్ణుడు కలియుగంలో నామరూపంలో అవతరించాడు అని యోగమాయ ద్వారా తెలుసుకుని, ఒకే రోజులో నిత్యానంద ప్రభువు నవద్వీపానికి చేరుకుంటారు.చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుకి తన షడ్బుజ రూపాన్ని చూపిస్తారు.కృష్ణ–రామ–సన్యాసి రూపాల సమ్మేళనం అది. 9 . సన్యాస దీక్ష సమయంలో నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభువు దండాన్ని విరుస్తారు –మీరు భగవంతుడు. మీకు ఈ దండం అవసరం లేదు” అని. ఆ తరువాత చైతన్య మహాప్రభువు ఆజ్ఞ ఇస్తారు:“ప్రతి ఇంటికి వెళ్లి – బోలో కృష్ణ, భోజో కృష్ణ, కోరో కృష్ణ శిక్ష” అని ప్రచారం చేయండి.హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభువు కలిసి ఇంటింటికి వెళ్లి హరినామ సంకీర్తన చేస్తారు. 10 .నిత్యానంద ప్రభవు చేసిన సంకీర్తన వలన జగాయి–మధాయి లాంటి మహా పాపులు కూడా మారిపోయారు.ఇది కలియుగ అవతారాల ప్రత్యేకత – ఒక్క రక్త బిందు కూడా పడకుండా రాక్షసులను మార్చడం.ఈ కలియుగంలో ఎనిమిదివందల కోట్ల జనాభాలో కోట్ల మంది బాధలో ఉన్నారు. నిజమైన ఆనందం లేదు. 11 . నిత్యానందప్రభువు కృప లభించినవార నిజంగా అదృష్టవంతులు. హరినామం లేకపోతే సమాజం ఎలా ఉంటుందో ఊహించండి –పోలీసులు, కోర్టులు, శిక్షలు… అయినా శాంతి ఉండదు.కానీ గౌర నిత్యానందుల కృపతో రక్తం లేకుండా, ఆయుధం లేకుండా, నామంతోనే ప్రపంచాన్ని మార్చే శక్తి వచ్చింది. అదే కలియుగ ధర్మం.అదే నిజమైన భక్తి.అదే నిత్యానంద మార్గం. 12 . నిత్యానంద మహాప్రభువు అనగా నియమాలు–నిబంధనలు లెక్కచేయని కృప యొక్క అవతారం. ఆయన బలరామ స్వరూపుడు. బలరాముడు అంటే భక్తిని కల్టివేట్ చేసే నాగలి. నాగలి నేలని చీల్చినట్టు, నిత్యానంద ప్రభువు మన హృదయాన్ని చీల్చి అందులో భక్తి బీజాన్ని నాటుతారు. అందుకే ఆయన మార్గం Beyond rules and conditions – Mercy alone. 13 . ఒకసారి నిత్యానంద ప్రభువును ఎవరో అడిగారు – “ప్రభూ, మీకు కదంబ పుష్పాలు కావాలంటారు కానీ మా ఇంట్లో లేవు.” అప్పుడు ఆయన చిరునవ్వుతో అన్నారు –నిమ్మకాయ చెట్లు ఉన్నాయా? అవే చాలు. అవే కదంబ పుష్పాలైపోతాయి.”ఇది లీల కాదు – ఇది తత్వం. 14 . భగవంతుడికి కావాల్సింది మన దగ్గర ఉన్న వస్తువు కాదు, మన దగ్గర ఉన్న శరణాగతి.బృందావనంలో అన్నీ కల్పవృక్షాలే. అక్కడ ఏది అడిగినా ఇస్తాయి నిత్యానంద ప్రభువుకు రాజు–పేద, కులం–వర్గం అనే భేదం లేదు. అందరికీ ఒకే ప్రసాదం. ఎందుకంటే ఆయన పతిత పావనుడు. మద్యం తాగేవాళ్లను కూడా శిక్షించలేదు – మోక్షాన్ని ఇచ్చారు. ఇంతటి కృప ఇంకెక్కడా కనిపించదు. అవధూత నుంచి గృహస్థుడు – దివ్య వివాహం 15 . నిత్యానంద ప్రభువు మొదట అవధూత శిరోమణిగా తిరిగారు. ఊరు ఊరుగా తిరుగుతూ నామ ప్రచారం చేశారు. ఆయనకు పెళ్లి అవసరం లేదు. కానీ గృహస్థులకి మార్గం చూపించాలి కాబట్టి పెళ్లి చేసుకున్నారు. చైతన్య మహాప్రభువు గృహస్థుడిగా ప్రారంభించి సన్యాసం తీసుకున్నారు.నిత్యానంద ప్రభువు సన్యాసిలా ఉండి కూడా గృహస్థుడయ్యారు.ఇది లోకానికి ఒక గొప్ప సందేశం: “16 . గృహస్థుడైనా భగవంతుడికి సంపూర్ణంగా అంకితమవచ్చు.”నిత్యానంద ప్రభువు లీలల ద్వారా ఒక గృహస్థుడు ఎలా జీవించాలి, ఎలా భక్తిని పెంచుకోవాలి, కుటుంబాన్ని భగవత్ సేవగా ఎలా మార్చుకోవాలి – అన్నది మనకు చూపించారు.నిత్యానందం అంటే ఏమిటి?నిత్యానందం అంటే – భగవంతుడి నుంచి ఆనందాన్ని తీసుకోవడం. 17 . ప్రభుపాదులు చెబుతారు: దీక్ష తీసుకున్నవాడు భగవంతుడి ఆనందాన్నే స్వీకరించాలి భగవంతుడు తినేది తినాలి.భగవంతుడు చూడాలనుకున్నదే చూడాలి.బయటి రాజకీయ వార్తలు, సినిమాలు, లోకిక సుఖాలు – ఇవన్నీ నిత్యానందం కాదు. 18 .ఎవరికి నిజంగా నిత్యానంద ప్రభువు కృప ఉంటుందో, వారు బయట ప్రపంచపు తాత్కాలిక ఆనందాల వైపు చూడరు.కృప లేకపోతే బలం లేదు నిత్యానంద ప్రభువు కృప ఉంటేనే భక్తిలో బలం వస్తుంది.ఆ కృప లేకపోతే జపం నిలబడదు, సాధన నిలబడదు.అందుకే ఏకాదశి రోజు ప్రత్యేకంగా“భక్తులు స్ట్రాంగ్ కావాలంటే ఏకాదశి జపం డీప్‌గా చేయాలి.” 19 .మన స్థితి ఏమిటి? నేను గొప్ప భక్తుడిని కాదు.నేను పెద్ద జీవుడిని కాదు. నేను అబద్ధ జీవులలో నెంబర్ వన్.”ఈ నిజాయితీనే శరణాగతి. ఈ భావంతో మనం ప్రార్థించాలి:ప్రభూ, మీ కృప ఉంటేనే నేను చైతన్య మహాప్రభు ఉద్యమానికి సేవ చేయగలను.” అనే భావంతోమూడు రోజులు –జపం చేస్తే గొప్ప మార్పు వస్తుంది. 20 . శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి:ఎవరైతే మూడు రోజులు నిజంగా హరినామ జపం చేస్తారో,ఏ అలవాటు నుంచైనా బయటపడగలరు. కలి యుగంలో శాస్త్రాలు చదవలేకపోయినా పరవాలేదు. అందరికీ కనీసం హరినామాన్ని ఇవ్వాలి.ఇదే సకల శాస్త్రాల సారం.హరినామమే జ్ఞానం. హరినామమే ధ్యానం. హరినామమే పోషణ.శాస్త్ర ప్రమాణం లేకపోతే మోసం 21 . ఈ రోజుల్లో చాలా మంది ప్రవచనకర్తలు తమను తామే గురువులమని అనుకుంటున్నారు .గురు పరంపర లేదు. సాంప్రదాయం లేదు.శాస్త్ర ప్రమాణం లేకుండా మాట్లాడుతున్నారు.ఒక డాక్టర్ మెడికల్ బుక్ ప్రకారం ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ చచ్చిపోతాడు.అలాగే ప్రవచనకర్తలు శాస్త్రాలను as it is చెప్పకపోతే – ప్రజలు భ్రమలో పడతారు. 22 . దేవాది దేవుడు ఎవరు? ఆది పురుషుడు ఎవరు?ఇది కరెక్ట్‌గా చెప్పకపోతే – అది మోసం.ఈ విధంగా సనాతన ధర్మాన్ని రాబందుల్లా ముక్కలు చేస్తున్నారు.దాన్ని కాపాడేది ఒక్కటే – నామ సంకీర్తన. 23 . నిత్యానంద ప్రభువు అవతారం అంటే –నియమాల కంటే కృప గొప్పదని చెప్పే అవతారం.పాపిని చూసి శిక్షించని, శరణాగతిని చూసి కౌగిలించుకునే అవతారం.ఈ నిత్యానంద ప్రభువు ఆవిర్భావ దినం సందర్భంగా మనం ఒక్కటే ప్రార్థించాలి:“ప్రభూ,మీ కృపలో ఒక చిన్న భాగం నాకు ఇవ్వండి.మీ కృపతోనే నేను బ్రతకాలనుకుంటున్నాను.హరినామంలో నిలబడే బలం ఇవ్వండి.” 24 . ఈ సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడతారు దీనిని కాపాడకపోతే ప్రజలు పూర్తిగా మోసపోతారు అందుకనే మనం అందరికీ హరినామాన్ని ఇవ్వాలి సకల వేదాల శాస్త్రాల సారమే హరినామం శాస్త్రాలన్నీ చదవకపోయినా అట్లీస్ట్ హరినామం చేస్తే చాలు హరినామం వింటే చాలు ఈ నామమే మనకి ధ్యానం జ్ఞానం పోషణ అన్ని ఇస్తుంది ఇది సకల శాస్త్రాల వేదాల సారం. #📙ఆధ్యాత్మిక మాటలు #భగవద్గీత #🙏🏻కృష్ణుడి భజనలు
కృష్ణ చైతన్యం 💓💖🙏
647 వీక్షించారు
*ఆర్టికల్ 🚨 “శ్రీకృష్ణుడే దేవాది దేవుడు (Supreme God)” — శాస్త్ర నిర్ణయం.* శ్రీకృష్ణుడే దేవాది దేవుడు (Bhagavad-gītā & Śāstra Combined Logical Article) *మెడికల్ బుక్ చదవకుండా “అన్ని మందులు ఒకటే” అంటే* ఆ వ్యక్తి బుద్ధిమంతుడా? అలాగే — శాస్త్రాలు చదవకుండా “అన్ని దేవుళ్లు ఒకటే” అంటే అది శాస్త్ర సారమా? కాదు. శాస్త్రం చదివితే — సమన్వయం తెలుస్తుంది చదవకపోతే — సమానత్వం భ్రమగా మారుతుంది భగవంతుడు ఒక్కరే – మూలకారణ సత్యం భగవంతుడు ఎవరు అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడు స్వయంగా సమాధానం ఇస్తాడు. భగవద్గీత 7.7 మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ నన్ను మించిన సత్యం మరొకటి లేదు. భగవద్గీత 10.8 అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే నేనే సమస్తానికి మూలకారణం. అన్నీ నన్నుంచే ఉద్భవిస్తాయి. నిర్ణయం: దేవాది దేవుడు అంటే — మూలకారణమైన భగవంతుడు అది శ్రీకృష్ణుడు దేవతలు ఎవరు? (మూలం కాదు – నియమిత అధికారులు) దేవతలను గౌరవించాలి. కానీ వారిని మూలంగా భావించకూడదు. భగవద్గీత 10.2 న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః దేవతలకైనా, మహర్షులకైనా నా మూలం పూర్తిగా తెలియదు. భగవద్గీత 9.10 మయాధ్యక్షేణ ప్రకృతిః సూతే సచరాచరం ప్రకృతి నా ఆధీనంలో పనిచేస్తుంది. లాజిక్: విభాగ అధికారి ≠ కంపెనీ యజమాని దేవతలు = విభాగ అధికారులు కృష్ణుడు = మూల యజమాని “అన్ని దేవుళ్లు ఒకటే” — శాస్త్రం ఏమంటుంది? భగవద్గీత స్పష్టంగా తేడా చెబుతుంది. భగవద్గీత 7.20 కోరికలతో ఉన్నవారు దేవతలను ఆశ్రయిస్తారు. భగవద్గీత 7.23 దేవతల ద్వారా వచ్చే ఫలితాలు తాత్కాలికం. భగవద్గీత 9.25 యాంతి దేవవ్రతా దేవాన్ … మద్యాజినోఽపి మామ్ దేవతలను పూజించినవారు దేవతల లోకానికి నన్ను పూజించినవారు నాతోనే ఉంటారు. నిర్ణయం: అన్ని పూజలు ఒకటే కావు. గమ్యం వేరు – ఫలితం వేరు. భగవంతుడిని దేవతలతో సమానం చేయవచ్చా? శివుడు పార్వతి తో చెప్పారు : పద్మపురాణం – ఉత్తరకాండ 235.11 యస్తు నారాయణం దేవం బ్రహ్మ-రుద్రాది-దైవతైః సమత్వేనైవ వీక్షేత నారాయణుని బ్రహ్మ, రుద్రులతో సమానంగా చూడడం శాస్త్ర విరుద్ధం. ఇది దేవతల అవమానం కాదు. ఇది తత్వ భేదం. 5️⃣ గుణాలు & పురాణాలు — ఎందుకు వేర్వేరు? 📖 పద్మపురాణం – ఉత్తరకాండ 236.18–20 పరమ శివుడు చెప్పారు : సత్వగుణ పురాణాలు → విష్ణు / కృష్ణ తత్వం → మోక్షం రజోగుణ పురాణాలు → లౌకిక ఫలితాలు తమోగుణ పురాణాలు → గుణోన్నతి (తమ → రజ) 🔑 లాజిక్: ఒకే మందు అందరికీ కాదు. రోగం బట్టి డోస్ మారుతుంది. 6️⃣ పరమ శివుడు ఏమంటాడు? (అత్యంత కీలకం) శ్రీమద్భాగవతం 4.24.28 (రుద్రగీత) వాసుదేవుడికి శరణాగతి చెందిన భక్తుడే నాకు (శివుడికి) అత్యంత ప్రియుడు. శివ భక్తి చివరికి కృష్ణ భక్తికే తీసుకెళ్తుంది. భక్తి లక్ష్యం ఏమిటి? (Not Puja for Desires) భగవద్గీత 7.19 “వాసుదేవుడే అన్నీ” అని తెలిసిన జ్ఞాని శరణాగతి చెందుతాడు. భగవద్గీత 18.66 నన్నే శరణు పొందు — నేను విముక్తిని ఇస్తాను. దేవత పూజ = అవసరాలు కృష్ణ భక్తి = జన్మమరణ విముక్తి దేవతలు గౌరవనీయులు కానీ మూలం కాదు మూలం శ్రీకృష్ణుడు మాత్రమే Krishna is not one of the gods Krishna is the source of all gods భగవద్గీత 7.7 + 10.8 + 10.2 + 9.25 — అన్నీ కలిపి చెప్పేది ఒక్కటే: శ్రీకృష్ణుడే దేవాది దేవుడు ఇది వాదం కాదు.ఇది భగవద్గీత శాస్త్ర నిర్ణయం. చివరిగా పరమశివుడు మాటలతో : శంకర ఉవాచ కృష్ణ కృష్ణ జగన్నాథ జానే త్వాం పురుషోత్తమమ్ । పరేశం పరమాత్మానం అనాదినిధనం పరమ్ ॥ త్వమేవ జగతాం స్రష్టా ధాతా హర్తా జగద్గురుః । త్వమేవ చిదచిద్వస్తు రూపం బ్రహ్మ సురేశ్వరః ॥ త్వమాదిస్త్వమనాదిస్త్వమీశ్వరః శేష ఏవ చ । త్వం మహత్త్వం పరంబ్రహ్మ ప్రత్యగాత్మా త్వమేవ హి ॥ ఓ కృష్ణా! ఓ జగన్నాథా! నీవే పురుషోత్తముడవని నేను స్పష్టంగా తెలుసుకున్నాను. నీవే సర్వేశ్వరుడు, నీవే పరమాత్మ, ఆది లేని వాడవు, అంతం లేని వాడవు. ఈ సమస్త జగత్తుకు సృష్టికర్త, పోషకుడు, లయకర్త నీవే. నీవే ఈ జగత్తుకు గురువు. చేతనమైనదైనా, అచేతనమైనదైనా — అన్ని తత్త్వాల మూలరూపం నీవే. నీవే బ్రహ్మ, నీవే దేవతలందరికీ అధిపతి. నీవే ఆదివి, నీవే అనాది, నీవే పరమ నియంత్రకుడు. నీవే పరబ్రహ్మ, నీవే అంతర్యామి పరమాత్మ — ఇదే నా నిశ్చయం. శివుడే కృష్ణుని పరమేశ్వరుడిగా అంగీకరిస్తే, ఆ సత్యం వేదాంతంలో తుది నిర్ణయం. పద్మ పురాణం ఉత్తర ఖండం (Uttara-khaṇḍa) అధ్యాయం 250 శ్లోకాలు: 41, 44–45 సందర్భం: శివుడు – శ్రీకృష్ణుని మధ్య సంభాషణ ____'______"" ప్రతిరోజు భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్ తరగతులకు హాజరు కావాలంటే " 9121 585 375 " కు whatsapp మెసేజ్ చేయగలరు. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో భగవద్గీత చెప్పబడుతుంది భక్తులు ఈ అవకాశం ఉపయోగించుకోగలరు ఇట్లు మీ సేవకులు చైతన్య కృష్ణ దాస ©Jivjaago Media Director Speaker✒️📜 : Chaitanya Krishna Dasa #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🛕శివాలయ దర్శనం *Please Attend Without Fail.....✒️*
See other profiles for amazing content