dosha pariharalu

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
823 views
1 months ago
""నరదృష్టి - నివారణ మార్గాలు"" ................!! గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి.....! 'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది' అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్రలేవగానే గానీ, ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీమహావిష్ణు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు. మీరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్ల తాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క, మెడలో తావీజు... పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు, దిష్టి తగిలిన వాళ్లు ఇబ్బందిపడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు. హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం, కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటివి చేస్తారు. గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి........? దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి, వ్యాపారల మీద, పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారం.. వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది. శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గానీ, గోమయంతో గానీ దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాలపై భాగాన కానీ, పూజాస్థలంలో గానీ గుమ్మడి పైభాగంలో కొంతభాగంగా కోసి, అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది. ఇలా టెంకాయతో గానీ, మన్ను, ఉప్పు. మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగులకొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు. ఇంకా చెప్పాలంటే.. ప్రతిరోజూ సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్ళు చల్లి, ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాకా, ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారవృద్ధి కలుగుతుంది. ఇంకా నరా దిష్టి కి నర నర శ్రీ యంత్రం మంచిది మా వద్ద దొరుకుతుంది కేవలం పూజ తో కలిపి 1000 రూపాయలు మాత్రమే క్రింద నెంబర్ లో సంప్రదించండి బాల గ్రహ దోషముల నివారణకు..... పిల్లలకు దిష్టి తీసే సమయంలో, పళ్లెంలో నీళ్లు పోసి, అందులో కుంకుమ వేసి, మరొక పళ్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి, దిష్టి తీసి, ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి. ఇలా చేస్తే బాల గ్రహ దోషములు పోవును. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #dosha pariharalu #Kanti Drishti #drishti
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
727 views
3 months ago
మీరు, మీ ఇల్లు కూడా..చూసే వారికి లక్ష్మీ కళా కాంతులతో కనబడుట కొరకు..........!! ఎవరైతే కటిక దరిద్రముతో అన్నవస్త్రాలకు కరువై జీవించే కుటుంబీకుల వారి ఇంటిలోని వారు ఎవరైనా ఇల్లాలు లేదా ఇంట్లోని వారెవరైనా సరే ఉభయ సంధ్యలలో, సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తదుపరి, మీ ఇంట్లో మిమల్ని కాపాడే ముఖ్యమైన, మీ ఇంటి సింహ ద్వారము, వీధి గడప, వండుకునే పొయ్యిలను మీరు పసుపు, కుంకుమ మరియు గంధముల తో అలంకరించి ఒక పుష్పానైనా పెట్టి మీ సంకల్పం చెప్పుకొని నమస్కరించుకోండి. ఇలా క్రమం తప్పకుండా 108 రోజులు చేసి చూడండి. దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి తొలగిపోతుంది. కనక మహలక్ష్మి మీ ఇంటిలో నివాసము ఉంటుంది. మీ ఇల్లు, మీరు కూడా చూసే వారికి లక్ష్మీ కళా కాంతులతో అందరికీ కనపడతారు.... దేనికి అయిన నమ్మకం ముఖ్యం. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #dosha pariharalu
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4.1K views
3 months ago
గరుడ ముక్కు కాయలు పరిహారం :- ఇవి గరుడ ముక్కు చెట్టు నుండి లభిస్తాయి. ఈ మొక్కను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కలు మ‌న‌కు విరివిగా క‌నిపిస్తాయి. ఈ గ‌రుడ ముక్కు కాయ‌లు ఎంతో శక్తివంత‌మైన‌వి. ఈ కాయలు గ‌రుత్మంతుని ముక్కులాగా, నాగ ప‌డ‌గ‌లాగా ఉంటాయి. పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహద్వారాలకు కట్టేవారు. అలాగే ఇంట్లో పెట్టుకునే వారు. ఈ కాయ’లకు అతీంద్రియ’ శక్తులు ఉంటాయ’ట. న‌ర దిష్టి, న‌ర పీడను, న‌ర ఘోష వ‌ల్ల ఇంట్లోని వారికి మాన‌సిక ప్ర‌శాంత‌త లేక‌పోవ‌డం, ఇంట్లో డ‌బ్బు నిల‌వ‌క పోవడం, భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఇలా అనేక స‌మ‌స్య‌లు వస్తాయి. ఒక అమావాస్య రోజున 5 లేదా 11 ఎండిన గ‌రుడ ముక్కు కాయ‌ల‌ను సేక‌రించి వాటిని ఇంటికి తీసుకు వ‌చ్చి ధూపం చూపించి వాటిని దండ లాగా గుచ్చి మ‌ర‌ల ధూపం చూపించి ఇంటి సింహ‌ద్వారానికి క‌ట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంటికి ఉన్న నర దిష్టి పోతుంది. అలాగే ఈ కాయలను ఇంట్లో ఎక్కడ ఉంచినా కూడా ఆ ఇంట్లో వారికి దిష్టి తగలేకుండా ఉంటుంది. ఇలా చేయటం వల్ల శత్రు భయాలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లోకి ధ‌నం ప్ర‌వాహంగా వ‌స్తుంద‌ని పూర్వీకులు న‌మ్మేవారు. ఈ కాయ‌ల‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం వల్ల ఆ ఇంట్లో ద‌రిదాపుల్లోకి కూడా భూత ప్రేత పిశాచులు అస్స‌లు రావు. ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ’ వస్తుంది. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #dosha pariharalu
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
681 views
3 months ago
కొబ్బరి నూనెతో దైవారాధన.............!! కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రావిచెట్టు క్రింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారా యణస్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముతైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది. మహాలక్ష్మీదేవికి కొబ్బరినూనెతో 40 రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలు అవుతాయి. ఎవరైతే ప్రతిరోజూ మహాలక్ష్మికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదారన నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి. పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావు. హరిద్వార్‌లో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఎవరైతే కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #dosha pariharalu
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
713 views
3 months ago
సమస్యలకు తీసుకోవలసిన గ్రహాల పరిష్కారం...............!! 1• డబ్బు సమస్య ఉంటే, శుక్రుని నివారణ తీసుకోండి. 2• పిల్లలతో సమస్య ఉంటే - బృహస్పతి నివారణ తీసుకోండి. 3. ఏదైనా శారీరక సమస్య ఉంటే అంగారక గ్రహానికి నివారణ తీసుకోండి. 4• మనస్సు అశాంతితో ఉంటే చంద్రుని నివారణను ప్రయత్నించండి. 5. సమాజంలో మీకు గౌరవం లభించకపోతే, సూర్యుని పరిహారం చేయండి. 6• పని దొరకకపోవడం వల్ల సమస్య ఉంటే, శని గ్రహానికి తగిన చర్యలు తీసుకోండి. 7. కుటుంబ సమస్యలు ఉంటే, రాహువు కోసం చర్యలు తీసుకోండి. 8• ఒంటరితనం సమస్య ఉంటే, కేతువు నివారణ తీసుకోండి. క్రింద ఇచ్చిన గ్రహ నివారణలు........ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. పైన పేర్కొన్న సమస్యలకు ఆయా గ్రహాల అనుగ్రహం పొందడానికి చేయవలసిన సులభమైన, ప్రభావవంతమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి: 1. శుక్రుడు (డబ్బు, విలాసం) ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలంటే: ఏం చేయాలి: మహాలక్ష్మి దేవిని ఆరాధించాలి. తెల్లని వస్త్రాలు, పాలు లేదా పెరుగు దానం చేయాలి. ఎప్పుడు: శుక్రవారం రోజు. ఎలా: ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ, వీలైతే పేద ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇవ్వాలి. ఇంట్లో శుభ్రత పాటించడం శుక్రుడికి చాలా ఇష్టం. 2. బృహస్పతి/గురుడు (సంతానం, విద్య) పిల్లల ఎదుగుదల లేదా సంతాన సమస్యల కోసం: ఏం చేయాలి: దక్షిణామూర్తిని లేదా శివుడిని పూజించాలి. శనగలు దానం చేయడం మంచిది. ఎప్పుడు: గురువారం రోజు. ఎలా: గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అరటి చెట్టుకు నీరు పోసి నమస్కరించుకోవాలి. పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల గురు అనుగ్రహం వేగంగా లభిస్తుంది. 3. అంగారకుడు/కుజుడు (ఆరోగ్యం, ధైర్యం) శారీరక సమస్యలు, రక్త సంబంధిత ఇబ్బందుల కోసం: ఏం చేయాలి: సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజించాలి. కందిపప్పు దానం చేయాలి. ఎప్పుడు: మంగళవారం రోజు. ఎలా: మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి. ఎర్రటి పువ్వులతో పూజ చేయడం శ్రేయస్కరం. 4. చంద్రుడు (మనశ్శాంతి) మానసిక ఆందోళనలు తొలగి ప్రశాంతత కలగాలంటే: ఏం చేయాలి: పార్వతీ దేవిని లేదా శివుడిని పూజించాలి. బియ్యం లేదా పాలు దానం చేయాలి. ఎప్పుడు: సోమవారం రోజు. ఎలా: సోమవారం రాత్రి చంద్ర దర్శనం చేసుకోవాలి. ధ్యానం (Meditation) చేయడం వల్ల చంద్రుని ప్రభావం సానుకూలంగా మారుతుంది. తల్లిని గౌరవించడం ప్రధాన పరిహారం. 5. సూర్యుడు (గౌరవం, కీర్తి) సమాజంలో గౌరవం, తండ్రి తరపు ఆస్తి లేదా ప్రభుత్వ పనుల కోసం: ఏం చేయాలి: సూర్య నమస్కారాలు చేయాలి. గోధుమలు దానం చేయాలి. ఎప్పుడు: ఆదివారం రోజు. ఎలా: ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో 'ఆదిత్య హృదయం' పఠించాలి. రాగి పాత్రలోని నీటిని సూర్యునికి అర్ఘ్యంగా సమర్పించాలి. 6. శని (ఉద్యోగం, వృత్తి) పనిలో ఆటంకాలు, నిరుద్యోగ సమస్యల కోసం: ఏం చేయాలి: ఆంజనేయ స్వామిని లేదా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఎప్పుడు: శనివారం రోజు. ఎలా: శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయాలి. శారీరక శ్రమ చేసే వారికి, పేదవారికి సహాయం చేయడం వల్ల శని దేవుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. 7. రాహువు (కుటుంబ సమస్యలు) కుటుంబంలో గొడవలు, మానసిక భ్రమల నుంచి బయటపడటానికి: ఏం చేయాలి: దుర్గా దేవిని పూజించాలి. మినపప్పు దానం చేయాలి. ఎప్పుడు: శనివారం లేదా రాహుకాల సమయంలో (మంగళవారం/శుక్రవారం). ఎలా: రాహుకాలంలో దుర్గా దేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం చాలా శక్తివంతమైన పరిహారం. కుక్కలకు ఆహారం పెట్టడం కూడా మంచిది. 8. కేతువు (ఒంటరితనం, ఆధ్యాత్మికత) ఏకాకితనం, వైరాగ్యం, చర్మ సమస్యల కోసం: ఏం చేయాలి: వినాయకుడిని పూజించాలి. ఏడు రకాల ధాన్యాలు (నవధాన్యాలు) దానం చేయాలి. ఎప్పుడు: మంగళవారం లేదా బుధవారం. ఎలా: ప్రతిరోజూ గణపతి అథర్వశీర్షం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం చదవాలి. వీలైనప్పుడల్లా పక్షులకు గింజలు వేయాలి. ముఖ్య గమనిక: ఏ పరిహారమైనా పూర్తి నమ్మకంతో, శుచిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. క్రమం తప్పకుండా 11 లేదా 21 వారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #navagraha dosha nivarana #dosha pariharalu #నవగ్రహా