మహనీయులు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
684 వీక్షించారు
26 రోజుల క్రితం
ఆయనను అందరూ "అప్పా" అని పిలుస్తారు. ఆయన అసలు పేరు? KP రామస్వామి. కోయంబత్తూరులోని KPR మిల్లుల యజమాని. వృత్తిరీత్యా వస్త్ర పరిశ్రమ దిగ్గజం. కానీ, ఆయన ఎంచుకున్నది మాత్రం తండ్రి పాత్ర. కార్పొరేట్ పెద్దలు ఉద్యోగుల శ్రమను దోచుకొంటారు, ఖర్చు తగ్గించుకొంటారు, లాభాల గురించి మాత్రమే చూలుకొంటారు అని అనుకొంటాం. ఈ వ్యక్తి మాత్రం జీవితాలను మార్చడంలో నిమగ్నమయ్యారు. ఎలాగంటారా? మిల్లు కార్మికులను గ్రాడ్యుయేట్లుగా మార్చడం ద్వారా. విద్యను వారి మెరుగైన జీవితానికి పునాదిగా మార్చడం ద్వారా. ఇదంతా ఒక చిన్న అభ్యర్థనతో మొదలైంది. ఒకసారి ఆయన మిల్లులోని ఒక యువతి "అప్పా (అంటే నాన్న), నాకు చదువంటే ఇష్టం. కానీ పేదరికం కారణంగా నా తల్లిదండ్రులు నన్ను పాఠశాల నుండి మాన్పించి ఇక్కడికి పంపారు. కానీ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను." అని చెప్పింది. ఆ పిలుపు, ఆ ఒక్క వాక్యం ఆయన్ని మార్చేసింది. తన కార్మికులకు కేవలం జీతం ఇవ్వడంతో పాటు, వారికి భవిష్యత్తును ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. మిల్లు లోపలే పూర్తి స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 8 గంటల షిఫ్ట్ తర్వాత 4 గంటల తరగతులు. తరగతి గదులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, యోగా కోర్సు కూడా. అన్నిటికీ పూర్తిగా నిధులు సమకూర్చబడ్డాయి. ఎలాంటి షరతులు లేవు. మరి ఫలితం? 24,536 మంది మహిళలు 10వ, 12వ, UG మరియు PG డిగ్రీలు పొందారు. చాలా మంది ఇప్పుడు నర్సులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులుగా ఉన్నారు. ఈ సంవత్సరం తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుండి 20 మంది గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఒక వ్యాపారవేత్త ఉద్యోగుల నిష్క్రమణ గురించి ఆందోళన చెందుతారని మీరు ఊహించవచ్చు. ఈ మహిళలు వెళ్లిపోతే ఏమిటి? కార్మికులు తరచూ మిల్లు వీడి వెళ్లిపోతే ఎలా అని. KP రామస్వామి గారు ఏమి చెబుతారంటే.. "నేను వారి సామర్థ్యాన్ని వృథా చేస్తూ మిల్లులోనే ఉంచాలనుకోవడం లేదు. వారు ఇక్కడకు ఎంచుకుని రాలేదు, పేదరికం కారణంగా వచ్చారు. వారికి భవిష్యత్తును ఇవ్వడం నా పని, ఇది పంజరం కాదు అని. ఆయన ఖచ్చితంగా అదే చేస్తున్నారు.... వారు వెళ్లిపోతారు. కెరీర్లు నిర్మించుకుంటారు. ఆ తర్వాత? వారి గ్రామాల నుండి మరింతమంది అమ్మాయిలను మిల్లుకు పంపుతారు. ఈ చక్రం కొనసాగుతుంది. ఇది కేవలం CSR కార్యక్రమం కాదు. ఇది నిజమైన అర్థంలో మానవ వనరుల అభివృద్ధి. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో 350 మంది మహిళలు తమ డిగ్రీలు అందుకున్నారు. KP రామస్వామి గారు ఒక అసాధారణ అభ్యర్థన చేశారు. మీరు లేదా మీ స్నేహితులు వారిని నియమించుకోగలిగితే, ఇతర అమ్మాయిలకు మరింత చదువుకోవడానికి ఆశ కలుగుతుంది అని. ఒకసారి ఆలోచించండి. కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఒక వ్యక్తి వ్యాపారం గురించి అడగడం లేదు. తన కార్మికుల కోసం ఉద్యోగాలు అడుగుతున్నారు. ఇలాంటివి మనం చాలా అరుదుగా చూస్తాము. ఈ కథ కేవలం KPR మిల్లుల గురించి మాత్రమే కాదు. ఇది నాయకత్వం, కార్పొరేట్ నీతి, దేశ నిర్మాణంలో ఒక పాఠం. #💗నా మనస్సు లోని మాట #motivational #మహానుభావులు #mahanubhavulu #endharo mahanubhavulu
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
900 వీక్షించారు
1 నెలల క్రితం
పద్మశ్రీ మంగళా కపూర్. "మీరు నా ముఖాన్ని, నా శరీరాన్ని కాల్చవచ్చు. నన్ను బాధపెట్టవచ్చు. కానీ మీరు నా ధైర్యాన్ని నా నుండి తీసివేయలేరు. నా స్వంత బలం ధైర్యం మీకు భయంగా మరియు నా విజయానికి మార్గంగా మారుతుంది." ఇదే ఆత్మ విశ్వాసంతో ఇదే అభిరుచితో, యాసిడ్‌తో ముఖం కాలిపోయిన కాశీకి చెందిన 12 ఏళ్ల బాలిక ముందుకు సాగింది. ఆమె తన ముఖానికి 37 కి పైగా ఆపరేషన్లు చేయించుకోవలసి వచ్చింది. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రజలు ఆమెను 'నక్కి' లాగా ఎగతాళి చేసేవారు. చుట్టూ జనం ఉన్నారు, కానీ ఆమె లోపల నుండి వచ్చే అరుపులు వినడానికి ఎవరూ రాలేరు. నేడు, అదే చిన్న అమ్మాయి చాలా మంది మహిళలకు ప్రేరణగా మారింది. విధి ఆమె ముందు ఒక భయంకరమైన పరీక్ష పెట్టింది. ఒక వైపు శరీరంపై గాయాలు… జీవితంపై సందేహాలు… కానీ ఆమె మనసులో మాత్రం ఒకే ప్రశ్న..! “ఇంతటితో నా కథ ఆగిపోవాలా?” అక్కడే పుట్టింది ఓ అసాధారణ సంకల్పం. ఆ బాధను సంగీతంగా మార్చుకున్న మహిళే ప్రొఫెసర్ మంగళ కపూర్ గారు. యాసిడ్‌ అటాక్‌ లాంటి దుర్ఘటనను జయించి, భారత శాస్త్రీయ సంగీతంలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తరతరాల విద్యార్థులకు సంగీతాన్ని మాత్రమే కాదు, జీవితం ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించారు. నేడు 2026లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అది కేవలం గౌరవం కాదు… ఓ మహిళ ధైర్యానికి, ఓ జీవన పోరాటానికి దక్కిన జాతీయ వందనం. అందంగా ఉండటమే కాదు… ధైర్యంగా నిలబడగలగటమే నిజమైన అందం. మంగళ కపూర్ గారు బాధను బలంగా మార్చుకున్న సజీవ ఉక్కు మహిళ. వీరిని ఎంత అభినందించినా తక్కువే.🙏🇮🇳💐💐👏👏 #endharo mahanubhavulu #mahanubhavulu #మహానుభావులు