నేటి ఈ సమాజం

💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
536 views
4 days ago
🇮🇳భారతదేశానికి దారి చూపి.., బలహీనులకు బలమిచ్చి..,బడుగులకు అవకాశాలిచ్చి..,సామాజిక అసమానతలను రూపుమాపేలా పునాదులు వేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబాసాహెబ్, డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 135 వ జయంతి నేడు.! 🇮🇳నీకోసం జీవిస్తే - నీలోనే నిలుచిపోతావు.,అదే జనం కోసం జీవిస్తే - జనం గుండెల్లో నిలిచిపోతావు..అనే ఈ మాటతోనే నాటి నుంచి నేటి వరకు., నేటి నుంచి రేపటి వరకు..! నా జీవితంలో నాకు ఉన్నంతలో కొంచెం నేను బ్రతుకుతూ, జీవిస్తూ..., మరికొంత చాటి మనిషి కష్టంలో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి (అది మాటే కావచ్చు, డబ్బు కావచ్చు లేదా మరోకటి కావచ్చు......ఏదైనా మనిషి అవసరాన్ని బట్టి) సహాయం చేస్తూ.., భారత ప్రజాక్షేత్రంలో నా వంతు బాధ్యతను కలిగి ఉండటానికి నాలాంటి వారి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన అప్రమేధవి బాబాసాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాను💐💐🙏🏻 #Ambedkar🙏🏻🇮🇳 #BRAmbedkar🙏🏻🇮🇳 #AmbedkarJayanthi🙏🏻🇮🇳 #BRAmbedkarJayanthi🙏🏻🇮🇳 #RajaBabuGarikina❤️🇮🇳 #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
583 views
15 days ago
✝️నేడు జీసస్ యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు...శిలువపై ప్రేమను చూపించిన రోజు..!చెడుపై గెలవాలంటే మంచే ఆయుధమని, శాంతి, సహనంతో మనిషి మనుగడ సాగాలనే యేసుక్రీస్తు బోధనలు సదా అనుసరణీయం.! ✝️యేసు క్రీస్తు మానవాళి కోసం ప్రాణ త్యాగానికి ప్రతిరూపమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా, ప్రేమ, క్షమా గుణాలతో జీవించాలన్న యేసు క్రీస్తు బోధనలను మననం చేసుకుందాం.!స్మరించుకుందాం.!!🤲🏻✝️ #JesusChrist🤲🏻✝️ #GoodFriday🤲🏻✝️ #JesusGoodFriday🤲🏻✝️ #RajaBabuGarikina❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
2.3K views
16 days ago
💥ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అజేయం.! 💥ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటం శుభపరిణామం. పార్లమెంట్ ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకొనే ఆనందకర తరుణం వచ్చింది. ఇకపై రాజధానిగా అమరావతి అజేయం. ఈ బిల్లుకు మద్దతు పలికిన పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే అనవసర అపోహలను రాష్ట్ర ప్రజలందరూ విడిచిపెట్టేయాలి. రాష్ట్రానికి రాజధాని నగరం ఉండటమే ఇష్టం లేని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజాలెవరూ పట్టించుకోవలసిన అవసరం లేదు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సదరు వ్యక్తుల నైజం మరోమారు బయటపడింది.! 💥అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పటికే వేగవంతం అయ్యాయి. ఈ రాజధానిని ప్రతి ఒక్కరూ తమదిగా భావించే విధంగా తీర్చిదిద్దే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ముందుకు తీసుకువెళ్లడంతోపాటు, రాజధాని నగర అభివృద్ధికి బలమైన తోడ్పాటు ఇస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ కేంద్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.! 💥పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం తరుణంలో రాష్ట్రంలో కూటమి పక్షాలు చేసే సంబరాల్లో భాగస్వాములు కావాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిస్తున్నాను. మన రాజధాని అమరావతి కోసం తోడ్పాటు ఇచ్చిన శ్రీ నరేంద్ర మోదీ గారికి, అపార అనుభవంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించాలని కోరుతున్నాను"!! ... ✍🏻ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.!! 💥#Raja Comment :1953లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన 'ఆంధ్ర రాష్ట్రం'.! 2026లో ఇప్పుడు, రాజధానికి చట్టబద్ధత పొందిన తొలి రాష్ట్రంగా చరిత్రపుటలలో నిలవనున్న 'ఆంధ్రప్రదేశ్'.!! #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️🙏🏻 #OneStateOneCapital❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
550 views
17 days ago
💥ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషిస్తున్న క్షణాలివి.! 💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు. వారంతా గర్వించే క్షణాలివి. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. లోక్ సభలో ఈ బిల్లుకు మద్దతు తెలియచేసిన పక్షాలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత బలమైన పాఠం నేర్పిస్తారు.! 💥ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ కేంద్ర హోంశాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవంతో., ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిబద్ధత, ఆలోచనలతో... అమరావతి ప్రజా రాజధానికి, భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది.!!❤️🙏🏻 #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️🙏🏻 #OneStateOneCapital❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
573 views
17 days ago
💥మన భారతదేశంలో 16వ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది.! మారుతున్న సామాజిక జీవనశైలిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఆధునిక సమాజంలో పెరుగుతున్న 'లివింగ్ రిలేషన్‌షిప్' (సహజీవనం) జంటలను కూడా ఇకపై ఒకే 'కుటుంబం'గా గుర్తించాలని నిర్ణయించింది. 2011 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న ఈ సర్వేలో, 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేశారు. రెండు దశల్లో సాగే ఈ ప్రక్రియలో, తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' సదుపాయాన్ని కూడా కల్పించారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి గృహ వివరాల సేకరణ చేపట్టనున్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. సంక్షేమ పథకాల రూపకల్పనకు, సామాజిక మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ గణన కీలక పాత్ర పోషించనుంది.!👌🏻🇮🇳 #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #JanaGanana❤️🙏🏻 #LiveInRelationship❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
870 views
21 days ago
💥ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే.! • మనసా వాచా కర్మణా మద్దతు.! • గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది.! • భూములు ఇచ్చిన రైతులను హింసించింది.! • రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం.! • రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు.! • మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి.! • రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.! • సరైన ప్రణాళిక లేకుండా విభజించారు.! • రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు.! • అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది.! • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.! 💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు.! ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి.! 💥తెలుగు నేల అనే భావనే ఉండేది:కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.! 💥భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు:2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.! 💥రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు:చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.! 💥మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి:భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.! 💥విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు:గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.! 💥ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను” అన్నారు.!!❤️🙏🏻 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️ #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
1.2K views
1 months ago
💥𝐏 𝐊 Two letters. INFINITE AURA 🔥🔥 💥In 2hrs 35 mins runtime, #PawanKalyan will be there nearly 2 hours. I made this film for Cult #PawanKalyan fans and everyone to enjoy it.!😍 💥#HarishShankar promise to fans at #AuraOfUstaad song launch #UstaadBhagatSingh second single #AuraOfUstaad out now ❤‍🔥 ▶️ youtu.be/BjB1MvWZn4s #UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.!🔥🔥 . . . #UstaadBhagatSingh❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #PawerStarPawanKalyan❤️🙏🏻 #UBSOnMarch26th❤️🙏🏻 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
635 views
2 months ago
🕉️HAPPY MAHA SHIVARATRI TO YOU AND YOUR FAMILY MEMBERS💐🔱🙏🏻 🕉️MAY LORD SHIVA GUIDE YOU TOWARDS THE PATH OF SUCCESS AND PEACE.!!💐🔱🙏🏻 🕉️ఓం నమః శివాయ🔱🙏🏻 . . . #OmNamahShivaya🔱🙏🏻 #MahaShivaratri🕉️🙏🏻 #HappyMahaShivaratri🕉️🙏🏻 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
850 views
3 months ago
💥PAWAN KALYAN WAS FELICITATED BY THE GOLDEN DRAGONS ORGANIZATION WITH THE DISTINGUISHED TITLE "TIGER OF MARTIAL ARTS"🐅🥋🗡️ 💥అత్యంత అరుదైన ఘనత సాధించిన జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.!❤️👌🏻🙏🏻🇮🇳 💥మూడు దశాబ్దాలకు పైగా సాగిన కఠిన సాధనకు గుర్తింపుగా జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో ప్రతిష్ఠాత్మకమైన ..‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం అందుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! 💥డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' బిరుదుతో సత్కరించిన గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ.! 💥పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం.! 💥జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ గారు.! 💥మార్షల్ ఆర్ట్స్ – ఒక మనిషిని ఆయుధంగా కాదు, ఆదర్శంగా మార్చే కళ."దాదాపు మూడు దశాబ్దాల క్రితం, దిశలేని యువతలా ఓ 20 ఏళ్ల కుర్రాడు…నిరాశ, అసహనం మధ్య తన జీవితానికి అర్థం వెతుక్కుంటూ నిలబడ్డాడు.అప్పుడే మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గమయ్యింది.మార్షల్ ఆర్ట్స్ అంటే ఇతరులను ఓడించడం కాదు — మన అహాన్ని జయించడం.మన ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం. ఒంటరితనాన్ని, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవడం.! 💥ఆ శిక్షణే కళ్యాణ్ కుమార్‌ను – మన పవన్ కళ్యాణ్‌గా మార్చింది. సినిమాల్లోని ఫైట్స్‌లో కనిపించిన నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మార్షల్ ఆర్ట్స్‌ను కోట్ల మందికి చేరువ చేసింది.నిరంతరం నేర్చుకోవడమే మార్షల్ ఆర్ట్స్ తత్వం.అందుకే ఈరోజుకీ ఓ విద్యార్థిలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.! 💥తన తపనకు గుర్తింపుగా🗓 డిసెంబర్ 30, 2025 న గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా“టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే అపూర్వ గౌరవం లభించింది.ఇక్కడ “టైగర్” అంటే హింస కాదు — హింసను అదుపులో ఉంచే బలం.ఆయన నమ్మకం ఒక్కటే: దేశ సంపద అంటే నదులు, ఖనిజాలు మాత్రమే కాదు… కలలతో, క్రమశిక్షణతో ఎదిగే యువత.దృఢమైన శరీరం, చురుకైన బుద్ధి, బలమైన వ్యక్తిత్వాలతో భారత యువతను ముందుకు నడిపించడమే లక్ష్యం.!! 💥పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు.! 💥మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్, ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.! 💥సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే మరియు సంబంధిత యుద్ధకళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్, చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి, సాంకేతికంగా మరియు తాత్వికంగా బలమైన పునాది ఏర్పరుచుకున్నారు. కాలక్రమేణా, శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి, అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు.! 💥మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ, వాటికి విస్తృత గుర్తింపు మరియు ప్రజాదరణ తీసుకొచ్చారు.! 💥మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన నిరంతర, దీర్ఘకాలిక అంకితభావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు, పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన 'సోగో బుడో కన్‌రి కై' నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. అలాగే, జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'లోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం. అంతేకాకుండా, గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదుతో సత్కారం కూడా జరిగింది.! 💥అధునాతన శిక్షణలో భాగంగా, భారతదేశంలో జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'కెండో'లో సమగ్ర శిక్షణ పొంది, ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం మరియు లోతైన తాత్విక అవగాహనను సంపాదించారు.! 💥ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యుద్ధకళ సాధకులు, అభిమానుల దృష్టిలో కెంజుట్సులో పవన్ కళ్యాణ్ ప్రవేశం అనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు.. క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం. ఈ విలువలు మార్షల్ ఆర్ట్స్‌కు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాలకు కూడా లోతుగా అనుసంధానమై ఉన్నాయి.! 💥#Raja Comment : ​మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను సాధించడం మన రాష్ట్రానికే గర్వకారణం.పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు' లో అధికారికంగా ప్రవేశం పొందిన వారి జిజ్ఞాస, నేర్చుకోవాలనే తపన నిజంగా అభినందనీయం.! 💥​శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మనందరికీ తెలుసు సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో ‘పవర్ స్టార్’గా ఎదిగి, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.! 💥రాజకీయాల్లో పారదర్శకత, నిబద్ధతతో ప్రజల ఆదరణను చూరగొన్నారు.సినీ ప్రవేశానికి ముందే మార్షల్ ఆర్ట్స్‌లో వారు సాధించిన నైపుణ్యం విశేషమైనది. ఇప్పుడు ఈ వయసులో కూడా కొత్త విద్యను నేర్చుకోవాలనే వారి తపన స్ఫూర్తిదాయకం.! 💥​ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవన్ కళ్యాణ్ గారి ఆరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తి.! 💥​సామాజిక బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నిరంతరం శ్రమిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.!!❤️🙏🏻 💐💐BIG BIG CONGRATULATIONS AP DEPUTY CM SHRI. KONIDELA PAWAN KALYAN SIR💐💐 #PKMartialArtsJourney❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్