ఫాలో అవ్వండి
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
3,089
పోస్ట్
13,913
ఫాలోవర్స్
Sekhar Digitals - 9603197203
882 వీక్షించారు
2 గంటల క్రితం
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం *అమలాపురం, ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నకళ్ళకు అధిక రుసుము వసూళ్లు...* *పట్టించుకోని ఉన్నతాధికారులు....* ఒకవైపు అవినీతిమయంగా మారుతున్న చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్న సరే అమలాపురం, *ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మార్పు కానరావడం లేదు.* నకళ్ళకు ప్రభుత్వం నిర్ధారించిన రేట్లు కన్నా అధిక రుసుము వసూలు చేస్తున్నారు. దస్తావేజు నకలు, ఈసీ, మ్యుటేషన్ తదితర *నకలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.* ఇదేమి దారుణమని అడుగుతుంటే నకళ్ళు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో బాధితులు జిల్లా సబ్ రిజిస్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సరే చర్యలు తీసుకోలేదు. దాంతో విసుగు చెందిన బి వెంకటేశ్వరరావు సోమవారం జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals - 9603197203
442 వీక్షించారు
2 గంటల క్రితం
#🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ *బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..* వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం. *నేడు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం.* 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం.. తుఫాన్‌గా మారాక సెన్‌యార్‌గా నామకరణం.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals - 9603197203
9.3K వీక్షించారు
1 రోజుల క్రితం
#💬నవంబర్ 23rd ముఖ్యాంశాలు🗞️ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 *_పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!_* _50% మించకుండా అమలు.. రొటేషన్ విధానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కోటా_ _2011 జనగణన, 2024 కులగణన_ _డేటాను ఆధారంగా చేసుకోవాలి_ _పంచాయతీరాజ్ శాఖ_ _గైడ్లైన్స్.._ జీవో 46 విడుదల _వార్డు రిజర్వేషన్ల బాధ్యత_ _ఎంపీడీవోలకు, సర్పంచ్ రిజర్వేషన్ల_ _బాధ్యత ఆర్డీవోలకు అప్పగింత_ _హైదరాబాద్: గ్రామ_ పంచాయతీ _ఎన్నికల్లో ఈసారి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు_ _అమలుకానున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్శాఖ స్పష్టంచేసింది._ _రిజర్వేషన్ల ఖరారు కోసం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం 'జీవో నం. 46' ద్వారా సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది._ _సుప్రీంకోర్టు తీర్పు, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు తగ్గట్టు రూపొందించిన ఈ గైడ్లైన్స్ ఆధారంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన జీవో నంబర్ 42ను రద్దు చేసింది. కొత్తగా ఇచ్చిన జీవో 46 ప్రకారం.. ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించరాదు._ _సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం.. బీసీలకు 'కులగణన సర్వే-2024' ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. వార్డు మెంబర్ల విషయంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల కోసం 'కులగణన (ఎస్ఈఈఈపీసీ) సర్వే-2024' జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలి._ _ప్రతి కేటగిరీలో (ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్) సగం సీట్లు మహిళలకు కేటాయించాలి. గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ అయిన వార్డులు లేదా పంచాయతీలు.. ఈ సారి సాధ్యమైనంత వరకు మహిళలకు కేటాయించరాదు. ఈ నాలుగు వర్గాలకు 50 శాతం పరిమితిలోపు రిజర్వేషన్లు పోగా.. మిగిలిన స్థానాలన్నీ జనరల్ స్థానాలుగా ప్రకటించనున్నారు._ *_సర్పంచ్లకు ఆర్డీవోలు.. వార్డులకు ఎంపీడీవోలు.._* _సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారుచేసే బాధ్యతలను ఆర్డీవోలకు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేయనున్నారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో (ఏజెన్సీ) మాత్రం నిబంధనలు భిన్నంగా ఉంటాయి.100 శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్తో పాటు వార్డులన్నీ ఎస్టీలకే రిజర్వ్ కానున్నాయి. అక్కడ ఇతర సామాజిక వర్గాలకు పోటీ చేసే అవకాశం లేదు. మొదట జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు (ఎస్టీ, ఎస్సీ, బీసీ) రిజర్వేషన్లు కేటాయించి, వాటిని అవరోహణ క్రమంలో లిస్ట్ తయారు చేస్తారు._ _గతంలో రిజర్వ్ అయిన సీట్లను తీసేసి, మిగిలిన వాటిలో అత్యధిక జనాభా ఉన్నవాటికి రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లను అన్-రిజర్వ్డ్ కింద ప్రకటిస్తారు. చివరిగా లాటరీ ద్వారా మహిళా కోటాను ఫిక్స్ చేస్తారు. కాగా, వివిధ కారణాల వల్ల 2019 ఎన్నికల్లో అమలుకాలేని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించవచ్చు. అంతేకాదు, 2019 తర్వాత కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు, వార్డులకు మాత్రం ఇవే ఫస్ట్ ఎలక్షన్స్ కింద లెక్కలోకి తీసుకుంటారు._ *_ఓటరు జాబితాలు రెడీ_* _గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. గతంలో ప్రచురించిన జాబితాలోని లోపాలను ఎన్నికల సంఘం సూచన మేరకు సరిదిద్దారు. ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు వంటి వాటిని సరిచేశారు. శనివారం ఓటరు జాబితా సవరణపై వచ్చిన అభ్యంతరాలను డీపీఓలు పరిష్కరించారు. ఈ మేరకు వార్డుల వారీగా మార్పులతో కూడిన ఫైనల్ ఫొటో ఓటర్ల జాబితా రెడీ చేశారు. ఆదివారం గ్రామాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేశారు._ *_రేపటిలోగా గెజిట్లు పంపించాలి_* _జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల గెజిట్ కాపీలను వెంటనే తమకు సమర్పించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన శనివారం మెమో జారీ చేశారు. జీవో ఎంఎస్ నంబర్ 46 ప్రకారం ఖరారు చేసిన రిజర్వేషన్ల జిల్లా గెజిట్ కాపీలను (ఇంక్ సైన్ చేసినవి) మూడు సెట్ల చొప్పున సిద్ధం చేయాలని ఆదేశించారు. స్కాన్ చేసిన కాపీలను పెన్ డ్రైవ్‌లో వేసుకుని హైదరాబాద్ రావాలని సూచించారు. సోమవారం ఉదయం 10 గంటల కల్లా ఖైరతాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో వీటిని అందజేయాలని స్పష్టం చేశారు._ _ఇప్పటికే ప్రక్రియ పూర్తయిన జిల్లాలవారు 23వ తేదీనే సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఆయా జిల్లాల పంచాయతీ ఆఫీసర్లు (డీపీఓలు) స్వయంగా వచ్చి ఈ కాపీలను అందజేయాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, జిల్లాల నుంచి వచ్చిన గెజిట్లను పరిశీలించడంతోపాటు వాటిని తీసుకోవడానికి పీఆర్ కమిషనరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు._ *_1,12,474 పోలింగ్ స్టేషన్లు_* _రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 12,733 గ్రామపంచాయతీలు,1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,12,474 పోలింగ్ స్టేషన్లు, 15,522 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం గ్రామీణ ఓటర్లు 16,703,173 ఓటర్ల ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు81,65,899 మంది, మహిళా ఓటర్లు 85,36, 770 మంది ఉండగా.. ఇతరులు 504 మంది ఓటర్లు ఉన్నారు._ *_జీవో 46 విశేషాలు.._* _ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు._ _సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం.. బీసీలకు 'కులగణన సర్వే-2024' ప్రకారం కేటాయించాలి._ _వార్డు మెంబర్ రిజర్వేషన్లకు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కులగణన సర్వే-2024 ను ప్రామాణికంగా తీసుకోవాలి._ _ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా_ _రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో_ _అమలు చేయాలి. గతంలో వచ్చిన_ _రిజర్వేషన్లు ఈసారి కేటాయించరాదు._ _ప్రతి కేటగిరీలో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్) సగం సీట్లు మహిళలకు కేటాయించాలి._ _మహిళా రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేయాలి._ _100 శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ తో పాటు వార్డులన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయాలి._ _మొదట జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించి, అవరోహణ క్రమంలో పంచాయతీల లిస్ట్ తయారు చేయాలి. అందులోంచి గతంలో రిజర్వ్ అయిన స్థానాలను తీసేసి, మిగిలిన వాటితో లిస్టు తయారు చేయాలి._ _చివరిగా లాటరీ ద్వారా మహిళా కోటాను ఫిక్స్ చేయాలి._
Sekhar Digitals - 9603197203
507 వీక్షించారు
1 రోజుల క్రితం
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం *ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు..* ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేస్తే.. *మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది.* ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals - 9603197203
564 వీక్షించారు
1 రోజుల క్రితం
#భక్తి #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *వాడపల్లి ఆలయ ప్రవేశ మార్గంలో వ్యాపారుల వీరంగం* *అడిగిన భక్తులపై దురుసు ప్రవర్తనతో కలకలం* కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తుల రద్దీతో రోజురోజుకు కిక్కిరిసిపోతుంది. దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో వారం చివరల్లో అయితే భక్తుల రద్దీ తిరుమల నడకదారులను తలపిస్తుంది. గోదావరి జిల్లాలకు, ముఖ్యంగా కోనసీమ ప్రాంతానికి గౌరవ మర్యాదలు ప్రత్యేక గుర్తింపు. అయితే ఇదే నేలలో కొంతమంది వ్యాపారుల దురుసు ప్రవర్తన భక్తులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. పార్కింగ్ స్థలం నుంచి ఆలయ మాడవీధి వరకు వెళ్లే ప్రధాన ప్రవేశ మార్గం మొత్తం మొబైల్ కూల్‌డ్రింక్ వాహనాల ఆక్రమణకు గురై భక్తుల రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది. మధ్యాహ్న సమయంలో భోజనాల కోసం క్యూలైన్లు, తిరుగుతున్న భక్తులు అంతా ఒకే చోట గుంపుకి గురవ్వడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. *"మేము వేలంలో లక్షలు పెట్టాము… మీరు ఎవరు అడగటానికి?"* శనివారం గూడూరు నుంచి వచ్చిన మహిళా భక్తులు మార్గం ఖాళీ చేయాలని మొబైల్ కూల్‌డ్రింక్ వ్యాపారులను కోరగా, వారు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, “మేము లక్షలు పెట్టి వేలంలో ఈ స్థలం తీసుకున్నాం. మేము ఇక్కడే ఉంటాం… మీరు వస్తారు, పోతారు… మమ్మల్ని అడగడానికి మీరెవరండి? ఏమైనా ఉంటే అధికారులను అడిగండీ!” అంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణి చూసి భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతలో సంఘటితాన్ని చిత్రీకరిస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు వ్యాపారి ప్రయత్నించడం అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా మారిందో స్పష్టంగా తెలిపింది. భక్తులతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఇటువంటి వ్యాపారుల వల్ల ఆలయ ప్రతిష్టే దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకోవాలంటూ భక్తుల డిమాండ్ ఆత్మీయతతో చూసుకోవాల్సిన దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి మీద ఇలాంటి ప్రవర్తన అనవసర ఉద్రిక్తతలకు దారి తీస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఆలయ అధికారులు, సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని ఆలయ ప్రధాన ప్రవేశ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని వారు కోరుతున్నారు. అలాగే వేలం ద్వారా వ్యాపారం చేసే వారికి ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసి, భక్తులతో ఎలా ప్రవర్తించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెబుతున్నారు. భక్తి, భద్రత, గౌరవం—మూడు కాపాడితేనే వాడపల్లి క్షేత్రం మహిమాన్వితం అవుతుందని భక్తుల అభిప్రాయం. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals - 9603197203
528 వీక్షించారు
2 రోజుల క్రితం
#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ *తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ..* ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం.. *వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సన్నాహాలు..* ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals - 9603197203
446 వీక్షించారు
2 రోజుల క్రితం
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 *ఏపీలో టెన్త్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌!* అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్‌, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2), ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
See other profiles for amazing content